ఇరాన్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన! | Trump Announces Landmark Iran Deal Says Strait of Hormuz Will Reopen | Sakshi
Sakshi News home page

ఇరాన్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!

Jun 13 2026 11:48 PM | Updated on Jun 14 2026 1:07 AM

Trump Announces Landmark Iran Deal Says Strait of Hormuz Will Reopen

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలను తరిమేస్తూ శాంతికపోతాలకు స్వాగతం పలుకుతూ శాశ్వత శాంతి ఒప్పందం ఇరాన్‌తో ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం రాత్రి ప్రకటించారు. ఒప్పందం సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరికీ తెరుస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు.

ఇరాన్‌ విషయంలో ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎత్తిపొడుస్తూ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘బరాన్‌ హుస్సేన్‌ ఒబామా ఇరాన్‌తో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ(జేసీపీఓఏ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరాన్‌ అణ్వాయుధం తయారీకి ఒక రకంగా బాటలుపరిచింది. ఇది ఇలాగే అమల్లో ఉండి ఉంటే ఇరాన్‌ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని తయారుచేసి ఉండేది. ఇప్పటికే దానిని ఉపయోగించేవారు. ఇరాన్‌తో నేను కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధం.

ఇరాన్‌ అణ్వాయుధ కలను కల్లను చేసే ఒప్పందం ఇది. కొనుగోలు, సమీకరణ, అభివృద్ధి ద్వారా కూడా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా నా ఒప్పందం చేస్తుంది. ఇంతటి గొప్ప ఒప్పందం ఆదివారం జరగబోతోంది. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరి కోసం తెరుస్తాం. ఇరాన్‌తో మా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్‌ కోసం ఖర్చుచేశారు. కానీ మేం అదనుచూసి గుట్టుచప్పుడుకాకుండా ఇరాన్‌లోని అణుధూళిని పట్టుకొచ్చేస్తాం.

అద్భుతమైన పైలట్లు బీ–2 బాంబర్‌ విమానాలతో ఇరాన్‌ పర్వతాల్లో రేడియోధార్మిక పదార్థాన్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు మేం ఇరాన్‌తో, యావత్‌ పశి్చమాసియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్‌లోనూ కలిసి పనిచేస్తాం. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది ఒకవేళ ఆచరణసాధ్యంకాకపోతే మాకు భయంకరమైన ప్రత్యామ్నాయం ఉంది. ఇది ఎప్పటికీ ఉపయోగించకూడదనే కోరుకుంటున్నా’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

]

24 గంటల్లోనే: షెహబాజ్‌ షరీఫ్‌
యుద్దం ముసిగి శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కావొచ్చని అంతకుముందు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగీ్చలను ట్యాగ్‌ చేశారు. ‘‘శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చేశాం. రాబోయే 24 గంటల్లో దీనికి తుదిరూపం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒప్పందంపై ఎల్రక్టానిక్‌ విధానంలో అమెరికా, ఇరాన్‌లు సంతకాలు పెట్టేందుకు పాకిస్తాన్‌ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగనున్నాయి. శాంతి చర్చల సమయంలో అమెరికా, ఇరాన్‌లు చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు’’అని షరీఫ్‌ తెలిపారు.

వచ్చే నెల 4న ఖమేనీ అంత్యక్రియలు!
ఇస్లామాబాద్‌: ఇరాన్‌ దివంగత సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4వ తేదీన జరుగుతాయని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. పశి్చమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా అమెరికా, ఇరాన్‌ల మధ్య అతిత్వరలో ఒప్పందం కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ట్రంప్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారం: ఇరాన్‌ 
ఒమన్‌ తీరంలో భారతీయులున్న మూడు నౌకలపై ఇరాన్‌ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలను భారత్‌లోని ఇరాన్‌ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటన నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇరాన్‌పై అసంబద్ధ ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టుచేసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement