వరంగల్ క్రైం: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో మొత్తం 61 పతాకాలు సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్రాజ్తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
భరోసా కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. సోమవారం వరంగల్ భరోసా కేంద్రాన్ని సందర్శించిన సీపీ బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సీపీతో పాటు క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్సై కిరణ్మయి, కౌన్సెలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత


