కథలాపూర్లో యువత, విద్యార్థులు ఆటలు
ఆడుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు ఆట వస్తువులు సైతం సమకూర్చారు. కాగా, మైదానం సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ పనులు కొనసాగుతుండగా, సబ్స్టేషన్ నిర్మాణ సామగ్రిని మైదానం నుంచి వాహనాల్లో తరలిస్తుండటంతో ప్రాంగణం బోర్డు విరిగిపోయి ఆనవాళ్లు కోల్పోయింది. అధికారులు స్పందించి ప్రాంగణం యథావిధిగా
ఉండేలా చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు, గ్రామస్తులు కోరుతున్నారు.– కథలాపూర్


