Strait of Hormuz
-
హర్ముజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్
ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు హర్మూజ్ జలసంధి వైపే. హర్మూజ్ జలసంధిని తెరవడం.. కీలక నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు దేశాలు నడుంబిగించిన వేళ.. మళ్లీ హర్మూజ్ జలసంధి మూతపడింది. నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) హర్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. రోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ మూసేసింది. అమెరికా వైఖరి కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట మాట్లాడుతున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో ఇరాన్కు అంతు చిక్కడం లేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మరి కాసేపటికి హర్మూజ్ జలసంధిని తాము మూసివేస్తున్నామని ప్రకటించారు ట్రంప్. దాంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ ట్రంప్ మాటల్లో స్పష్టత లేదని అభిప్రాయానికి వచ్చేసింది ఇరాన్. అంతే హర్మూజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసింది. నిన్న ఏం జరిగిందంటే..నిన్న శుక్రవారం ప్రపంచదేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే ఇంతకాలం హెచ్చరికలు జారీ చేసిన టెహ్రాన్ ఎట్టకేలకు బెదిరింపులకు స్వస్థి పలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉపిరి పీల్చుకున్నాయి. హర్మూజ్పై ఇరాన్ ప్రకటనతో నిన్న స్టాక్మార్కెట్లకు ఊపందుకున్నాయి. అమెరికా స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడవగా ముడిచమురు నేలచూపులు చూసింది. దీనికి కారణం హర్మూజ్కు ఇరాన్ విముక్తి కలిగించడమే అయితే ట్రంప్ చేష్టలతో ఇరాన్కు మరోసారి నమ్మకం చల్లగిల్లింది.ట్రంప్ కామెంట్స్ ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ అన్నింటికీ అంగీకరించింది ‘‘ అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి" అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సీరియస్దీనిపై ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ట్రంప్ ద్వంద్వ వైఖరిఇలా ఒకవైపు చర్చలు అంటూనే ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రకటించారు. హర్మూజ్ను ఇరాన్ తెరిచిన దానికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. కాసేపటికి దాన్ని తాము మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ఇక తమది అనే సంకేతాలిచ్చిన ట్రంప్.. ఇరాన్ను మళ్లీ బెదిరించే యత్నం చేశారు. కథ మళ్లీ మొదటికిఈ పరిస్థితుల నడుమ హర్మూజ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఇరాన్ను బెదిరించే యత్నాలు చేశారు ట్రంప్. హర్మూజ్ తమది అనడంతోపాటు అణుకార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన ఇరాన్,.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దాంతో హర్మూజ్ కథ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్లీ హర్మూజ్ను ఇరాన్ మూసేయడంతో ఇది ఎటువైపు పోతుందో అనే చర్చ మొదలైంది. -
పెట్రోలుకు నీటి వాకిలి హార్మోజ్ జలసంధి
ఇప్పుడు రోజూ హార్మోజ్ జలసంధి వార్తల్లో ఉంది. యుద్ధం జరుగుతుంటే దానిని ఒక దేశం మూసేస్తానంటే మరో దేశం తెరుస్తాను అంటోంది. దీని వివరాలు చూద్దాం. అసలు జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద సముద్రాలను కలిపే సన్నటి నీటి దారిని ‘జలసంధి’ అంటారు. ఇది ఒక నీటి వంతెన లాంటిది. మన ఇంటి సందులో నుంచి మెయిన్ రోడ్కి వెళ్లినట్టు. హోర్ముజ్ జలసంధి కూడా అలాంటిదే. ఇది ఇరాన్ దేశం, ఒమన్ దేశం మధ్యలో ఉంది. పర్షియన్ గల్ఫ్ అనే సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలుపుతుంది. మ్యాప్లో చూస్తే V షేప్లో కనిపిస్తుంది. దీని పేరు ‘హోర్ముజ్’ అనే దీవి పేరు మీదుగా వచ్చింది. ఆ దీవి ఒకప్పుడు వ్యాపారానికి చాలా ఫేమస్.ఏమిటి ఈ జలసంధి ప్రత్యేకత?ప్రపంచంలో రోజూ వాడే పెట్రోల్, డీజిల్లో దాదాపు 20%– అంటే రోడ్డు మీద తిరిగే 5 పెట్రోలు ట్యాంక్ లారీల్లో 1 లారీలోని సరుకు– ఇదే దారిలో షిప్పుల్లో వెళ్తుంది. అందుకే దీన్ని ‘ఆయిల్ హైవే’ అంటారు. ఈ జలసంధి మొత్తం వెడల్పు 33 కిలోమీటర్లు. కానీ పెద్ద పెద్ద షిప్పులు వెళ్లడానికి కేవలం 3 కి.మీ. దారి మాత్రమే వాడతారు. రెండు వైపులా వెళ్లే, వచ్చే షిప్పులకు వేరు వేరు లైన్లు ఉంటాయి – రోడ్ మీద లాగా. రోజుకి దాదాపు 20–30 పెద్ద ఆయిల్ ట్యాంకర్ షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తాయి. ఒక్కో షిప్ 2 కోట్ల లీటర్ల ఆయిల్ తీసుకెళ్లగలదు!ఇక్కడ ఎందుకు గొడవలు?ఈ దారి చాలా చిన్నది కాబట్టి, ఏదైనా దేశం దీన్ని మూసేస్తే ప్రపంచానికి పెట్రోల్ దొరకడం కష్టం. పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే అన్ని దేశాలు దీన్ని జాగ్రత్తగా చూస్తాయి. మనం వాడే పెట్రోల్, డీజిల్లో చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచి ఇదే దారిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే మన బైక్, బస్ రేట్లు కూడా పెరుగుతాయి. హోర్ముజ్ జలసంధి అంటే ప్రపంచానికి పెట్రోల్ పంచే ‘సన్నటి డోర్’. ఆ డోర్ సేఫ్గా ఉంటేనే మన వాహనాలు స్మూత్గా నడుస్తాయి. -
బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్ విషయం, ఇరాన్తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.కాగా, ఇరాన్ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్ ఇరాన్ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.#WATCH | On being asked if he will extend the ceasefire, US President Donald Trump says, "Maybe I won't extend it. But the blockade is going to remain. So you have a blockade, and unfortunately, we'll have to start dropping bombs again..."(Source: The White House) pic.twitter.com/6HURzpzE0s— ANI (@ANI) April 18, 2026మళ్లీ మూసివేస్తాం: ఇరాన్ఇరాన్ పోర్టుల దిగ్బంధమనం కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్ధాలేనని ఘాలిబఫ్ తెలిపారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని పేర్కొన్నారు.ఐఆర్జీసీ హెచ్చరిక.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగమంత్రి ప్రకటించగా, IRGC నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టంచేసింది. ఈ నిబంధనలన్నీ.. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. -
గంటలో ట్రంప్ 7 అబద్ధాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది అసలు నోరేనా? అని అంటోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్హౌజ్ వేదికగా ఒక్క గంటలో ఆయన ఏడు ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఏ ఏడు ఏంటంటే.. ఇరాన్-అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా నౌకా దళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తాము హార్ముజ్ను మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్.. డోనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఎక్స్ వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దిగ్బంధనం కొనసాగితే, హార్ముజ్ జలసంధి ఎంతమాత్రం తెరిచి ఉండదంటూ ఆయన స్పష్టం చేశారు. "వారు ఈ అబద్ధాలతో యుద్ధంలో గెలవలేదు. చర్చల్లో కూడా ఎక్కడికీ వెళ్లలేరు. జలసంధి తెరిచి ఉందా లేదా అనేది క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయి కానీ సోషల్ మీడియా కాదు. ట్రంప్ ఒక గంటలో ఏడు ఆరోపణలు చేశారని.. అవన్నీ అబద్ధాలు’’ అంటూ ఘలీబాఫ్ కొట్టిపారేశారు. అయితే, ఆ ఏడు అవాస్తవాలు ఏమిటనేది ఆయన స్పష్టంగా వివరించలేదు.లెబనాన్లో కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకల కోసం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా దాదాపు రెండు నెలల పాటు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ దీనిని తెరిచినప్పటికీ, వాణిజ్య నౌకలు భద్రతా హామీల కోసం వేచి చూస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.అయితే, ఇరాన్ యుద్ధంపై గతంలో ట్రంప్ ఏడు స్టేట్మెంట్లను పరిశీలిస్తే.. అవన్నీ అబద్ధాలేనని తేలింది. హార్ముజ్ పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఇరాన్.. మా అనుమతితో మాత్రమే తెరుస్తామని చెబుతోంది. నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయగా.. ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అంటూ అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని ఇరాన్ చెప్పింది. ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యలను ఘలీబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ యుద్ధంలో నిలబడిందని పేర్కొన్నారు.అలాగే, చర్చలు దాదాపు పూర్తయ్యాయని ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. యురేనియం తరలింపు వంటి అంశాలు ఎప్పుడూ చర్చల్లో లేవని స్పష్టం చేసింది. ఇరాన్ యురేనియం అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని పేర్కొంది. హార్ముజ్ ఎప్పటికీ తెరిచి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ ఇస్తూ.. ఆంక్షలు కొనసాగితే హార్ముజ్ను మూసివేస్తామని హెచ్చరించింది. అమెరికా–ఇరాన్ ఒప్పందం త్వరగా కుదురుతుందని ట్రంప్ చెప్పగా.. ఇది అవాస్తమంటూ పేర్కొన్న ఇరాన్.. చర్చలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయని తెలిపింది.హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పారు.. మా అనుమతితోనే తెరుస్తామని ఇరాన్ చెప్పిందినావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ అన్నారు.. అమెరికా బ్లాకేడ్ కొనసాగుతోందని ఇరాన్ అంటోందిఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్ స్పష్టం చేసిందిచర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్ చెబుతోందిశుద్ధి యురేనియం ఇరాన్ అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్ అంటోందిహర్ముజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పడం.. అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించిందిడీల్ త్వరలోనే అని ట్రంప్.. చర్చలు క్లిష్టదశలో ఉన్నాయని ఇరాన్ స్పష్టీకరణ -
ఇరాన్కు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయంతో ఇరాన్ జలమార్గం నుండి సముద్ర మైన్లను తొలగిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మైన్లను తొలగించడానికి అమెరికా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు.ఇక, అమెరికా నేవీ ఇప్పటికే ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్ను మైన్ క్లియరింగ్ ఆపరేషన్ల కోసం అక్కడ ఉంచారు. అలాగే, అదనంగా జపాన్ నుంచి రెండు మైన్ క్లియరింగ్ నౌకలు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో హార్మూజ్లో చిన్న పడవల సాయంతో ఇరాన్ మైన్లను అమర్చింది. కాగా.. గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, హార్మూజ్లో ఇరాన్ వేసిన అన్ని మైన్స్ను గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని మైన్స్.. నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపింది. దీంతో, నీటి నుంచి మైన్స్ను తీయడం కష్టంగా మారిందని పేర్కొంది.మరోవైపు.. బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలకు హార్మూజ్ జలసంధిలో ఉన్న మైన్లను తొలగించే సామర్థ్యం ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలకు ఐరోపా దేశాలు పూర్తి మద్దతుతో కూడిన ఎస్కార్ట్ సేవలను అందించగలవని వాట్రిన్ తెలిపారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు.సమావేశానికి మాక్రాన్, స్టార్మర్ నాయకత్వంమరోవైపు ఇరాన్పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.సుమారు 40 దేశాల నాయకులు హాజరుకాగా మాక్రాన్తో కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పారిస్కు చేరుకోనున్నారు. అలాగే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని కూడా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతర ప్రపంచ నేతలు వర్చువల్గా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఇరాన్తో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సముద్ర మార్గం గుండా సురక్షిత ప్రయాణం లక్ష్యంగా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియా CNN పేర్కొంది. అయితే, ఆ జాబితాను ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ (International Maritime Organization) చేస్తున్న పనికి మద్దతు ఇవ్వడంపై కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని పేర్కొంది. -
ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్
-
ఇరాన్.. హర్ముజ్.. ట్రంప్.. అంతా గందరగోళమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేందుకు రెండో దఫా చర్చలకు అమెరికా-ఇరాన్లు సిద్ధపడుతున్నాయి. తేదీ ఇంకా ఖరారు కాకపోయినా మళ్లీ పాకిస్తాన్ వేదికగానే చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు.. ఇటు ఇరాన్ వాటిని ఖండించుకుంటూ పోతుండడం ఈ సంక్షోభంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఓ మెట్టు కిందకు దిగింది. లెబనాన్ కాల్పుల విరమణ కుదరడంతో హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. ‘హర్ముజ్ను పూర్తిగా తెరిచాం. చమువురు నౌకల రాకపోకలను అడ్డుకోం. కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకలకు సురక్షితంగా మార్గం ఉంటుంది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఈ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. పది శాతం దాకా రేట్లు తగ్గాయి. అయితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన గందరగోళానికి దారి తీసింది. ఇరాన్తో జరుగుతున్న చర్చల వ్యవహారం పూర్తయ్యే వరకు హర్ముజ్లో తమ బ్లాకేడ్(దిగ్బంధంనం).. అదీ ఫుల్ ఫోర్స్తో కొనసాగుతుందని ప్రకటించారు. అయితే.. చర్చల ప్రక్రియ త్వరగానే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు అంశాలపై చర్చలు జరిగాయని, వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ అన్నింటికీ అంగీకరించిందని.. కానీ యురేనియంపై డీల్ కుదిరేవరకు ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ అన్నారు. ‘‘అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి అని వ్యాఖ్యానించారు.అయితే.. ఇరాన్ మాత్రం ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారని అంటోంది. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ఈ లెక్కన హర్ముజ్తో పాటు యురేనియం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గబోదని స్పష్టమవుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో.. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా.. ఇరాన్లో 3,000 మంది, లెబనాన్లో 2,100 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.హర్ముజ్ జలసంధి.. శుద్ధి చేసిన యురేనియం, ఫ్రీజ్ చేసిన నిధులు.. ఈ విషయాల్లో రెండు దేశాల మధ్య చర్చల్లో ఎటూ తేలడం లేదు. ఈ నెల 11వ తేదీన పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చల్లో అయినా ఈ అంశాలు ఓ కొలిక్కి వస్తేనే యుద్ధం ఆగేది. లేకుంటే.. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ -
హార్మూజ్ తెరుచుకుంది
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ ప్రపంచదేశాలకు శుక్రవారం శుభవార్త విన్పించింది. పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే బెదిరింపులకు స్వస్తిపలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు హార్మూజ్ జలసంధిని బార్లా తెరుస్తున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ వార్త వినగానే ప్రపంచదేశాలు చమురుసంక్షోభం బారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నాయి. స్టాక్మార్కెట్లకు సైతం కొత్త ఊపొచ్చింది. అమెరికా స్టాక్మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అనూహ్య డిమాండ్తో ముందస్తు కొనుగోళ్లతో ముడిచమురు ధర కొండెక్కగా తాజా వార్తతో ధర నేలచూపులు చూసింది.మార్చి నెలలో గరిష్టంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 119 డాలర్లకు పెరగ్గా శుక్రవారం శుభవార్త తర్వాత ఒక్కసారిగా 90 డాలర్ల దిగువకు దిగొచ్చింది. ధర శుక్రవారం ఉదయం 98 డాలర్లు ఉండగా హార్మూజ్ వార్త వెలువడగానే 10 శాతం పడిపోయి 88 డాలర్లకు చేరుకుంది. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు మొదలుకానున్నాయని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘‘జలసంధిని తెరుస్తున్నామని ఇప్పుడే ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్ గుండా రాకపోకలు ఊపందుకోనున్నాయి. థాంక్యూ. అయితే హార్మూజ్పై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది. హార్మూజ్ గుండా ఇరాన్, దాని మిత్రదేశాల నౌకల రాకపోకలను అడ్డుకుంటాం.ఇరాన్తో శాంతి ఒప్పందం 100 శాతం పూర్తయి, అమల్లోకి వచ్చేదాకా, యుద్ధం ముగిసేదాకా ఇరాన్కు చెందిన నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. ఇరాన్తో చర్చల్లో ఇప్పటికే చాలా అంశాల్లో ఏకాభిప్రాయం సాధించాం. లెబనాన్ ప్రస్తావన, దానితో సంబంధం లేకుండానే ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాం. అమెరికా సాయంతో ఇరాన్ జలసంధిలోని పాత సముద్ర మందుపాతరలను తొలగిస్తోంది. మరోసారి హార్మూజ్ను మూసేయబోమని ఇరాన్ మాకు హామీ ఇచ్చింది. ప్రపంచానికి వ్యతిరేకంగా హార్మూజ్ను ఆయుధంగా ఇరాన్ ఉపయోగించడం సాధ్యపడదు’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంతో హార్మూజ్ను తెరుస్తున్నాం.తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉండే ఈ పది రోజులపాటే హార్మూజ్ తెరచి ఉంటుంది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. హార్మూజ్ను తెరవాలంటే తొలుత లెబనాన్పై కాల్పులు ఆపేయాలన్న డిమాండ్కు ఇజ్రాయెల్, అమెరికా తలొగ్గడంతోనే హార్మూజ్ను తెరుస్తున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. పాకిస్తాన్ సాయుధబలగాల సారధి, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ టెహ్రాన్లో ఇరాన్ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన మరుసటిరోజే హార్మూజ్పై ఇరాన్ కీలక ప్రకటన వెలువర్చడం గమనార్హం. క్షేమంగా రవాణాపై సమావేశం మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో ఉమ్మడిగా పనిచేయాలని డజన్లకొద్దీ దేశాలు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం పారిస్లోని దేశాధ్యక్షభవనంలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీసహా 30 దేశాల అధినేతలు, 20 అంతర్జాతీయ కూటముల అధ్యక్షులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి జర్మనీ చాన్స్లర్ ఫెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతదితరులు స్వయంగా, ఇతరులు వర్చువల్గా హాజరయ్యారు. నాటోపై ట్రంప్ ఆగ్రహం ‘‘ఇప్పుడు హార్మూజ్ జలసంధి వివాదం ముగిసిపోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు తీరిగ్గా నాటో కూటమి నుంచి నాకు ఫోన్కాల్ వచ్చింది. మీకేమైనా సాయం కావాలంటే చేసిపెడతామని అడిగారు. మీ సాయం నాకు అస్సలు అక్కర్లేదని ముఖంమీదే చెప్పేశా. అవసరమైనప్పుడు సాయపడకుండా ముఖంచాటేశారు. నాటో కేవలం కాగితం పులి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చించి ఇరాన్ను పాక్ ఒప్పించిందని ట్రంప్ ఆ దేశాన్ని పొగిడారు. ‘‘పాకిస్తాన్కు, పాక్ గొప్ప ప్రధానికి, ఫీల్డ్ మార్షల్కు కృతజ్ఞతలు. ఇద్దరూ గొప్ప వ్యక్తులు’’అని ట్రంప్ ఒక పోస్ట్చేశారు. -
ఇరాన్ యురేనియం మా చేతికి
వాషింగ్టన్/దుబాయ్/బీరూట్/ఇస్లామా బాద్: భీకర దాడుల దెబ్బకు ఇరాన్ తమ డిమాండ్లకు తల ఊపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక కీలక పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ భూగర్భ అణు కేంద్రాల్లోని దాచిపెట్టిన అత్యంత శుద్ధమైన 450 కేజీల యురేనియం నిల్వలపై అమెరికా బీ2 బాంబర్లు భారీ బాంబును పడేసి సర్వనాశనం చేశాయి. దీంతో యురేనియం రేణువులుగా మట్టిలో కలిసిపోయింది. ఆ అణుమట్టి మా చేతికి రాబోతోంది. ఈ మట్టిని అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుంది. ఇందుకోసం ఎలాంటి నగదు చేతులు మారబోదు’’అని అన్నారు. శుద్ధ యురేనియం అప్పగింతపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్, పాకిస్తాన్గానీ ఇటు ఇరాన్గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మరోదఫా చర్చలకు పాకిస్తాన్ రంగం సిద్ధంచేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా గత వారం జరిగిన చర్చలు విఫలమవడంతో ఈసారి వినూత్న ప్రతిపాదనలతో ముందుకెళ్లి ఎలాగైనా రెండో దఫా చర్చలను విజయవంతంచేయాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఖతర్, సౌదీ అరేబియాల అగ్రనేతలతో చర్చలు ముగించుకుని గురువారమే టెహ్రాన్కు చేరుకుని ఇరాన్ అగ్రనాయకత్వంతో విస్తృతంగా చర్చించారు. ఆదివారం లేదా వచ్చే వారం పాక్లోని ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలో అమెరికా–ఇరాన్ చర్చలు జరిగే ఆస్కారముంది. కాల్పులవిరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 22వ తేదీన ముగిసేలోపే శాశ్వత శాంతి ఒప్పందం ఖరారుచేయాలని మధ్యవర్తిత్వ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చర్చలు సఫలమైతే శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. చర్చలు సానుకూలంగా సాగుతుంటే, తప్పదనుకుంటే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తానని ట్రంప్ చెప్పారు. నేరుగా చర్చలొద్దు: హెజ్భొల్లా ఇజ్రాయెల్తో నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగకూడదని లెబనాన్ ప్రభుత్వాన్ని హెజ్భొల్లా సాయుధులు హెచ్చరించారు. ‘‘నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగితే దక్షిణ లెబనాన్ సరిహద్దు ఆక్రమిత ప్రాంతాల్లో శాశ్వతంగా తిష్టవేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుంది. అలా జరక్కుండా చూడాల్సిన బాధ్యత మీదే. అసలే మీది అసమర్థ ప్రభుత్వం. అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాలు లెబనాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి’’అని హెజ్భొల్లా పార్లమెంటరీ విభాగ నాయకుడు హసన్ ఫదలల్లాహ్ హెచ్చరించారు. దక్షిణ లెబనాన్పై దాడిచేస్తే మేం చూస్తూ ఊరుకోబోమని హెజ్భొల్లా పునరుద్ఘాటించింది. మరోవైపు లెబనాన్– ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ట్రంప్ ముక్కుసూటి, దౌత్యనీతితో ఈ కాల్పుల విరమణను సుసాధ్యంచేశారు’’అని షెహబాజ్ పొగిడారు. ఒప్పందానికి తూట్లు! ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కుదిరిన పదిరోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి శుక్రవారం ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది. బిన్ట్ జబేయిల్ జిల్లాలోని కౌనిన్ గ్రామంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిచేసింది.ఈ ఘటనలో ఒక సిరియన్ మూలాలున్న వ్యక్తి చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. దాడిలో కారు, బైక్ ధ్వంసమయ్యాయి. దక్షిణ లెబనాన్పై పలు చోట్ల మోర్టార్ దాడులు జరిగాయని లెబనాన్ ఆర్మీ, అమెరికా శాంతిదళ సభ్యులు శుక్రవారం తెలిపారు. దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ కాల్పులవిరమణ వేళ కవి్వంపు చర్యలకు దిగినా తాము దీటుగా దాడులతో సమాధానం చెప్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు రాకెట్లు, క్షిపణులతో ఉన్న సాయుధ హెజ్భొల్లాను పూర్తిగా నిర్వీర్యంచేస్తేగానీ తమ లక్ష్యం నెరవేరదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకొచ్చామని, వెనుతిరిగే ప్రసక్తే లేదని తెలిపారు. బలగాల ఉపసంహరణ ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. కాగా లెబనాన్పై ఇప్పటికే అతిగా దాడులుచేశారని, ఇక ఆపేయాలని ఇజ్రాయెల్కు ట్రంప్ శుక్రవారం సూచించారు. తిరిగొస్తున్న స్థానికులు.. లెబనాన్లో పదిరోజులపాటే కాల్పులమోత ఆగుతుందని తెల్సి కూడా గతంలో వలసపోయిన వేలాది మంది స్థానికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లిటానీ నది మీదుగా ఖాస్మియే వంతెన మీదుగా దక్షిణ లెబనాన్కు వేలాది మంది జనం కార్లు, వాహనాల్లో బయల్దేరడంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరుపులు, సూట్కేసులు, నిత్యావసర వస్తువులతో వాహనాలు నిండిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 2,294 మంది చనిపోయారని లెబనాన్ ప్రకటించింది. -
నేను హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అమెరికా మాత్రం తన బ్లాకేడ్ను ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ‘హర్మూజ్ తెరిచి ఉంది.. కానీ ఇరాన్తో మా లావాదేవీ పూర్తయ్యే వరకు బ్లాకేడ్ కొనసాగుతుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో ప్రకటించారు.ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపాయి. ఇరాన్ సముద్ర మార్గం తెరవడం వల్ల చమురు ధరలు తగ్గి ఊరటనిచ్చినా, అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుండటం ఉద్రిక్తతలను తగ్గించలేకపోయింది. అమెరికా–ఇరాన్ చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు అణు అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను మాకు అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్తో కలిసి భూగర్భంలో దాచిన యురేనియాన్ని తొలగించనున్నాం’అని చెప్పారు. అంతకుముందు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక ప్రకటన చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ సమయంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు 10 శాతం వరకు తగ్గాయి. -
హార్ముజ్ దిగ్బంధం వేళ.. యూఎస్ సంచలన వీడియో విడుదల
ఇరాన్ నౌకాశ్రయాలు, తీరప్రాంతాలు లక్ష్యంగా తాము చేపట్టిన దిగ్బంధం (Blockade) కార్యకలాపాలలో భాగంగా ఓ వాణిజ్య నౌకను అమెరికా నావికాదళ హెలికాప్టర్ పక్కకు మళ్లించిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ షేర్ చేసిన ఈ వీడియోలో యూఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ (DDG 112) నౌకలోని ఒక నావికుడి ఆడియో సందేశం ఉంది. ఒమన్ గల్ఫ్ మీదుగా ఆ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ఎగురుతున్నట్లు ఈ ఫుటేజీలో కనిపిస్తోంది.ఇరాన్ నౌకాశ్రయాల్లోకి రాకపోకలు సాగించే నౌకలపై ఆంక్షలను అమలు చేస్తున్న క్రమంలో అమెరికా దళాలు ఓ వాణిజ్య నౌకను నియంత్రిస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. కాగా, 10 వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హార్ముజ్ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’ అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు.Audio🔊of a Sailor aboard USS Michael Murphy (DDG 112), with video from the guided-missile destroyer’s embarked helicopter flying over the Gulf of Oman, as the U.S. Navy diverts a merchant vessel while enforcing the blockade on ships entering or departing Iranian ports. U.S.… pic.twitter.com/10QxlEoGkk— U.S. Central Command (@CENTCOM) April 16, 2026హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. -
ఆయనది పత్తి గింజల కలే!
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నామని చెప్పిన ఆయన.. అమెరికాకు ఈ డీల్ ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన గాల్లో కోటలు కట్టుతున్నాడంటూ ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది.శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ గురువారం వైట్హౌజ్లో ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని.. ఈ ఒప్పందం కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ (Islamic Republic of Iran Broadcasting) వెటకారంగా స్పందించింది.ట్రంప్ గాల్లో కోటలు కడుతున్నారంటూ ఆయన మాట్లాడిన వీడియోతో ఐఆర్ఐబీ ఓ పోస్ట్ చేసింది. దీనికి అదనంగా ఓ పర్షియన్ సామెతను ఉటంకించింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది. ట్రంప్ కూడా అంతే. ఆయన ఊహాలోకంలో విహరిస్తున్నారు’’ అంటూ సెటైర్ వేసింది.Building castles in the air!Or in Persian we have a similar proverb:'The camel dreams of cottonseed; sometimes gulping it down, sometimes eating it grain by grain!'شتر در خواب بیند پنبهدانهگهی لپلپ خورد گه دانه دانه pic.twitter.com/HA15h1aQVU— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 16, 2026సాధారణంగా.. సాధ్యంకాని విషయాలను కలలు కనే వ్యక్తులను ఎగతాళి చేయడానికి ఈ పర్షియన్ సామెతను వాడుతుంటారు. విశేషం ఏంటంటే.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఈ సామెతను ఉపయోగించారు. ఆయన 2026 ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తనయుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు.యురేనియం విషయంలో ట్రంప్నకు ఎలాంటి మాట ఇవ్వలేదని ఇరాన్ మీడియా తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది. ఆయన ఏవేవో క్లెయిమ్లు చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు చెబుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీల్ కుదిరితే.. పాకిస్థాన్కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో తానూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాదు.. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు కూడా తాను సిద్ధమేనని అంటున్నారు. ఈ నెల 22వ తేదీతో ఆ గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. -
నాటో కూటమి కథ కంచికేనా?
ఇరాన్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమి ‘నాటో’లో అంతర్యుద్ధానికి కారణమవటం ప్రపంచ జియో పొలిటికల్ చదరంగాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. తమ దేశాల నౌకా బలగాలను హార్మూజ్ జలసంధి వద్ద మోహరింప చేయాలన్న యూఎస్ అధ్య క్షుడి విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. తమ దేశాలలోని సైనిక స్థావరా లను వినియోగించటానికి అంగీకరించ లేదు. ఈ యుద్ధం మా (నాటో) యుద్ధం కాదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు నాటో కూటమిని ‘కాగితపు పులి’గా అభి వర్ణిస్తూ యూఎస్ఏ దాన్నుండి వైదొలుగుతుందని బెదిరించాడు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని (ఇరాన్ యుద్ధాన్ని) సమర్థించని, యూఎస్ఏకు సహాయపడని మిత్ర దేశాలను యూఎస్ఏ రక్షించ బోదని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించాడు. ఐరో పాను రక్షించటానికి మాత్రమే నాటో కూటమి ఏర్పడలేదనీ, యూఎస్ ఏను సమర్థించటం కూడా నాటో ప్రధాన విధి అనీ యూఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అభిప్రాయ పడ్డాడు.ప్రపంచాన్ని శాసించిన శక్తిరెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1949లో పన్నెండు దేశాలతో ఆవిర్భవించిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి ఇటీవల స్వీడన్ చేరికతో 32 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాను అడ్డుకోవటానికి యూఎస్ఏ నాయ కత్వంలో ఏర్పడిన ఈ సైనిక–రాజకీయ కూటమి గత 75 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను శాసించిందనటంలో సందేహం లేదు. ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా దానిని మొత్తం కూటమి మీద దాడిగా పరిగణిస్తుంది. 32 సభ్య దేశాలే కాకుండా, 40 ఇతర దేశాలతో కూడా ఈ కూటమి సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకున్నది. సోవియట్ రష్యాను నిలువరించటానికి స్థాపించబడిన ‘నాటో కూటమి’ని సోవియట్ విచ్ఛిన్నం తరువాత కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదు. రష్యా బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసు కొని ఈ కూటమి సోవియట్ ప్రాబల్య ప్రాంతాలలోనికి విస్తరించింది. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసింది. నాటో సభ్య దేశాలలో యూఎస్ఏ నాయకత్వంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ స్థావరాలలో అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను ఎదుర్కొనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను, అమెరికన్ సైనికులను మోహరించి ఆ యా దేశాలకు యూఎస్ఏ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. సైనిక, గూఢచర్య సమాచారాన్ని, సైబర్ సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఈ దేశాలపై సోవియట్ యూనియన్ (రష్యా), ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్నది.యూఎస్ఏ నీడన ఐరోపా1990వ దశకం నుండి క్రమంగా నాటో దేశాలలో అలసత్వం ప్రవేశించింది. తమ దేశాల సైనిక, రక్షణ బాధ్యతను పూర్తిగా యూఎస్ఏ పైన తోసివేశాయి. తమ రక్షణ ఖర్చులను తగ్గించి, పూర్తిగా సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు రష్యా ముప్పుగా కనప డటం ఆగిపోయింది. నాటో కూటమి ఒప్పందం ప్రకారం ప్రతి సభ్య దేశం తన జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయా లనే నిబంధనను ఖాతరు చేయలేదు. మొత్తం రక్షణ వ్యయంలో 65 శాతం యూఎస్ఏ భరిస్తోంది. ఇదే సమయంలో ఈ ఐరోపా దేశాలు తమ తయారీ రంగాన్ని దాదాపుగా చైనాకు అవుట్సోర్సింగ్ చేశాయి. మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, మొరాకో, అల్జీరియా వంటి దేశాల నుండి చౌక శ్రామికుల వలసలను ప్రోత్సహించాయి. ఇంధన అవసరాలకు రష్యా నుండి చౌకగా వచ్చే గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డాయి. స్థూలంగా పరిశీలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ మొదలగు ఐరోపా దేశాలు గత నాలుగు దశాబ్దా లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎగుమతి–దిగుమతి వ్యాపారం, విలాస వస్తువుల తయారీ వంటి రంగాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్నత జీవన ప్రమాణాలను అను భవిస్తున్నాయి.ట్రంప్ 2025లో అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్’ నినా దాన్ని అందుకొన్నాడు. నాటో రక్షణ వ్యయంలో కూటమి దేశాలు తమ వంతు వాటాను భరించాల్సిందేనని మెలిక పెట్టాడు. ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను మోస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరాన్ యుద్ధంలో మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అమెరికా కోణంలో ఆలోచిస్తే ఈ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం తమ యుద్ధం కాదనేది యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వాదన. ఇదే కోణంలో ఆలోచిస్తే ఉక్రెయిన్ యుద్ధం కూడా యూఎస్ఏ యుద్ధం కాదు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటున్నది యూఎస్ఏ సైనిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, యూఎస్ఏ ఆర్థిక సహాయమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.మాటలతో మారిన తీరు2003 ఇరాక్ యుద్ధంలో కూడా నాటో దేశాలు పాల్గొనటం విషయంలో ఇదేరకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయిన ప్పటికీ యూకే, స్పెయిన్, ఇటలీ, పోలండ్ తమ సైనికులను యూఎస్ఏకు మద్దతుగా పంపించాయి. ప్రస్తుత ఇరాన్ యుద్ధం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించేముందు నాటో దేశాలతో చర్చించలేదు. గ్రీన్ల్యాండ్ విషయంలో ఐరోపా దేశాలను ట్రంప్ బేఖాతరు చేశాడు. వ్యక్తిగతంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాధినేతలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వలసలను ప్రోత్సహిస్తూ ఐరోపా దేశాలు తమ నాగరికతను నాశనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించాడు. ఉక్రెయిన్కు సహాయం అందించటంలో యూరోపియన్ యూనియన్కు అడ్డుగా వ్యవహరించిన హంగరీ దేశాధినేత విక్టర్ ఓబ్రామ్ను సమర్థించాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓబ్రా మ్కు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ బహిరంగంగా మద్దతు పలి కాడు. అయితే ఈ ఎన్నికల్లో 16 ఏళ్లుగా హంగరీని పాలిస్తున్న ఓబ్రామ్ ఓడిపోయాడు. ఓబ్రామ్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు కూడా సన్నిహితుడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైపు హంగరీ మొగ్గు చూపింది. పుతిన్ పరంగా ట్రంప్ మెతక వైఖరిని కొనసాగిస్తున్నాడు. ఇది ఐరోపా దేశాలకు మింగుడుపడటం లేదు. రష్యా నుండి చౌకగా లభించే గ్యాస్ దిగుమతులు ఆగిపోవటంతో ఐరోపా దేశాలు ఖతర్, యూఏఈ, సౌదీ నుండి ఎల్ఎన్జీ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. అందువలన హార్మూజ్ జల సంధి కేంద్రంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం కొనసాగటం వాటికి ఇష్టం లేదు. ఈ యుద్ధం కేవలం యూఎస్ఏ–ఇరాన్ మధ్య కాదు. ఇజ్రాయెల్ చేరికతో యుద్ధానికి ‘మతం రంగు’ అలుముకోవటం ఖాయం. ఫ్రాన్స్లో 6.7 మిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 10 శాతం. జర్మనీలో సుమారుగా 5.7 శాతం (4.7 మిలియన్లు) ముస్లిం జనాభా ఉన్నది. ఈ యుద్ధంలో భాగస్వా ములయితే తమ దేశాలలోని ముస్లిం పౌరుల మద్దతు ప్రమాదంలో పడుతుంది. నాటో దేశాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ బడ్జెట్లను పెంచి, సైనిక సామర్థ్యం వైపు దృష్టి పెడుతు న్నాయి. ఐరోపా దేశాల మధ్య సైనిక సంబంధాలను పటిష్ఠం చేయాలని చూస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
టెహ్రాన్: మా మొదటి క్షిపణులకే మీ ఓడలు మునిగిపోతాయంటూ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నిస్తే.. ఆ నౌకలను ఇరాన్ ధ్వంసం చేస్తుందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణకు ఈ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. మొహ్సెన్ రెజాయీ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. మిస్టర్ ట్రంప్.. హార్ముజ్ జలసంధికి పోలీసు కావాలనుకుంటున్నారు. ఇది నిజంగా మీ పనేనా? అమెరికా వంటి శక్తివంతమైన సైన్యం చేసే పని ఇదేనా? మీ ఓడలు మా మొదటి క్షిపణులకే సముద్రంలో మునిగిపోతాయి" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్లో హార్డ్లైనర్గా పేరున్న రెజాయీ.. ఒకవేళ అమెరికా ఇరాన్పై భూతల దాడికి దిగితే.. తాము వేలమందిని బందీలుగా పట్టుకుంటామని.. ప్రతి బందీకి ఒక బిలియన్ డాలర్లు వసూలు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలకు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించారు. అయితే ఆదివారం ఆ చర్చలు విఫలమయ్యాయి. తిరుగు ప్రయాణంలో గాలిబాఫ్.. ట్రంప్ను ఉద్దేశించి, ‘‘మీరు పోరాడితే.. మేము కూడా పోరాడతాం" అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులు చేసి.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిన తర్వాత ఆరు వారాల పాటు యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం రెండు వారాలుగా తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. పాకిస్థాన్లో వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులన్నింటినీ దిగ్బంధిస్తామని అమెరికా సైన్యం గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిని ఇరాన్ చట్టవిరుద్ధమంటూ సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది.కేవలం 34 కిలో మీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారా ప్రపంచ సముద్ర చమురు వ్యాపారంలో 20 శాతం జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల ఇంధన ఎగుమతులకు ఇది కీలక మార్గం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా అడ్డుకుంది. కేవలం చైనా వంటి మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. -
యుద్ధం ముగిసినట్టే..!
వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో సాయుధ పోరుకు అతి త్వరలో తెర పడుతుందని బుధవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోస్యం చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది! వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది. దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్కు ట్రంప్ తాజాగా రెండు షరతులు విధించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) పూర్తి అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెర పడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులున్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హార్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. లెబనాన్పై భీకర దాడులు టైర్ (లెబనాన్): లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. మంగళవారం ఇరు దేశాల నడుమ వాషింగ్టన్లో చర్చలు మొదలవడం తెలిసిందే. అయినా బుధవారం తీర నగరం టైర్పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది.బుర్జ్ అల్ అరబ్ హోటల్ మూత ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతబడనుంది. యుద్ధం ప్రాంరంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతబడటం ఇదే తొలిసారి. ఇది ప్రపంచంలోనే ఏకైక సెవన్ స్టార్ కావడం విశేషం!ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా చెప్పింది: ట్రంప్ ఇరాన్కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోనని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవనుండటంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు! ‘‘త్వరలో నేను చైనా వెళ్తున్నా. ప్రెసిడెంట్ జిన్పింగ్ గాఢమైన ఆలింగనంతో నన్ను స్వాగతించనున్నారు’’అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఖండించారు. ఇరాన్కు చైనా ఎప్పుడూ ఆయుధాలివ్వలేదన్నారు.ఇరాన్కు పాక్ బృందం అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం బుధవారం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. -
అందుకు చైనా అంగీకరించింది.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్
హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే, తాము ఇరాన్కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.మరోవైపు, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు...కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
అమెరికా చమురు దిగ్బంధంపై చైనా వార్నింగ్
-
ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ
ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ తగిలింది. ఈ దేశానికి చెందిన అత్యంత విలువైన డ్రోన్ ఒకటి ప్రమాదానికి గురైంది. అమెరికా అధికారిక ప్రకటనతో ఈ విషయం ధృవీకరణ అయ్యింది. హర్ముజ్ జలసంధిలో గల్లంతైన ఆ డ్రోన్ విలువ రూ.22,000 కోట్లుగా తేలింది.అమెరికా నౌకాదళం హర్ముజ్ జలసంధిలో అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ ఫోర్సీ(MQ-4C) ట్రిటాన్తో నిఘా నిర్వహిస్తోంది. దీని విలువ 238 మిలియన్ డాలర్లు. ఈ కాస్ట్లీ డ్రోన్ ప్రమాదాన్ని ‘క్లాస్ A మిషప్’గా నమోదు చేశారు. ఈ ఘటన ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ మొదలైన మరుసటిరోజే (ఏప్రిల్ 9) జరిగింది.అధికారుల వెల్లడించిన ప్రకారం.. డ్రోన్ 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా 10,000 అడుగుల కిందకు పడిపోయింది. VVPE804 అనే కాల్సైన్తో మూడు గంటల సాధారణ మిషన్లో ఉన్న ఈ డ్రోన్ అకస్మాత్తుగా 7700 ఎమర్జెన్సీ కోడ్ ప్రసారం చేసింది. ఇది సాధారణంగా విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చే సంకేతం. ఆ అత్యవసర సంకేతం ఇచ్చిన తర్వాత అది కనపడకుండా పోయింది. అది హర్ముజ్లో గల్లంతైనట్లు అధికారికంగా ధృవీకరించారు.MQ-4C ట్రిటాన్ అమెరికా నౌకాదళంలో అత్యంత ఆధునిక డ్రోన్లలో ఒకటి. దీన్ని అధిక ఎత్తులో, దీర్ఘకాలిక మిషన్ల కోసం రూపొందించారు. సముద్రంపై ఎక్కువసేపు పర్యవేక్షించేందుకు, సైనిక కదలికలపై నిఘా కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన నార్త్రోప్ గ్రుమ్మాన్ లిమిటెడ్ సర్వీసెస్గా వీటిని తయారు చేసింది. మొత్తం 68 డ్రోన్లు ఫ్లస్ 2 ప్రోటోటైపులను అమెరికా సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా 48 డ్రోన్లను రంగంలోకి దించింది. మరో విశేషం ఏంటంటే.. ఆస్ట్రేలియా కూడా నాలుగు డ్రోన్లను ఆర్డర్ చేసింది. అయితే తాజా డ్రోన్ నష్టం అమెరికా నౌకాదళానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు విశ్లేషకులు. -
24 గంటల్లో హార్ముజ్ దాటిన 20 నౌకలు
-
అదే జరిగితే.. భారత్కు ఫ్లస్, చైనాకు చుక్కలే!
పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.చైనాకు..మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.మలక్కా డైలమాచైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.చైనాకు చుక్కలేఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.భారత్కు ఫ్లస్భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. అంత వీజీ కాదుమలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్కు చైనా మద్దతు.. ఇరాన్కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే. -
మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహ బంధానికి బీటలు వారుతోంది. ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడం ఒక కారణం కాగా.. పోప్ లియో వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మద్దతు ప్రకటించాలని ట్రంప్ ఇటలీపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ దేశ ప్రధాని మెలోనీ అందుకు తలొగ్గలేదు. ఇటలీని ఈ యుద్ధంలోకి లాగడం తన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె భావించారు. ఇరాన్ యుద్ధంలో తమ దేశం పాల్గొనబోదని.. ఇది ప్రపంచంలోనే పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 14న ఇజ్రాయెల్తో తమ దేశానికి ఉన్న రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఈలోపు పోప్ లియో XIV ఇరాన్ యుద్ధంపై స్పందించడం.. ఆయనకు ట్రంప్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇరాన్ యుద్ధంపై పోప్ మాట్లాడటం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. అయితే ట్రంప్ పోప్పై చేసిన వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని.. ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఇరాన్కు అవకాశం వస్తే ఇటలీని రెండు నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా.. యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వ్యాఖ్యానించారాయన. ఇక మీదట యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని.. అమెరికా సైన్యం ఇతరుల కోసం పోరాడబోదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో.. పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని మెలోనీ అనడంపై స్పందిస్తూ.. వాస్తవానికి పోప్ కాదు మెలోనీనే కరెక్ట్ పర్సన్ కాదంటూ ట్రంప్ ఓ కామెంట్ చేశారు. జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా–యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ పేరు ముద్రపడింది. పైగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చు రాజేసినట్లైంది. -
హర్మూజ్ జలసంధిని మూసివేస్తారా.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్ : శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతున్నాయి. ఫలితంగా పశ్చిమాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టైల్లో అభి తొహ్ సిర్ఫ్ ట్రైలర్ హాయ్, పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అందులో ఇరాన్ నావికాదళం ఉపయోగించే చిన్న, వేగవంతమైన క్షిపణి పడవల గురించి ప్రస్తావిస్తూ.. అవును, ఆ వేగవంతమైన క్షిపణి పడవలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ నావికాదళం ‘నాశనమైపోయింది’ అని ట్రంప్ పదేపదే చెప్పడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు క్షిపణుల సమూహం మిమ్మల్ని ఎంత త్వరగా కట్టడి చేయగలదో తెలుసుకోబోతున్నారు’ అని పేర్కొంది. పశ్చిమాలో యుద్ధం కారణంగా ఇరాన్ రూ.25 లక్షల కోట్లు నష్టపోయింది. ఇరాన్ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేలా అమెరికా హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇందుకోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన యూఎస్ఎస్ అబ్రహీం లింకన్ కూడా ఇరాన్ తీరప్రాంతంలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైతే దాడికి దిగే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా పాకిస్థాన్లో ఇరాన్ -అమెరికా దేశాలు శాంతి చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్క్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతాయి. తద్వారా చమురు అమ్ముకుని ఆర్థికంగా బలంగా ఉన్న ఇరాన్కు అమెరికా తీసుకుంటున్న చర్యలతో సతమతమవుతోంది. -
అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు
పశ్చిమ ఆసియా (Middle East) సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను (Four-point framework) ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో,ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది. చైనా నాలుగు సూత్రాల ప్రణాళిక,కీలక అంశాలుజిన్హువా వార్త నివేదిక ప్రకారం అమెరికా నేతృత్వంలోని జోక్యాలకు భిన్నంగా, పశ్చిమ ఆసియాలో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించుకోవడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు ఈ ప్రతిపాదనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుఏఈ నాయకుడు ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిగిన సమావేశంలో జిన్పింగ్ ఈ ప్రణాళికను సమర్పించారు.శాంతియుత సహజీవనం , సంయమనంసార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం మరో కీలకమైన స్తంభమని పేర్కొంది. దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతోంది. ప్రాంతీయ శక్తులన్నీ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని చైనా కోరుతోంది. గొడవలను పక్కన పెట్టి దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని సూచించింది.సార్వభౌమాధికారానికి గౌరవంఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెప్పింది. ప్రతి దేశం స్వయంప్రతిపత్తిని గౌరవించాలని ఈ ప్రణాళికలో చైనా పేర్కొందిభద్రతతో కూడిన ఆర్థిక అభివృద్ధిసుస్థిరమైన శాంతి కావాలంటే ఆర్థిక వృద్ధి కూడా అంతే ముఖ్యమనిజిన్పింగ్ అభిప్రాయపడ్డారు. భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.అంతర్జాతీయ చట్టాల అమలుచివరి అంశం అంతర్జాతీయ చట్టంపై కేంద్రీకృతమై ఉంది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ సమానంగా పాటించాలని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ నిబంధనలనుఎంపిక చేసుకుని పాటించడంపై జిన్పింగ్ హెచ్చరించారు. వాటిని అమలు చేయడంలో స్థిరత్వం పాటించాలని పిలుపు నిచ్చారు. "అంతర్జాతీయ చట్ట పాలనను కాపాడాలి. 'మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు వదిలేయడం' కుదరదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచం తిరిగి అరాచక చట్టాల వైపు మళ్లడానికి అనుమతించలేం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!అదే సమయంలో, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలపై చైనా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఆంక్షలు విధించవద్దని చైనా అమెరికాను గట్టిగానే హెచ్చరించింది. ఇరాన్తో తమ సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని, ఇరాన్తో తమకు ఉన్న వాణిజ్య, ఇంధన సంబంధాలను కొనసాగిస్తామని చైనా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.పశ్చిమాసియా నుండి వచ్చే ఇంధనంపై చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఉండటం చైనా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరం.అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో, తాము ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆదరణ లభిస్తుందా ? ఇతర దేశాల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్ -
ప్రపంచ మార్కెట్లు షాక్, భగ్గుమన్న చమురు ధరలు
-
ఇరాన్ నౌకపై అమెరికా కన్ను
-
హర్ముజ్ బ్లాకేడ్తో భారత్పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిక్వెస్ట్లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
ఇరాన్ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైంది. అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్ఎన్జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. అమెరికా, చైనా ఇరాన్పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
హార్మూజ్ దిగ్బంధం
కైరో/దుబాయ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. చర్చల వైఫల్యంపై మండిపడుతున్న అమెరికా మరోసారి ఇరాన్పై తీవ్ర చర్యలకు దిగుతోంది. సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ జలసంధితో పాటు ఇరాన్కు చెందిన ఓడరేవులన్నింటినీ దిగ్బంధించింది. హార్మూజ్ గుండా ఇరాన్ ఓడల రాకపోకలను కూడా అడ్డుకుంటోంది. చర్చలు విఫలమైతే హార్మూజ్ను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే హెచ్చరించడం తెలిసిందే. అమెరికా నావికా దళం సోమవారం సాయంత్రమే రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతాలన్నింటినీ పూర్తిస్థాయిలో పహారా కాస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలూ ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు జరపడానికి వీల్లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను మాత్రం హార్మూజ్ గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని వెల్లడించడం విశేషం! ఇరాన్ ‘ఫాస్ట్ అటాక్’షిప్లు గనక తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్ అల్టిమేటమిచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. అంతేగాక ట్రంప్ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కన్పిస్తోంది. దాని గడువు ఏప్రిల్ 22 దాకా ఉంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావడం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అగ్ర రాజ్యం తాజా చర్యలపై ఇరాన్ మండిపడింది. గల్ఫ్ ప్రాంతంలోని ఓడరేవులన్నింటినీ పూర్తిస్థాయిలో లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతానని తీవ్రంగా హెచ్చరించింది. ‘‘పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర ప్రాంత రక్షణ బాధ్యత ఈ ప్రాంతంలోని ప్రతి దేశానిదీ. మాపై దాడులు, దిగ్బంధాలు జరిగితే ఈ ప్రాంతంలోని ఏ రేవూ సురక్షితం కాబోదు’’అని ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) స్పష్టం చేశాయి. హార్మూజ్ ఇప్పటికీ పూర్తిగా ఇరాన్ అదుపులోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాయి. ‘ట్రంప్కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘ఆటలో ఇప్పటిదాకా వాడని సరికొత్త ‘వ్యూహా’లను ఇకపై బయటికి తీస్తా’మంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఎబ్రాహీం రజెయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిందేనని ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగం చీఫ్ ఎస్మాయిల్ ఖానీ ఎద్దేవా చేశారు. గత వారం కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి 40 వాణిజ్య నౌకలు హార్మూజ్ను దాటాయి. అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధానికి తెర దించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఇరాన్ గమ్మత్తైన ‘గణిత’పోస్టు హార్మూజ్ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు గమ్మత్తైన గణిత సమీకరణాలతో ఎక్స్లో పోస్టు పెట్టింది. ‘‘హార్మూజ్ దిగ్బంధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి. తర్వాత జరిగే చైన్ రియాక్షన్ వల్ల చూస్తుండగానే అవి చుక్కలనంటుతాయి’’అంటూ వాటి అర్థాన్ని కూడా వివరించింది!‘హార్మూజ్’పై భేటీ.. బ్రిటన్, ఫ్రాన్స్ వెల్లడి లండన్/పారిస్: పశ్చిమాసియా యుద్ధానికి తెర దించి హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిపించే ప్రయత్నాలను బ్రిటన్, ఫ్రాన్స్ ముమ్మరం చేశాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ఈ అంశంపై వారిద్దరూ ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా చేపట్టిన హార్మూజ్, ఇరాన్ రేవుల దిగ్బంధానికి బ్రిటన్ మద్దతివ్వబోదని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.100 మంది హెజ్బొల్లా ఫైటర్ల మృతి! బీరూట్: ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా దళాలు సోమవారం లెబనాన్లో పరస్పర దాడులకు దిగాయి. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్ బెల్ వద్ద ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. అయితే పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తున్నట్టు లెబనాన్ మీడియా తెలిపింది. బింట్ బెల్ వద్ద కనీసం 100 మంది హెజ్బొల్లా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. లెబనాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. రాజధాని బీరూట్పై దాడులకు ఇజ్రాయెల్ విరామం ఇచ్చింది. మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండటం తెలిసిందే. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు. అయినా లెబనాన్పై దాడులు మాత్రం ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. చర్చలకు సిద్ధమే: ఇరాన్న్యూఢిల్లీ: అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధమేని భారత్లో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. అయితే, ‘అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదు. ఇరాన్ షరతులకు అంగీకరించాలి’అని పేర్కొన్నారు. తమ శక్తి ఏమిటో అమెరికాకు బాగా తెలుసని ఆయనన్నారు. హార్మూజ్ ఇరాన్దేనని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాలపై తీవ్ర చర్యలు: అమెరికా ఇరాన్కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు/దేశాలను కోర్టుల్లో నిలబెట్టి తీరుతామని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ప్రకటించారు. -
హర్మూజ్ జలసంధిపై ట్రంప్ కొత్త గేమ్ ప్లాన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హర్మూజ్ జలసంధిలో నౌకల్ని ఆపేస్తూ, మరో వైపు ఇరాన్ను బయపెట్టించేలా ఆ దేశంపై మరోసారి ముప్పేట క్షిపణులతో దాడి చేసే అవకాశాలపై ట్రంప్ తన సీనియర్ సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నిన్న ఇదే అంశంపై ట్రంప్ ఫ్లోరిడాలోని డోరల్ రిసార్ట్లో ఫాక్స్ న్యూస్తో మాట్లాడారు. దౌత్యపరమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఇరాన్కు పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. ‘హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగిస్తూ, ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను అలా చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ఇరాన్ది. సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చే సాలినేషన్ ప్లాంట్లు వాళ్లవి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాళ్లవి. వాటిపై సులభంగా దాడి చేయొచ్చు’ అని అన్నారు.యుద్ధం ప్రారంభ దశలో భాగమైన బాంబింగ్ దాడుల్ని మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ట్రంప్ సలహాదారులు మాత్రం ఈ తరహా దాడులు చేసే అవకాశం తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం.. బాంబింగ్ దాడులతో ప్రాంతీయ అస్థిరతను మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ట్రంప్ దీర్ఘకాలిక సైనిక యుద్ధాల్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని వారు చెబుతున్నారు.మరో ప్రత్యామ్నాయం తాత్కాలికంగా ఆంక్షలను కొనసాగిస్తూ.. దీర్ఘకాలంలో హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా మిత్రదేశాలను బాధ్యత వహించేలా ఒత్తిడి చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ తెలిపారు. ‘ట్రంప్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై నావికాదళ ఆంక్షలు విధించారు. ఇరాన్ దోపిడీని ఆపారు. అదనపు అన్ని అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు’ అని వాల్ స్ట్రీట్ జర్నల్కు తెలిపారు.ఇరాన్తో చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ ఏ చర్యలకు ఉపక్రమించనున్నారనే అంశాలపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ మాత్రం ఇరాన్ తిరిగి చర్చలకు రావాలనుకుంటుందని పేర్కొన్నారు. -
ట్రంప్ సముద్ర దిగ్బంధనం : ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్ సముద్ర కార్యకలాపాలపై దిగ్బంధనాన్ని అమలు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. తమ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. యుద్ధ విరమణ చర్చలు విఫలమైన తర్వాత టెహ్రాన్పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఇరాన్ ఓడరేవులలోకి ప్రవేశించే లేదా బయలుదేరే నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తామని అమెరికా సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఏప్రిల్ 13 (సోమవారం) నుండి ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు అమలులోకి రానున్న తరుణంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.అమెరికా సముద్ర దిగ్బంధనం (Blockade)పై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, తాము కూడా దీటుగా స్పందిస్తామని, తమ వద్ద ఇంకా వాడని ఆయుధాలు/అస్త్రాలు ఉన్నాయని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. తమ దేశ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే, పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది. "పర్షియన్ గల్ఫ్ భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండదు" అని ఇరాన్ మిలిటరీ మరియు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, ఏప్రిల్ 13 ఉదయం 10 గంటల (EDT) నుండి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను అమెరికా సైన్యం అడ్డుకోనుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా షరతులను అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, ఇతర దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా అనుమతి ఉంటుందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 8 శాతం పెరిగి 104.24 డాలర్లకి చేరగా, బ్రెంట్ క్రూడ్ 102.29 కి డాలర్ల చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా రోజుకు 100-135 నౌకలు వెళ్లేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40కి పడిపోయింది. ఇదీ చదవండి: రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్పై ఒత్తిడిని పెంచడానికే ఈ దిగ్బంధనం ఉద్దేశించినట్లుగా ఉంది. ఇరాన్ చమురు ఎగుమతుల కోసం ఉపయోగిస్తున్న "డార్క్ ట్రాన్సిట్స్" (రహస్య రవాణా) ను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అయితే, ఈ దిగ్బంధనం వల్ల గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియ నుండటంతో, ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందా అనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: పోప్కు కౌంటర్ : ట్రంప్ సంచలన పోస్ట్ -
ఇరాన్పై అమెరికా యుద్ధం.. భారత్లో వీటి ధరలు పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్లో వినియోగదారులు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్పై అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.దీని ప్రభావం భారత్లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది. చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.భారత్ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. -
8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్
స్టాక్ మార్కెట్లపై హర్ముజ్ సంక్షోభం ఎఫెక్ట్ పడింది. చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లకుపైగా.. నిష్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయ్యింది.హర్ముజ్ జలసంధి సంక్షోభం ప్రభావంతో ఇవాళ్టి ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదేలయ్యాయి. చర్చలు విఫలమవడంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 8 శాతం పెరగడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం వెంటనే మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.సెన్సెక్స్ 73,000 స్థాయికి చేరగా, నిఫ్టీ 23,600 కంటే దిగువకు పడిపోయింది. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ పతనంతో మార్కెట్లో భయాందోళనలు పెరిగి, చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెరుగుదలతో ఎయిర్లైన్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు, ఎనర్జీ-అప్స్ట్రీమ్ రంగం, డిఫెన్స్ సంబంధిత షేర్లు మాత్రం కొంత స్థిరంగా నిలిచాయి. నిపుణుల అంచనా ప్రకారం.. హర్ముజ్ సంక్షోభం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దిగుమతి ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం అధికమవడం, వృద్ధి మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు తాత్కాలికంగా రిస్క్ ఉన్న రంగాల నుండి దూరంగా ఉండి, స్థిరమైన రంగాల వైపు దృష్టి మళ్లించాలని సూచిస్తున్నారు. -
ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను స్వీకరించేందుకు సిద్ధం: రష్యా
ఇరాన్, అమెరికా చర్చలు విఫలమైన నేపథ్యంలో హార్మూజ్ టార్గెట్గా ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... -
హార్మూజ్.. ఆనాటి హురుమాంజియే..
సాక్షి, హైదరాబాద్: హార్మూజ్ జలసంధి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టిన ఈ జలసంధి ఒకప్పుడు ఇదే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల రవాణాకు కేంద్రబిందువుగా నిలిచింది. ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాలకు సాంస్కృతిక వారధిగా కొనసాగింది. కాకతీయులు, రాయల కాలంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. వందల ఏళ్ల క్రితమే ఈ జలసంధికి తెలుగుసాహిత్యంలో సముచితమైన స్థానం లభించింది. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవిసార్వభౌముడు తమ సాహిత్యంలో ఈ జలసంధిని ‘హురుమాంజి’గా అభివర్ణించారు. హురుమాంజి జలసంధి నుంచే అనేక రకాల వ్యాపారాలు కొనసాగినట్లు శ్రీనాథుడు ‘హరవిలాసం’లో ప్రస్తావించారు.తిప్పయ్యశెట్టి అనే వ్యాపారి హురుమాంజి నుంచి అనేక రకాల విలువైన వస్తువులను తెచ్చి విక్రయించేవాడని ప్రస్తావించాడు. ఖర్జూర, బాదం, వాల్నట్స్ వంటి ఎండుఫలాలు అక్కడినుంచి దిగుమతి అయ్యేవని ఆ గ్రంధంలో పేర్కొన్నారు. మరోవైపు మేలైన గుర్రాలు ‘హురుమాంజి’ నుంచి తెప్పించినట్లు శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పారు. ‘విజయనగర సామ్రాజ్యానికి సైనిక శక్తి చాలా ముఖ్యం, అందులోనూ గుర్రపు దళం ఎంతో కీలకం. అరేబియా, పర్షియా దేశాల్లోని ‘హురుమాజి’ రేవు నుంచి వచ్చే ఉత్తమ జాతి గుర్రాలను వెనుకాడకుండా ఎక్కువ ధర ఇచ్చి అయినా సరే కొనుగోలు చేయాలి’ అని ఆముక్తమాల్యదలో ప్రస్తావించారు. ఆ హురుమాంజియే ఇప్పటి హార్మూజ్ జలసంధి అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలో, ఆ తరువాత రాయలకాలంలో హురుమాంజి నుంచి మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవులకు సరుకులు రవాణా అయ్యేవి. తెలుగు సాహిత్యంలో ‘పర్షియా’.. ఈ ఒక్క జలసంధి మాత్రమే కాదు. పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే అనేక పదాలు 15వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయని ప్రముఖ రచయిత వసుధేంద్ర తెలిపారు .‘గ్రీస్, పర్షియన్ రెండూ అత్యంత ప్రాచీనమైన నాగరికతలే అయినా పర్షియన్ సంస్కృతి మాత్రమే అనేక దేశాలకు విస్తరించింది’ అని చెప్పారు. బిర్యానీలు, రకరకాల మాంసాహార వంటకాలు, డబల్కామీటా, బాదుషా, జిలేబీ వంటి మిఠాయిలు కూడా అక్కడి నుంచి దిగమతి అయి మన ఆహారపు అలవాట్లలో భాగమయ్యాయి.కుంకుమపువ్వు, రోజ్వాటర్ దిగుమతి ‘ఇరాన్ సంస్కృతి అప్పటి రాజులను బాగా ప్రభావితం చేసింది. ఆ నాటి రాచరిక వ్యవస్థను రాయలకాలంలో అనుకరించారు. అందుకే పర్షియాకు చెందిన అనేక పదాలకు సమానమైన అర్ధాన్నిచ్చే పదాలను సంస్కృతంలో ప్రస్తుతించారు’ అని వసుధేంద్ర వివరించారు. ఈ క్రమంలో ‘అమీర్’ను ఇక్కడ ‘అమరనాయకుడు’ అని, ‘సుల్తాన్’ అనే పదానికి సమానమైన అర్ధాన్నిచ్చేవిధంగా ‘సురత్రానా’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండు వైపులా రాకపోకలు విస్తృతంగా కొనసాగాయి. చాలామంది వ్యాపారులు పర్షియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి నుంచి సుగంధద్రవ్యాలు వంటివి అక్కడికి ఎగుమతి చేశారు. ఆనాటి పర్షియన్ సంస్కృతి రాజులనే కాకుండా సమాజంలోని ఉన్నతవర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. బాదం, పిస్తా, కుంకుమపువ్వు, రోజ్వాటర్ వంటివి అక్కడి నుంచి దిగుమతి చేసుకొనేవారు. -
చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు!
