పారితోషికం ఇప్పించండి
సమగ్ర కుటుంబ సర్వేలో డేటా ఎంట్రీ సేవలందించిన తమకు పారితోషికం అందలేదు. నాలుగు నెలలు గడుస్తున్నా.. తమకు ఇవ్వాల్సిన పారితోషికం అందలేదు. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లాం. అక్కడ అడిగినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ చొరవ తీసుకుని పారితోషికం అందేలా చూడాలి.
– డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మల్యాల
అక్రమ నిర్మాణం తొలగించండి
గొల్లపల్లి మండలం రాపల్లి శివారులో అనుమతులు లేకుండా నిర్మించిన పౌల్ట్రీఫాంను తొలగించాలి. ఈ విషయమై ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. బహిరంగ విచారణలో సదరు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పౌల్ట్రీఫాంను వెంటనే కూల్చివేయాలి.
– గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామస్తులు
పారితోషికం ఇప్పించండి


