
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మల్లాపూర్: అకాల వర్షానికి పంటలు నష్టపోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహరం ప్రకటించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మల్లాపూర్ మండలం ముత్యంపేటలో, ఇబ్రహీంపట్నం మండలకేంద్రంతోపాటు వర్షకొండ, కోజన్కొ త్తూర్, ఎర్దండి గ్రామాల్లో పర్యటించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 30వేల ఎకరాల్లో మామిడికాయలు రాలి ప్రతి మామిడి రైతుకూ తీరని ఆవేదన మిగిల్చిందన్నారు. చేతికొచ్చే దశలో వరి, నువ్వు, సజ్జలు నేలవాలాయని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలతోనే సరిపుచ్చడం కాకుండా రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మల్లాపూర్ మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, ఇబ్రహీంపట్నంలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, తహసీల్దార్ ప్రసాద్, ఏడీఏ రమేష్, ఏవో రాజ్కుమార్, మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.