అమెరికా, ఇరాన్ నడుమ ఎంతో ఆశావహంగా మొదలైన శాంతి చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఈ వైఫల్యం వెనక పలు కారణాలున్నట్టు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి...1. అటు అమెరికా, ఇటు ఇరాన్ తమ ప్రాధాన్యాలకే కట్టుబడి ఉండాలనే మొండి పట్టుదలతో ఇస్లామాబాద్లో అడుగుపెట్టాయి. ఎవరూ తమ డిమాండ్ల నుంచి ఇసుమంతైనా వెనక్కు తగ్గలేదు. అవతలి వారి వాదనలకు ఏ మాత్రమూ విలువ ఇవ్వలేదు. చర్చలు వైఫల్యానికి ఈ వైఖరే ప్రధాన కారణంగా నిలిచింది. యురేనియం శుద్ది కార్యక్రమాన్ని తక్షణం, శాశ్వతంగా ఆపేయాలని అమెరికా డిమాండ్కు ఇరాన్ ససేమిరా అంది. విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించి తీరతామని కరాఖండిగా చెప్పింది.2. చర్చలన్నాక అగ్రరాజ్యాధినేత అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దౌత్యధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇరాన్ బృందం పాక్లో కాలుమోపాక కూడా కాక పెంచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. చర్చలు విఫలమైతే ఇరాన్పై మునుపెన్నడూ ఉపయోగించని శక్తిమంతమైన ఆయుధాలతో మరింత భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన పెట్టిన పోస్టులు పరిస్థితిని దిగజార్చాయి. ఓవైపు చర్చలకు పిలిచి మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏ రకమైన దౌత్య నీతి అంటూ అమెరికా ప్రతినిధులను ఇరాన్ బృందం నిలదీసినట్లు సమాచారం.3. కాల్పుల విరమణ లెబనాన్కూ వర్తిస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నా చర్చలను బేఖాతరు చేస్తూ ఆ దేశంపై ఇజ్రాయెల్ భీకరంగా దాడులు కొనసాగిస్తుండటం ఇరాన్కు సుతరామూ నచ్చలేదు. లెబనాన్పై దాడులు చేయకుండా ఇజ్రాయెల్ను నిరోధిస్తామని అమెరికా నుంచి ఎలాంటి హామీ రాకపోవడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. మధ్యవర్తిగా హుందాగా వ్యవహరించాల్సిన పాక్ కూడా పరిస్థితిని దిగజార్చేలా ప్రవర్తించింది. ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడుతోందంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ పోస్టు పెట్టడంతో మండిపడ్డ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. చర్చలతో తమ దాడులకు సంబంధం లేదంటూ కుండబద్దలు కొట్టారు.4. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని బేషరతుగా తెరవాలని ట్రంప్ డిమాండ్చేశారు. షరతుల్లేకుండా దాన్ని తెరవబోమని, చర్చల్లో బేరసారాలకు హార్మూజ్ తమకు కీలక ఆయుధమని ఇరాన్ ప్రతినిధులు వాదించారు. హార్మూజ్ను తెరవకపోతే ఇరాన్ నాగరికతనే బూడిద చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను తీవ్రంగా తప్పుబట్టారు. హార్మూజ్ను తెరవాలంటే ఇరాన్పై ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అమెరికా బృందం ఒప్పుకోలేదు. పైగా ఈ విషయంలో ట్రంప్ ధోరణినే గట్టిగా సమరి్థంచింది. హార్మూజ్ గుండా పయనించే నౌకల నుంచి చార్జీలు వసూలుకు ఇరాన్తో కలిసి టోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించలేదు. హార్మూజ్పై తమతో పాటు ఒమన్ పాక్షిక అధికారాలను గుర్తించాలన్న ఇరాన్ డిమాండ్కు అమెరికా ఒప్పుకోలేదు.5. అమెరికా, ఇరాన్ బృందాల మధ్య పరస్పర విశ్వాస లోపం అడుగడుగునా కనిపించింది. హామీలను అవతలి పక్షం పాటిస్తాయా అన్న అనుమానాలు ఇరువైపులా కొట్టొచి్చనట్టు కన్పించాయి. తమ ప్రతిపాదనలు అద్భుతమని అమెరికా చెప్పుకుంటే, అవన్నీ చెత్త షరతులని ఇరాన్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు.ఇక ఏం జరగనుంది? చర్చల వైఫల్యం తాలూకు తక్షణ ప్రభావం కాల్పుల విరమణపై పడే అవకాశముంది. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్పై మూకుమ్మడిగా దాడులు ప్రారంభించే ప్రమాదం కన్పిస్తోంది. చర్చలు విఫలమైతే చరిత్ర చూడని స్థాయిలో ఇరాన్పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అదే జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మూజ్ జలసంధి తెరచుకోని పక్షంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ముదిరే ఆస్కారముంది. తమ వద్ద అణుబాంబు లేని కారణంగానే అమెరికా ఇంతగా దాడులకు దిగుతోందన్న అభిప్రాయంతో ఉన్న ఇరాన్, ఇక అణ్వస్త్ర కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన కొనసాగించే వీలుంది. భారత్లో ఇంధన కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హార్మూజ్ను దిగ్బంధించండి
వాషింగ్టన్: శాంతిచర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనువెంటనే హార్మూజ్ జలసంధిని దిగ్భంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఇరాన్కు అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరకు రవాణా నౌక కూడా జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇరాన్కు డబ్బులే కావాలి. మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే వాళ్ల ప్రయత్నాలను అడ్డుకుంటూ మేం హార్మూజ్ను దిగ్భందిస్తాం. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలను ధ్వంసంచేస్తాం’’ అని అన్నారు. జలసంధి దిగ్బంధంలో మరికొన్ని దేశాలు అమెరికాకు సాయపడనున్నట్లు వార్తలొచ్చాయి. ‘‘ఇరాన్తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతిచర్చలకు సిద్ధపడ్దాం. చాలా అంశాల్లో వాళ్లతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదలపై ఇరాన్ మొండికేసింది. అందుకే చర్చలు విఫలమయ్యాయి. సంక్లిష్టమైన, అనూహ్యమైన, ప్రమాదకర ఇరాన్ పాలకుల చేతికి అణ్వాయుధం దక్కకుండా చేస్తా. ఇరాన్ ఏనాటికీ అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించిన పాక్ ప్రస్తావనను ట్రంప్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘‘పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిజంగా అసాధారణ వ్యక్తులు. భారత్తో యుద్ధాన్ని నిలువరించి ప్రత్యక్షంగా 3–5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన నన్ను మునీర్, షెహబాజ్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇరాన్కు రహస్యంగా ఆయుధాలను తరలిస్తే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ‘సండే మారి్నంగ్ ఫ్యూచర్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి విధ్వంసక మిస్సైల్ లాంచర్ను ఇరాన్కు చైనా రహస్యంగా పంపిస్తోందన్న వార్తలు చదివా. అవి నిజమని అనుకోను. ఇప్పుడు చైనాతో అమెరికా సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ చైనా నిజంగానే ఇరాన్కు ఆయుధ సాయం చేస్తే 50 శాతం పన్నుల భారం పడేస్తా’’ అని హెచ్చరించారు. -
చర్చలు విఫలం
ఇస్లామాబాద్: ప్రపంచమంతా అత్యంత ఆశతో ఎదురు చూసిన అమెరికా, ఇరాన్ చర్చలు చివరికి విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి ముగింపు పలికి శాంతి, సుస్థిరతకు బాటలు వేస్తాయని, శాశ్వత కాల్పుల విరమణకు బాటలు పరుస్తాయని, ఆ మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు పెట్టుకున్న ఆశలు వమ్మే అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సారథ్యంలోని ఇరాన్ బృందం మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు ఎటూ తేలకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. ఏకధాటిగా 21 గంటలపాటు కొనసాగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎవరి డిమాండ్లపై వారు మొండిపట్టు పట్టడంతో ఎలాంటి ఒప్పందమూ సాధ్యపడలేదు. దాంతో ఇరు బృందాలూ ఆదివారమే తమ తమ దేశాలకు వెనుదిరిగాయి. అమెరికా వెళ్లేముందు వాన్స్ ఇస్లామాబాద్లో మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమయ్యాయని స్వయంగా ప్రకటించారు. ‘‘అణు కార్యక్రమాలకు స్వస్తి పలకబోనని ఇరాన్ మొండికేసింది. హార్మూజ్పైనా అదే వైఖరి! చర్చల వైఫల్యానికి ఇవి రెండే ప్రధాన కారణాలు. ఇరాన్తో 21 గంటలపాటు చర్చలు జరిపాం. కొన్ని అంశాలపై లోతుగా మాట్లాడాం. చర్చలకు సంబంధించి ఇదొక్కటే మంచివార్త. కానీ ఉమ్మడి నిర్ణయానికి మాత్రం రాలేకపోయాం. ఇది అమెరికాకంటే ఇరాన్కే అతి పెద్ద దుర్వార్త. అణ్వాయుధం తయారు చేయబోమని ఒక్క నిర్దిష్టమైన, స్పష్టమైన హామీని మాత్రమే కోరాం. అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నది కూడా ఇదే. చర్చల ద్వారా మేం ఇదే సాధించాలనుకున్నాం. చర్చలకు మేం ముందుకు రావడానికి అసలు కారణమూ ఇదే. కానీ మా షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు. చర్చల సందర్భంగా ట్రంప్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయన వైఖరిని ఇరాన్ బృందానికి ఎప్పటికçప్పుడు తెలియజేస్తూ వచ్చాం’’ అని వాన్స్ చెప్పారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ ఇకనైనా ఆమోదిస్తుందో లేదో చూడాలన్నారు. అణ్వస్త్ర తయారీ, హార్మూజ్ జలసంధి ద్వారా సాధారణ రాకపోకలు, విదేశాల్లో దిగ్భందంలో ఉన్న ఇరాన్ స్థిరచరాస్తులను విడిపించడం వంటి ప్రధానాంశాల్లో సయోధ్య వీలవకపోవడమే చర్చల వైఫల్యానికి కారణమని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. అసాధ్యమైన డిమాండ్లు: బఘేర్ చర్చల వైఫల్యంపై ఇరాన్ బృంద సారథి, స్పీకర్ ఘాలిబఫ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ఇరాన్ సర్వతోముఖాభివృద్ధికి కోసం దూరదృష్టితో మేం చేసిన పలు ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించలేదు. మా బృంద విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైంది. దాని ఆధిపత్య తరహా దౌత్యమే ఇందుకు కారణం. మాపై సైనిక చర్య నేపథ్యంలో దేశ రక్షణ కోసం 40 రోజులుగా చేస్తున్న పోరాటంలో రాజీ ఉండబోదని కరాఖండిగా చెప్పేశాం. చర్చల సాఫల్యం అవతలి పక్షం అనుకూల వైఖరి, అంకితభావం మీదనే ఆధారపడి ఉంటుంది. అమెరికా మా ముందు ఆచరణ సాధ్యం కాని, అతి, అక్రమ డిమాండ్లు పెట్టింది. ఇలాంటి చర్యలతో చర్చలు ముందుకు సాగబోవు. పరస్పర అవిశ్వాసం, సంశయాల నడుమ సఫలత అసాధ్యం’’ అన్నారు. ‘‘ఒకే దఫాలో ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టం. పలుమార్లు చర్చల తర్వాత బహుశా ఇరు పక్షాల వైఖరిలో కాస్త సారూప్యత సాధ్యపడొచ్చు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయెల్ బఖాయీ అభిప్రాయపడ్డారు. మలి దఫా చర్చలపై యోచిస్తున్నట్టు అతిథ్య పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్తో అమెరికా జరిపిన తొలి ప్రత్యక్ష చర్చలు ఇవే కావడం తెలిసిందే. ఇస్లామాబాద్లో శనివారం మొదలైన ఈ చర్చల్లో అమెరికా తరఫున వాన్స్తో పాటు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అధ్యక్షుని దూత స్టీవ్ విట్కాఫ్; ఇరాన్ తరఫున బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ; మధ్యవర్తిత్వ దేశ హోదాలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. పశ్చిమాసియా నుంచి అమెరికా సేనల నిష్క్రమణ, హార్మూజ్పై పట్టు వంటి 10 కీలక డిమాండ్లతో ఇరాన్; అణ్వస్త్ర తయారీకి తక్షణం అడ్డుకట్టే ప్రధాన డిమాండ్గా వాన్స్ బృందం పాక్లో కాలుమోపాయి.లెబనాన్పై ఆగని దాడులు బీరూట్: లెబనాన్తో మంగళవారం చర్చలు జరపనున్నా, ఆ దేశంపై దాడులను మాత్రం ఇజ్రాయెల్ ఆపడం లేదు! ఆదివారం దక్షిణ లెబనాన్లోని మారౌబ్ గ్రామంపై దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్పై దాడులను పోప్ లియో–14 తీవ్రంగా ఖండించారు. మరోవైపు 40రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 3,375 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసన్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది. మృతుల్లో 500 మంది దాకా మహిళలున్నారు. ఇప్పటిదాకా యుద్ధంలో లెబనాన్లో 2,055 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్దేశాల్లో డజను మందికిపైగా చనిపోయారు. -
ఇరాన్కు కొత్త టెన్షన్..
వాషింగ్టన్ : అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. శత్రువును భయపెట్టేందుకు ఉయోగపడిన సముద్ర మందుపాతరలు(సీమైన్స్) ఇప్పుడు ఇరాన్కూ కొత్త భయాందోళనలు పెంచేస్తున్నాయి. సీమైన్స్ కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్కు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, సౌదీల వంటి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు, పెట్రో సరకులతో బయల్దేరే నౌకలు హార్మూజ్ను దాటకూడదనే లక్ష్యంతో ఆ మార్గంలో సీమైన్స్ ఏర్పాటుచేసిన ఇరాన్ ఇప్పుడు వాటి జాడ వెతికేందుకు తిప్పలు పడుతోంది. వాటిని అమర్చేటప్పుడు లేదా నీటిలోకి వదిలేటప్పుడు వాటి పొజిషన్ను ఒక క్రమపద్దతిలో నమోదుచేయలేదని తెలుస్తోంది. సముద్ర జలాల ప్రవాహంతో అవి అటూ ఇటూ కొట్టుకుపోయే ప్రమాదముంది.దీంతో ఇప్పుడు అవి కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్కు కూడా లేదు. దీంతో యుద్ధం పూర్వపు సాధారణ స్థితికి నౌకల రాకపోకలను అనుమతించే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఇరాన్ నావికాదళం రంగంలోకి దిగి సీమైన్స్ జాడ కనిపెట్టి వాటిని తొలగించడం లేదా నిర్వీర్యం చేయాల్సి ఉంది. అప్పటిదాకా నౌకల పూర్తిస్థాయి రాకపోకలకు అనుమతి అసాధ్యమనే వార్తలు వినవస్తున్నాయి. కాగా, దీనిపై ఇరాన్ ఇంతవరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. సీమైన్స్ను జాగ్రత్తగా తొలగించే సాంకేతికత ఇరాన్ వద్ద లేదు అనే పుకార్లు సైతం ఎక్కువయ్యాయి. దీంతో కాల్పుల విరమణ ఇప్పటికే మొదలైనా నౌకల సాఫీ ప్రయాణంపై ఇంకా సందిగ్ధత రాజ్యమేలుతోంది. -
కొంప మునిగింది.. సముద్రంలో బాంబులు..! ఇరాన్ తలచుకున్నా హార్ముజ్ తెరుచుకోదా?
-
హార్మూజ్ను దాటిన జగ్ విక్రమ్
న్యూఢిల్లీ: భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ హార్మూజ్ను విజయవంతంగా దాటేసింది. అమెరికా–ఇరాన్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక హార్మూజ్ను దాటిన మొదటి భారతీయ ట్యాంకర్ ఇది. శనివారం మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్ను దాటి భారత్ దిశగా సాగుతోంది. ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన జగ్ విక్రమ్ సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. కాగా, మార్చి మొదటి వారం నుంచి హార్మూజ్ను వీడిన 9వ భారతీయ ట్యాంకర్ ఇది. మరో 15 భారతీయ నౌకలు ఇప్పటికీ అక్కడే వేచి ఉన్నాయి. వీటితోపాటు వివిధ దేశాలకు చేరుకోవాల్సిన మొత్తం 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్ఎన్జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా చెబుతోంది. -
ఇరాన్తో శాంతి చర్చల వేళ అమెరికాకు ఎదురు దెబ్బ?
అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న తలెత్తుతోంది... అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన ఈ యుద్ధ విరమణ నిజంగా శాంతి కోసమా? లేక తన దౌత్య వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వేసుకున్న ముందస్తు వ్యూహమా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలకు సిద్ధమైన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికాలోని మేధావి వర్గం ఈ చర్చల ద్వారా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి. యుద్ధం అనేది కేవలం క్షిపణుల మోతతో ముగిసిపోయేది కాదు, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి.ఈ క్లిష్ట సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్హోవర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి: "ప్రజలు శాంతిని ఎంతగా కోరుకుంటారంటే, ఏదో ఒక రోజు ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని వారికి ఆ శాంతిని అందజేయక తప్పదు” అని. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే, ప్రభుత్వాలు శాంతిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయే తప్ప, నిబద్ధతతో పనిచేయడం లేదనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారనుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి ఈ మార్గంపై ఇరాన్ పట్టు సాధించడం అమెరికా దౌత్య నీతికి తగిలిన అతిపెద్ద దెబ్బ. ఇరాన్ ఇక్కడ టోల్ వసూలు చేయాలని చూడటం లేదా నౌకాయానాన్ని నియంత్రించాలని ప్రయత్నించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భావించినా, ఆచరణలో వారిని ఆపే శక్తి ఎవరికి ఉందన్నదే అసలు ప్రశ్న. గతాన్ని పరిశీలిస్తే, జాన్ ఎఫ్. కెన్నెడీ క్యూబన్ మిస్సైల్ సంక్షోభం సమయంలో ప్రదర్శించిన సంయమనం, వ్యూహాత్మక ఓర్పు నేటి నాయకత్వంలో లోపించినట్లు కనిపిస్తోంది.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైఖరి ఈ చర్చల భవితవ్యాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది. లెబనాన్పై దాడులను ఆపే ఉద్దేశం ఇజ్రాయెల్కు లేదని స్పష్టమవుతున్న తరుణంలో, అమెరికా చేసే చర్చలు ఎంతవరకు ఫలప్రదమవుతాయి? ఒకవైపు తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, మరోవైపు ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్కు కత్తిమీద సాము లాంటిదే. రిచర్డ్ నిక్సన్ చైనా వైపు అడుగులు వేసినప్పుడు ప్రదర్శించిన రియల్పాలిటిక్ వ్యూహాన్ని ట్రంప్ ఇప్పుడు అమలు చేయగలరా? లేక కేవలం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఈ యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే దెబ్బతిందని అనుకుంటే పొరపాటే. అమెరికా తన ఖజానా నుండి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లను ఈ యుద్ధం కోసం తగలేసింది. ఈ భారీ సొమ్మును అమెరికా ప్రజల సంక్షేమం కోసం, విద్య, వైద్య రంగాల కోసం ఖర్చు చేసి ఉంటే అగ్రరాజ్యం మరింత శక్తివంతంగా తయారయ్యేది.అణు ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఇప్పుడు రక్షణ స్థితిలో పడిపోయింది. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన జేసీపోఏ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల కలిగిన నష్టం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్ను ఒక క్రమపద్ధతిలో నియంత్రించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు వారిని నియంత్రించడం అంటే వారికి కొన్ని భారీ మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి. నమ్మకం అనేది అంతర్జాతీయ సంబంధాల్లో పునాది వంటిది, కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. చర్చల మధ్యలో దాడులు చేయడం వల్ల ఇరాన్ ఇప్పుడు అమెరికాను తీవ్రమైన అనుమానంతోనే చూస్తోంది.చివరగా చెప్పాలంటే, ఈ వారాంతపు చర్చలు కేవలం ఒక రాజకీయ ప్రహసనం కాకూడదు. యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, ఎరువుల కొరత వల్ల ఆఫ్రికా వంటి దేశాల్లో పేదరికం, ఆకలి చావులు పెరుగుతున్నాయి. అబ్రహం లింకన్ అన్నట్లుగా, "మన శత్రువును మిత్రుడిగా మార్చుకున్నప్పుడు, ఆ శత్రువును నాశనం చేసినట్లే అవుతుంది” అని. ట్రంప్ ఈ సూత్రాన్ని పాటిస్తారా లేక పాత కక్షలతోనే ముందుకు సాగుతారా? చర్చల పేరుతో కాలయాపన చేయడం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు మరింత చెలరేగే ప్రమాదం ఉంది. కేవలం ఆధిపత్య పోరు పక్కన పెట్టి, మానవతా దృక్పథంతో అడుగులు వేసినప్పుడే ఈ చర్చలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది.::: కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
హర్మూజ్ విషయంలో ఇరాన్ భింకం ఇందుకే?
ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరితే యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో హాట్ టాఫిక్గా నిలిచిన అంశాలలో ప్రధానమైంది హర్మూజ్ జలసంధి. దీనిని తెరవాలని అమెరికా పట్టుబట్టడం ఇరాన్ ససేమిరా అనడంతో చాలా కాలం పాటు ఉద్రిక్తతలు నడిచాయి. అయితే ఇరాన్ ఈ జలసంధిని తెరవలేక పోవడానికి అందులో అమర్చిన మైన్స్ సైతం ఓ కారణంగా తెలుస్తోంది.ప్రపంచ రవాణాకు హర్మూజ్ జలసంధి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాణిజ్య రవాణాలో దాదాపు 20 శాతంకు పైగా దీనిగుండానే ప్రయాణం అవుతాయి. గల్ఫ్ దేశాలకు చెందిన చమురుతో పాటు ఇతరత్రా కీలకమైన వస్తువులు దీని గుండానే సరఫరా జరుగుతుంది. అయితే యుద్ధం కారణంతో ఇరాన్ను దీనిని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంక్షోభ పరిస్థిలకు ట్రంప్ యుద్ధ నిర్ణయమే కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే హర్మూజ్ తెరవాలని ట్రంప్ పలుమార్లు హెచ్చరించినా ఇరాన్ మాత్రం ససేమిరా అంది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరినా వెనక్కి తగ్గలేదు. ఇరాన్ ఇంత మెుండిగా వ్యవహరించడానికి ఇతర కారణాలు ఉన్నాయని విశ్లేశకులు భావిస్తున్నారు.అయితే తొలి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ధం తలెత్తి అవకాశం ఉందని భావించిన ఇరాన్ హర్మూజ్ని మూసివేయాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికోసమే ఆ జలసంధికి చెందిన చాలా ప్రదేశాల్లో ల్యాండ్ మైన్స్ (మందుపాతరలు) పెట్టింది. అయితే అలల తాకిడికి చాలా మైన్స్ కొట్టుకపోయి ఉండవచ్చని అవి ఎక్కడ ఉన్నాయో ప్రస్తుతం ఇరాన్కు సైతం గుర్తించ లేకుండా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పూర్తి సురక్షిత ప్రయాణానికి జలసంధిని తెరవాలని అల్టిమేటం ఇవ్వడం.. ఒక వేళ అనుమతి ఇచ్చాక ఏదైనా ప్రమాదంతో షిప్లు పేలిపోతే యుద్దం తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఇరాన్ కొంత ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.దానితో పాటు ల్యాండ్ మైన్లను అమర్చడం కంటే తొలగించడం మరింత కష్టమని ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో వాటిని తొలగించే సాంకేతికత గానీ సమయం గానీ ఇరాన్ వద్ద లేవని పేర్కొన్నాయి. ఒకవేళ ట్రంప్ మాటలను నమ్మి వాటిని తొలగిస్తే ఆయన ప్లేటు పిరాయిస్తే పరిస్థితులు ఏంటని అక్కడి నాయకులు ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ తెరవడానికి సందిగ్ధిత కొనసాగుతుందని తెలిపాయి. అయితే ట్రంప్ ఈ జలసంధి అంశంపై తాజాగా స్పందించారు ఇరాన్ హర్మూజ్ను తెరిచినా.. తెరవకపోయినా త్వరలోనే దానిని మేము ఓపెన్ చేస్తాము అని అన్నారు. ఈ విషయంలో వేరే దేశాలు సైతం మాకు సహాయం చేస్తామని ప్రకటించాయి అని అన్నారు. అయితే వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు. -
హార్ముజ్ నీ సొంతం కాదు.. ఇరాన్ కు బిగ్ షాక్
-
రూ.1,856 కోట్ల నిఘా డ్రోన్ కనిపించుట లేదు
ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నావికాదళానికి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్ను అగ్రరాజ్యం కోల్పోయినట్టు సమాచారం. గురువారం హార్మూజ్ జలసంధి సమీపంలో గగనతలంలో సీక్రెట్ మిషన్ సందర్భంగా ఉదంతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంక్యూ–4సీ ట్రైటాన్గా పిలిచే ఈ డ్రోన్ ఖరీదు ఏకంగా 20 కోట్ల డాలర్లు (రూ.1,856 కోట్లు) కావడం గమనార్హం. రాడార్ల నుంచి హఠాత్తుగా అదృశ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఎంక్యూ–4సీ ప్రమాదవశాత్తూ డ్రోన్ కూలిపోయిందా? లేక ఇరాన్ సైన్యం కూల్చివేసిందా? అనేది నిర్ధారణ కాలేదు. ఈ నిఘా డ్రోన్ను 2018లో అమెరికా సైన్యంలో ప్రవేశపెట్టారు. యుద్ధంలో కోల్పోవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఎఫ్–15ఇ, ఎ–10 వంటి ఆధునిక యుద్ధ విమానాలు నేలకూలాయి. ఎంక్యూ–4సీను కోల్పోవడంతో ఆ నష్టం మరింత పెరుగుతోంది. తొమ్మిది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లను కూడా అమెరికా నష్టపోయింది. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం అమెరికాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. డ్రోన్ నుంచి అత్యవసర సంకేతం ఎంక్యూ–4సీ డ్రోన్ ఆచూకీ కోసం అమెరికా సైన్యం గాలిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. హార్మూజ్ జలసంధిపై మూడు గంటల మిషన్ తర్వాత ఈ డ్రోన్ ఇటలీ దేశం సిగోనెల్లాలోని తన స్థావరానికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయింది. అదృశ్యమయ్యే ముందు అత్యంత వేగంగా కిందికి దిగినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపుతోంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 50 వేల అడుగుల ఎత్తు నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు దిగినట్లు చెబుతోంది. అత్యంత అధునాతనమైన మానవరహిత నిఘా డ్రోన్లలో ఒకటైన ఎంక్యూ–4సీ ట్రైటాన్ తొలుత సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి ఆకస్మికంగా ఇరాన్ వైపు మళ్లింది. రాడార్ నుంచి అదృశ్యమయ్యే ముందు 7700 అనే కోడ్ను పంపించింది. ఇది ఒక అత్యవసర సంకేతం. అయితే, ఆ అత్యవసర పరిస్థితి ఏమిటన్నదానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు హార్మూజ్ గగనతలంలోకి నిఘా డ్రోన్ ఎందుకు వెళ్లిందన్నది తెలియరాలేదు. పర్షియల్ గల్ఫ్ చుట్టుపక్కల పర్యవేక్షణ కోసం అమెరికా నావికాదళం గత నెల రోజులుగా ఎంక్యూ–4సీ ట్రైటాన్ను ఉపయోగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకరోజు ముందు ఈ నెల 7వ తేదీన ఈ డ్రోన్ ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్పై చక్కర్లు కొట్టిందని చెబుతున్నారు. గతవారం ఎఫ్–15ఇ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేసిన తర్వాత సహాయక చర్యల్లో డ్రోన్ పాలుపంచుకుంది. ఇది సాధారణ డ్రోన్ కాదు. సుదీర్ఘ కాలంపాటు సముద్ర నిఘా, పర్యవేక్షణ కోసం రూపొందించారు. 24 గంటలపాటు గాల్లో ఆగకుండా ఎగరగలదు. అమెరికా సైన్యానికి తురుపుముక్క లాంటి డ్రోన్ అదృశ్యం కావడం, ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం మిస్టరీగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హరూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త రూల్స్
-
హర్మూజ్పై ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
టెహ్రాన్: హర్మూజ్ నిర్వహణను కొత్త దశలోకి తీసుకువెళ్తామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇప్పటివరకు మేమే విజయం సాధించాం. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలాగని మా హక్కులను వదులుకోం. అలీ ఖమేనీతో పాటు ఇరాన్ అమరవీరుల కోసం ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ప్రభుత్వ మీడియా ద్వారా ఆయన హెచ్చరించారు.హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకోబోతోందని మొజ్తబా ఖమేనీ సంకేతాలు ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. అలాగే తమకు జరిగిన నష్టాలకు పరిహారం కోరాలని టెహ్రాన్ భావిస్తోందని కూడా స్పష్టం చేశారు.కాగా, హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే, కాస్తంత మెత్తబడిన ఇరాన్.. అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామన్న ఇరాన్.. పన్నులు కట్టిన నౌకలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇరాన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. ‘‘ఇరాన్ చర్య అగౌరవమైనది. మన మధ్య ఉన్న ఒప్పందం ఇదికాదు. ఇరాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’’ ట్రంప్ హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్ర మందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదల చేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది.చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. -
హర్మూజ్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
సందిగ్ధత నడుమ శాంతి
దుబాయ్/ఇస్లామాబాద్/బీరూట్/వాషింగ్టన్: పాకిస్తాన్ అస్తవ్యస్థ మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన ‘రెండు వారాల కాల్పుల విరమణ’పూర్తి సందిగ్ధవాతావరణంలో కొనసాగుతోంది. ఓవైపు లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పడం, మరోవైపు లెబనాన్పై దాడులుచేస్తే హార్మూజ్ పీకనొక్కేసి నౌకల రాకపోకలను శాశ్వతంగా మూసేస్తామన్న ఇరాన్ ప్రకటనతో అసలు కాల్పులవిరమణ అనేది ఏ స్థాయిలో అమలవుతోందనే ప్రశ్న యావత్ ప్రపంచప్రజలను వేధిస్తోంది. కాల్పుల విరమణ మొదలయ్యాక సైతం లెబనాన్పై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కన్నెర్రజేసిన ఇరాన్ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్ గుండా చమురు, పెట్రో ఉత్పత్తుల నౌకల రాకపై గంపెడాశలు పెట్టుకున్న ప్రపంచదేశాలు వెనువెంటనే నిట్టూర్చాయి. మరోవైపు తమ గగనతలంలోకి గత 24 గంటల్లో ఎలాంటి శత్రు క్షిపణులు, డ్రోన్లు చొరబడలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ గురువారం ప్రకటించాయి. పాకిస్తాన్లో జరగబోయే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో? చర్చలు విఫలమైతే మళ్లీ భీకరదాడులు, ప్రతిదాడులు తప్పవేమోనన్న భయాందోళనల పీడకల ప్రపంచదేశాలను వదిలిపోవట్లేదు. మరోవైపు తమపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన భీకరదాడిలో పెద్దసంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోవడంతో ఆ దేశంతో చర్చలకు సిద్ధమని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించారు. దీంతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘నేరుగా చర్చలు జరపాలని కేబినెట్ మంత్రులను ఆదేశించా. లెబనాన్లో హెజ్బొల్లా సాయుధులు తమ ఆయుధాలను త్యజించాల్సిందే. అప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత సంబంధాలపై దృష్టిసారించగలం’’అని నెతన్యాహూ అన్నారు. లెబనాన్పై భీకరదాడులు కొనసాగుతాయన్న కొద్దిసేపటికే ఆయన ఇలా భిన్నమైన ప్రకటనచేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనమేరకే నెతన్యాహూ లెబనాన్తో నేరుగా చర్చలకు అంగీకరించారని తెలుస్తోంది. వాషింగ్టన్లో వచ్చేవారం జరగబోయే ఈ చర్చల్లో అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యేషెల్ లీటెర్, లెబనాన్లో అమెరికా రాయబారి మైఖేల్ పాల్గొంటారని తెలుస్తోంది. మా వేలు ట్రిగ్గర్మీదే ఉంది.. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్ పేరు చేర్చినా ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై ఇరాన్ మండిపడింది. లెబనాన్పై దాడులుచేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. శనివారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగబోయే చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో బఘేర్ భేటీకానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే దారుణ ప్రతిదాడులు తప్పవని, గన్ ట్రిగ్గర్పై తమ వేలు అలాగే ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మరోవైపు చమురుధరలు పెరుగుతూ పోతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా నాణ్యమైన బ్రెంట్ రకం చమురు ధర బ్యారెల్కు 98 డాలర్లకు పెరిగింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28నాటి ధరతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం అధికంకావడం గమనార్హం. చర్చల అంశాలపైనా సందిగ్ధత చర్చల్లో ఇరాన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో? వాటికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ రీతిలో స్పందిస్తాయోననే సందిగ్ధత కొనసాగుతోంది. శనివారం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు జరగనున్నాయి. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సముద్రజలాలుగా ఉన్న హార్మూజ్ జలసంధి జలాలపై ఇకపై తమ గుత్తాధిపత్యం ఉండాలని ఇరాన్ డిమాండ్చేసే వీలుంది. ఇరాన్ నవతరం క్షిపణుల తయారీ ప్రాజెక్ట్, అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించడంపై చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుచెప్పే అవకాశముంది. ఆపత్కాలంలో కలిసిరావాల్సిన నాటో సభ్యదేశాలు మొండిచేయి చూపించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణల నడుమ జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ అగ్రరాజ్యానికి మద్దతుపలికారు. ‘‘అమెరికాతో నాటో కలిసి నడుస్తుంది. ఈ మేరకు బుధవారం ట్రంప్తో సంభాషించా. అయితే ఏమేరకు అమెరికాకు సాయపడాలనే అంశంపై జూలైలో తుర్కియేలోని అంకారాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో తేలుస్తాం. అమెరికా, యూరప్లను కలుపుతూ నాటో పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’’అని మెర్జ్ అన్నారు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్ సన్నాహకాలు చేస్తోంది. ఏర్పాట్లపై పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్తో సమీక్ష జరిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయంకల్లా ఇస్లామాబాద్కు చేరుకోనుంది. శిథిలాల దిబ్బ... బుధవారం మధ్యాహ్నం 10 నిమిషాల్లో 100కుపైగా ప్రాంతాలపై ఒకేసారి దాడిచేసి లెబనాన్లో ఇజ్రాయెల్ వినాశనం సృష్టించిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 303కు పెరిగింది. 1,150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దాడుల్లో హెచ్బొల్లా నేత నయీం ఖాసిమ్ సన్నిహితుడు అలీ యూసుఫ్ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. శిథిలాల గుట్టలుగా మారిన దాడి ప్రాంతాల్లో ఇంకా బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.సముద్ర మందుపాతరలతో జాగ్రత్త సరకు రవాణా నౌకలకు ఇరాన్ సూచన సీమైన్స్ అమర్చిన ప్రాంతం ‘చార్ట్’విడుదలదాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, కవి్వంపులు, హెచ్చరికల దశ దాటి కాల్పులవిరమణ పర్వంలోకి అడుగుపెట్టిన పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్రమందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదలచేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది. చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. సీమైన్స్ బారిపడకుండా ఈ నౌకలు ఇకపై ఇరాన్కు దగ్గరగా లరాక్ ద్వీపానికి సమీపంగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. మేం ఇరాన్ చుట్టూతే ఉంటాం: ట్రంప్కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆయన గురువారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికా బలగాల ఎక్కడికీ పోవు. పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూతా మొహరించే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల దాడి, కాల్పుల మోత మరింతగా మోగుతుంది’’ అని ట్రంప్ అన్నారు. -
యుద్ధ కొరతలకు కిం కర్తవ్యం?
ఇరాన్ యుద్ధం భారత్ శక్తి, ఆహార భద్రతలలో డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది. ఆర్థిక కోణంలోనే కాకుండా సైనిక భద్రతా కోణంలో కూడా ఇరాన్ యుద్ధం భారత్కు గుణపాఠాలు నేర్పుతున్నది. సాధారణంగా యుద్ధంలో పాల్గొంటున్న దేశాలపై యుద్ధ ప్రభావం ఉంటుంది. కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో అది ప్రపంచవ్యాప్తంగా కన్పిస్తున్నది. మన దేశ ముడి చమురు దిగుమతులలో సుమారు 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతులలో 50 శాతం, ఎల్పీజీ దిగుమతులలో సుమారుగా 80–90 శాతం హార్మూజ్ జల సంధి నుండే రావాలి. ముడిచమురును మనం రష్యా, యూఎస్ఏ, బ్రెజిల్, మెక్సికో మొదలగు దేశాల నుండి అదనంగా కొనటం ద్వారా పూరించుకోగలుగుతున్నాము. సుమారుగా 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాము. కానీ ఎల్పీజీ (వంటగ్యాస్) దిగుమతులు ప్రధానంగా ఖతర్ నుండి హార్మూజ్ జలసంధి ద్వారానే రావాలి. యుద్ధం ప్రారంభం కావడా నికి ముందు బ్యారెల్కి 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఒక దశలో 120 డాలర్లకు చేరుకొంది. కాల్పుల విరమణ వార్తలు చమురు ధరలకు కాస్త ఉపశమనం కలుగజేస్తున్నాయి. బ్యారెల్కు ప్రతి 10 డాలర్ల పెరుగుదల వలన సుమారుగా 15–16 బిలియన్ డాలర్లు చమురు దిగుమతికి అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. సౌదీ, యూఏఈ, ఖతర్ దేశాల చమురు క్షేత్రాలు, చమురుశుద్ధి కేంద్రాలకు నష్టం వాటిల్లటంతో, యుద్ధం ముగిసిన తరువాత కూడా చమురు ధరలు తగ్గకపోవచ్చు. చమురు, తత్సంబంధ ఉత్పత్తుల లభ్యతలో సమస్యలు ఉండవచ్చు.ఎరువుల ఉత్పత్తికి దెబ్బఇరాన్ యుద్ధం నేపథ్యంలో చర్చ ఎక్కువగా ముడిచమురు, ఎల్పీజీ మీదనే కేంద్రీకృతమయింది. ఇంతకంటే పెనుముప్పు దాగున్నది. ఎరువుల తయారీకి కావలసిన సహజ వాయువు, ఎల్ఎన్జీ, అమోనియా, ఫాస్పారిక్ ఆమ్లం, గంధకం, పొటాష్ వంటి ముడిసరుకుల కొరకు మనం గల్ఫ్ దేశాల మీద ఆధారపడు తున్నాము. బొగ్గు ఆధారిత ఎరువుల ఉత్పత్తిని గత రెండు దశా బ్దాలుగా సహజవాయువు/ఎల్ఎన్జీ ఆధారంగా మార్చివేశాం. ఎల్ఎన్జీ విషయంలో సుమారుగా 50 శాతం దిగుమతులపై ఆధార పడుతున్నాము. ఖతర్ నుండి ఎల్ఎన్జీ; యూఏఈ, ఒమన్ల నుండి ఎల్ఎన్జీ/సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నాము. యూరియా, డీఏపీ, ఎన్పీకే ఎరువుల తయారీకి వాడే అమో నియాను సౌదీ, ఖతర్, ఒమన్, యూఏఈ నుండి దిగుమతి చేసు కుంటున్నాము. సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్పీ) తయారీకి వాడే గంధకం ప్రధానంగా సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్ల నుండి దిగుమతి అవుతున్నది. ఎమ్ఓపీ (మ్యురేట్ ఆఫ్ పొటాష్)లో వాడే పొటాష్ దిగుమతిలో 42 శాతం సౌదీ నుండి వస్తున్నది. ఒమన్ నుండి సుమారుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. యుద్ధం వలన ఎరువుల ముడిసర కుల దిగుమతికి ఇబ్బంది ఏర్పడటమే కాకుండా ధరలు కూడా పెద్ద మొత్తంలో పెరిగాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా ఎరువుల కొరత ఏర్పడ వచ్చును. రానున్న ఎల్నినో వాతావరణ నేపథ్యంలో, ఎరువుల సమస్య అగ్నికి ఆజ్యంలా తోడయితే మన ఆహార భద్రత ప్రమాదంలో పడవచ్చు.ఆర్థిక మాంద్యం తప్పదా?పరోక్షంగాయుద్ధ ప్రభావం, ఫార్మాస్యూటికల్, ప్యాకేజింగ్, నిర్మాణ సామగ్రి, అల్యూమినియం, సెమికండక్టర్ తయారీ రంగా లపై కూడా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీమా ఖర్చులు పెరగటంతో అంతర్జాతీయ షిప్పింగ్ వ్యయం పెరిగి అన్ని వస్తువుల దిగుమతులు మరింత ప్రియమవుతాయి. కోవిడ్ దెబ్బ నుండి కోలు కొని అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ తన సత్తా చూపింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక ఆర్థిక వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. గత దశాబ్దంలో భారతదేశం ద్రవ్యోల్బణాన్ని మంచి నియంత్రణలో ఉంచగలిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్పణం 4 శాతం కిందకు పడిపోయింది. అయితే, దిగుమతుల వ్యయం, ధరల పెరుగుదల వలన బడ్జెట్ లోటు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి క్రమంగా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణానికి దారి తీసే అవకాశాలున్నాయి. గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా సంవత్సర కాలంగా రూపాయి విలువ వేగంగా పతనమవుతున్నది. పెట్టుబడులు భారత దేశం నుండి తరలిపోతున్నాయి. యుద్ధ అనిశ్చితి నేపథ్యంలో మొదటగా బంగారం, తరువాత డాలర్ (అమెరికన్ మార్కెట్) వైపు పెట్టుబ డులు తరలిపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించటంతో దిగుమ తులు ఖరీదవుతున్నాయి. పెరిగిన చమురు ధరల ప్రభావం నుండి సామాన్య పౌరుడిని కాపాడటానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. చమురు కంపెనీలపై భారాన్ని తగ్గించ టానికి చమురు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. వాణిజ్య వంట గ్యాస్, విమాన ఇంధనాల ధరలను మాత్రం పెంచారు. యుద్ధం మరో నెల పైన కొనసాగితే చమురు ధరలు బ్యారెల్ 150 డాలర్లకు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. అప్పుడిక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచక తప్పదు. బహుశా ప్రభుత్వం ఐదు రాష్ట్రాలలో ఎన్ని కలు పూర్తయ్యేవరకు వేచి చూస్తుంది. ఆస్ట్రేలియా, ద.కొరియా, నేపాల్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, యూఎస్ఏ మొదలగు దేశాలలో ఇంధన ధరలు పెరిగాయి. ఇంధన పొదుపుపై ఆ దేశాలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. మన దేశంలో కూడా ఇంధన పొదుపు దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించటం; పనివేళలు, పని దినా లను తగ్గించటం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శత్రువులను ఎదుర్కోవాలంటే...మన వంటిల్లు హార్మూజ్ జలసంధికి బందీ అవటం, మన ఎరువుల ఉత్పత్తికి గల్ఫ్ దేశాలపై ఆధారపడటం దేశ శక్తి భద్రత, ఆహార భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇంధన శక్తి, ఆహార ఉత్పత్తి దేశ మనుగడను శాసిస్తాయి. ఇలాంటి కీలక రంగాలలో స్వయం సమృద్ధి దిశగా కార్యాచరణ రూపొందించాలి. చమురు, సహజ వాయువుల మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించాలి. బొగ్గు, జల విద్యుచ్ఛక్తి, సౌర శక్తి, పవన శక్తి వంటి శక్తి వనరుల అభివృద్ధి మీద దృష్టిని మరింతగా కేంద్రీకరించాలి. సౌర శక్తి, పవన విద్యుచ్ఛక్తి ప్లాంట్ల నిర్మాణానికి కావలసిన పరికరాలకు చైనామీద ఆధారపడుతున్నాము. కీలక రంగాలలో దిగు మతులపై ఆధారపడకూడదు. ముఖ్యంగా అస్థిర (గల్ఫ్) దేశాల మీద, శత్రు దేశాల (చైనా) మీద అసలు ఆధారపడకూడదన్నది యుద్ధం మనకు నేర్పుతున్న గుణపాఠం. ఇరాన్ యుద్ధంలో విద్యుచ్ఛక్తి కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, పారిశ్రామిక వాడలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కేంద్రాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవటం శత్రువుకు కలిసివస్తుంది. భారతదేశం కూడా చైనా, పాకిస్తాన్లతో ఏకకాలంలో యుద్ధం చేయటానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరు శత్రువులు మూకుమ్మడిగా దాడి చేస్తే, మొదటి దెబ్బ మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్పైన, క్షిపణి కేంద్రాలపైన, యుద్ధయాన స్థావరాలపైన ఉంటుంది. డ్రోన్ల దండులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండవ దశలో మన విద్యుచ్ఛక్తి కేంద్రాలు, చమురుశుద్ధి కర్మాగారాలు దాడికి గురవుతాయి. ప్రాంతీయంగా వీటిని వికేంద్రీ కరించాల్సి ఉంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
హార్ముజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్ సంచలన నిర్ణయం
-
ఎట్టకేలకు శాంతి!
టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియా కల్లోలానికి ఎట్టకేలకు తాత్కాలికంగా తెర పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయి. కనీవిని ఎరగని దాడులతో ఇరాన్ను సర్వనాశనం చేసేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ ముగిసేందుకు కేవలం 90 నిమిషాల ముందు ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. దాంతో తాత్కాలికంగానైనా పెను ముప్పు తప్పిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇరాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టు మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ తన ట్రూత్సోషల్ మాధ్యంలో పోస్టు చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఇందుకు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్లో పోస్టు చేశారు. ఈ రెండు వారాల్లోగా యుద్ధానికి పూర్తిగా తెర దించేందుకు కృషి చేయాలని అమెరికా, ఇరాన్ నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు శుక్ర, లేదా శనివారాల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సమావేశం కానున్నారు. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్కు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సారథ్యం వహిస్తారని సమాచారం. ఇరు బృందాలూ గురువారమే ఇస్లామాబాద్ చేరుకోనున్నట్టు చెబుతున్నారు. ఇరాన్ బృందం రాకను అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ధ్రువీకరించినట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే ఇరు వర్గాల పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాల్పుల విరమణకు సంబంధించి తీవ్ర అయోమయం నెలకొంది. కాల్పుల విరమణ లెబనాన్కు కూడా వర్తిస్తుందని ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని ప్రకటించగా, నెతన్యాహు మాత్రం దాన్ని ఖండించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆగబోవని కుండబద్దలు కొట్టారు. అనంతరం ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. హెజ్బొల్లా కారణంగా కాల్పుల విరమణ లెబనాన్కు వర్తించబోదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగైతే విరమణ ఒప్పందం నుంచి బయటికి రావడమే గాక చర్చల నుంచే తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది! మరోవైపు, అసలు విరమణ ఒప్పందమే చాలా ‘బలహీనంగా’ఉందంటూ వాన్స్ పెదవి విరిచారు! ఇంకోవైపు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్, లెబనాన్లపై ఇజ్రాయెల్ నిరి్నరోధంగా దాడులను కొనసాగించింది. దాంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై భారీగా దాడులకు దిగింది! ఈ నేపథ్యంలో రెండు వారాల కాల్పుల విరమణ ఏ మేరకు అమలవుతుందన్నది సందేహాస్పదంగా మారింది. దీనికి తోడు, ఇరాన్తో ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి సంబంధించి ఇప్పటిదాకా తుది ప్రణాళిక అంటూ ఏమీ ఖరారు కాలేదని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కోరోలినా లెవిట్ మీడియాకు స్పష్టం చేశారు! ఇరాన్ షరతులపై ట్రంప్ అసంతృప్తి హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలన్న షరతుపైనే కాల్పుల విరమణకు తాను అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ 10 షరతులను తమ ముందుంచిందన్నారు. వాటిలో కొన్ని ఆచరణయోగ్యంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, ఆ తర్వాత మాట మార్చారు. ఇరాన్ షరతులు మోసపూరితంగా ఉన్నాయని ఆక్షేపించారు. అంతేగాక ఇరాన్ ఇకముందెప్పుడూ యురేనియం శుద్ధికి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ‘‘ఆ దేశం ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. గతేడాది మా దాడుల్లో భూ స్థాపితమైన ఆ యురేనియం నిల్వలను ఇరాన్ సహకారంతోనే వెలికి తీసి తరలిస్తాం’’అని చెప్పుకొచ్చారు. యురేనియం నిల్వలను తమకు అప్పగించని పక్షంలో ఇరాన్పై మళ్లీ దాడులు తప్పవని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు! కానీ ఇందుకు ఆ దేశం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది సందేహాస్పదంగా మారింది. యురేనియం నిల్వల అప్పగింతపై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించలేదు. ఇరాన్ను చర్చలకు ఒప్పంచడంలో తెర వెనక చైనా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు తమకు కూడా సమాచారం ఉందని వెల్లడించారు.విజయం మాదంటే మాదేఅమెరికా, ఇరాన్ ప్రకటనలు ఇరానే దేబిరించింది: హెగ్సెత్ షరతులకు ఒప్పకున్నారు: ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో, నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్ పోటాపోటీగా ప్రకటనలు జారీ చేశాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియా సాక్షిగా ప్రకటించారు! ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పలు పోస్టులు చేశారు.ప్రపంచ శాంతికి కీలకమైన రోజు! ఇరాన్ తమపై దాడులను ఆపాలని కోరింది. కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ నాకు చేరవేశారు. ఈ రాత్రికి ఇరాన్పై తలపెట్టిన అతి పెద్ద దాడిని నిలిపేయాలని విన్నవించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిచే షరతుపై ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపేసేందుకు నేను అంగీకరించా. ఆ దేశంపై దాడుల ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నింటిని ఇప్పటికే సాధించేశాం. ఇరాన్ మాకు 10 పాయింట్లతో ప్రతిపాదన పంపింది. దానిపై ఈ రెండు వారాల్లో చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు యథావిధిగా సాగేందుకు అమెరికా సాయపడుతుంది. ఇరాన్ తన దేశ పునరి్నర్మాణ ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చు. అమెరికాలో మాదిరిగానే పశ్చిమాసియాలో కూడా త్వరలో స్వర్ణయుగాన్ని ఆస్వాదించాలి. ఇది ప్రపంచ శాంతికే అతి కీలకమైన రోజు! – ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఇరాన్కు ఆయుధాలిస్తే 50 % టారిఫ్ విధిస్తా ఇరాన్ మిత్రదేశాలకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్తో కయ్యానికి కాలు దువ్వబోనని శాంతివచనాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మిత్రదేశాలపై టారిఫ్ల యుద్ధం ప్రకటించారు. ఇరాన్కు ఆయుధాలను సరఫరాచేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ‘‘ఇరాన్కు మిలటరీ ఆయుధాలు అందించే ప్రతి దేశంపై 50 శాతం టారిఫ్లు విధిస్తా. అటు ఇరాన్కు ఆయుధాలు పంపుతూ ఇటు అమెరికాకు వస్తూత్పత్తులను ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం టారిఫ్లను మోపుతా. టారిఫ్ల విధింపు విషయంలో ఎలాంటి మినహాయింపులు, సడలింపులు ఉండబోవు. ఇకపై ఆయుధాలు పంపిన తక్షణం అదనపు టారిఫ్లు అమల్లోకి వస్తాయి’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఒక పోస్ట్పెట్టారు. ట్రంప్ హెచ్చరికతో అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త అవరోధాలు తలెత్తే ముప్పు ఉంది. ఇరాన్ మిత్ర దేశాలైన రష్యా, చైనా, ఉత్తరకొరియా దేశాలపై అమెరికా అదనపు టారిఫ్ల భారం మోపే ఆస్కారముంది. రష్యా, చైనా, ఉ.కొరియాలు ఆయుధాలతోపాటు సైనిక సాంకేతికతనూ ఇరాన్కు చేరవేసినట్లు గతంలోనే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరగా దేశం వీడండిఇరాన్లోని భారతీయ పౌరులకు కేంద్రం సూచన దుబాయ్: అనూహ్యంగా కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరాన్ నుంచి బయటపడాలని అక్కడి భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారతరాయబార కార్యాలయం బుధవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘‘ఇరాన్ను వీడాలనుకునే భారతీయులు తొలుత అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రతించండి. వాళ్ల సూచన మేరకు నడుచుకోండి. ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకోకండి. రాయబార కార్యాలయం సూచించిన మార్గాల్లోనే దేశం వీడండి. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో +989128109115, +989128109102, +989128109109, +989932179359 నంబర్లకు ఫోన్చేసి సంప్రతించి తగు సూచనలు, సలహాలు తీసుకోండి. cons. tehran@mea.gov.in ఈమెయిల్కు మెయిల్చేసి సలహాలు పొందొచ్చు. -
ఇరాన్ బలహీనపడింది.. మా వేలు ట్రిగ్గర్పై ఉంది: నెతన్యాహు
ఇరాన్కి విధించిన డెడ్లైన్ పొడిగించిన ట్రంప్.. మరో రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెప్పారు. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం అందరికీ షాకిచ్చింది. దీంతో ఇరాన్.. మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ తర్వాత, లెబనాన్పై దాడులు అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు.'గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడింది. ఇరాన్తో యుద్ధంలో పెద్దఎత్తున లక్ష్యాలు సాధించాం. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది. ట్రంప్తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. మా వేలు ట్రిగ్గర్పై సిద్ధంగా ఉంది. కాల్పుల విరమణ లెబనాన్కి వర్తించదు. లెబనాన్.. సంధిలో భాగం కాదు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం' అని నెతన్యాహు అన్నారు.లెబనాన్పై ఇజ్రాయెల్ కేవలం 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు చేసింది. ఇందులో ఇప్పటివరకు 254 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లెబనాన్పై ఇలానే దాడులు చేస్తే సీజ్ఫైర్ నుంచి ఇరాన్ తప్పుకొనే అవకాశముంది. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ మళ్లీ మూసివేత
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారానికల్లా ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకునిపోతుందని హెచ్చరించిన ట్రంప్.. చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్కి పెట్టిన డెడ్లైన్కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈ లోపు శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్ని ఒప్పందంలో చేర్చలేదని తెలిపింది.ఈ క్రమంలోనే లెబనాన్పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. 10 నిమిషాల్లోనే 100కి పైగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోగా, వేలమంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరోవైపు ఇజ్రాయెల్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే హెచ్చరించింది. లెబనాన్పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్పై దాడి చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం సీజ్ఫైర్ ఒప్పందం కేవలం ఇరాన్పై దాడికి సంబంధించింది మాత్రమేనని లెబనాన్పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్.. మళ్లీ హర్మూజ్ని మూసేవేసింది. -
వెనక్కి తగ్గిన ట్రంప్.. సీజ్ ఫైర్ వెనుక కారణమిదేనా?
-
హర్ముజ్పై టోల్ ఫీజు!.. చట్టం ఏం చెబుతోంది?
పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా ఈ నెల 10న శాంతి చర్చలు జరగనున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన సూత్రాలు ‘వర్కబుల్’ అంటూ ట్రంప్ ప్రకటించడం గమనార్హం. అయితే.. కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలోనే కఠిన షరతులు కనిపిస్తున్నాయి.ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదవ వంతు హర్ముజ్ జలసంధి మార్గం ద్వారా జరుగుతుందన్నది తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో ఈ దారి మూసుకుపోయి.. పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఈ విషయంలో ట్రంప్ పలుమార్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ దారిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావడం అనేది హర్ముజ్ తెరుచుకోవడంపైనే ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది.ట్రంప్ ప్రకటన తర్వాత.. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మూసేసిన హర్ముజ్ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే ఈ విషయంలో కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. కాల్పుల విరమణ అమల్లో ఉండే రెండు వారాలపాటు పరిమిత నౌకా రవాణాకు మాత్రమే అనుమతి ఇస్తామని.. మళ్లీ దాడులు జరిగితే తక్షణమే ఆపేస్తామని అంటోంది. చర్చల కాలం లోపు ప్రతిదాడులను ఆపి నౌకలకు సురక్షిత ప్రయాణం కల్పిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఇరాన్ అమెరికా ముందు 10 డిమాండ్లు ఉంచింది. ఇదే అదనుగా పైసా వసూల్ ప్లాన్ను కూడా ఆచరణలో పెట్టాలనుకుంటోంది. భవిష్యత్తులో హర్ముజ్పై పూర్తి నియంత్రణ తమదే ఉండాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకలు ప్రయాణించాలంటే.. ఇరాన్ సైన్యంతో ముందస్తు సమన్వయం తప్పనిసరి అని అంటోంది. అంతేకాదు.. ఈ మార్గం గుండా టోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రయాణించే నౌకలకు చార్జీలు వసూలు చేస్తామని, వాటిని యుద్ధంతో దెబ్బ తిన్న తమ దేశ పునరుద్ధరణ.. భవిష్యత్తులో అభివృద్ధి కోసం వెచ్చిస్తామని చెబుతోంది. అయితే తమ షరతుల్లో ఏదైనా తేడా వస్తే మళ్లీ యుద్ధం మొదలుపెడతామని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో ఇస్లామాబాద్ చర్చలు కీలకం కానున్నాయి.టోల్ ప్లాజా ఏర్పాటు.. చెల్లుతుందా?.. జలసంధి మూసివేతతో చమురు ధరలు పెరిగాయి. ఇప్పుడు తాత్కాలికంగా తెరవడం వల్ల ధరలు స్థిరపడే అవకాశం ఉంది. అయితే.. హర్ముజ్ జలసంధిలో ఇప్పటిదాకా ఎలాంటి టోల్ వసూలు చేయలేదు. అలాంటప్పుడు ఇరాన్ తాజా కండిషన్ చెల్లుబాటు అవుతుందా? అనేది పరిశీలిస్తే.. ఇరాన్, ఒమన్లు కలిసే హర్ముజ్ ద్వారా వెళ్లే నౌకలపై ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలనుకుంటున్నాయి. అయితే.. గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, ఇతర దేశాలు ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జలసంధి గూండా స్వేచ్ఛా నావిగేషన్ కొనసాగాలని మొదటి నుంచి అవి కోరుతున్నాయి. అంతర్జాతీయ చట్టం (UNCLOS) ప్రకారం.. జలసంధి ప్రయాణానికి ఏ దేశాలు ఫీజు వసూలు చేయలేవు. అయితే, పైలటింగ్, టగ్, పోర్ట్ సేవల కోసం మాత్రమే పరిమిత ఫీజులు వసూలు చేసుకోవచ్చు. మొత్తం మీద.. హర్ముజ్ జలసంధి తాత్కాలికంగా తెరుచుకున్నప్పటికీ టోల్ ప్లాజ్.. ట్రాన్సిట్ ఫీజు అంశం కొత్త వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. -
ఇరాన్ను తుడిచిపెట్టేస్తాం
మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5) గంటలకల్లా మాతో ఒప్పందానికి రావాలి. అప్పటితో మీకిచ్చిన గడువు ముగుస్తుంది. తక్షణం హార్మూజ్ జలసంధిని తెరవాలి. లేదంటే ఇరాన్ను సమూలంగా తుడిచిపెట్టేస్తాం. ఒక్క రాత్రిలో ఆ దేశమంతటినీ సర్వనాశనం చేస్తాం. ఇదంతా జరగాలని నేనేమీ కోరుకోవట్లేదు. కానీ ఇరాన్ దారికి రాకుంటే జరిగేది అదే!. ఇదే చివరి డెడ్లైన్ – ఇరాన్ను ఉద్దేశించి ట్రంప్ వాషింగ్టన్/దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కనీవిని ఎరగని స్థాయికి చేరాయి. తక్షణం దారికి రాని పక్షంలో ఇరాన్ను భస్మీపటలం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘మీకిచ్చిన గడువు ముగియనుంది. మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30) గంటలకల్లా మాతో ఒప్పందానికి రావాలి. తక్షణం హార్మూజ్ జలసంధిని తెరవడం వంటి చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇరాన్ను సమూలంగా తుడిచిపెట్టేస్తాం. ఒకే ఒక్క రాత్రిలో ఆ దేశమంతటినీ సర్వనాశనం చేస్తాం. కనీసం జీవం తాలూకు ఆనవాళ్లు కూడా మిగలకుండా వారి నాగరికతనే నాశనం చేస్తాం’’ అంటూ మంగళవారం ఉదయం అల్టిమేటం జారీ చేశారు.‘‘ఇదంతా జరగాలని నేనేమీ కోరుకోవడం లేదు. కానీ ఇరాన్ దారికి రాకుంటే జరిగేది అదే!’’ అన్నారు. ఇరాన్కు విధించిన డెడ్లైన్లను ట్రంప్ ఇప్పటికే నాలుగుసార్లు పొడిగించడం తెలిసిందే. ‘‘ఈసారి మాత్రం అలాంటిదేమీ ఉండబోదు. ఇదే చివరి డెడ్లైన్’’ అని ఆయన స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్టులు పెట్టారు. కాసేపటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే సంప్రదింపులకు రాకపోతే యుద్ధంలో ఇప్పటిదాకా వాడని ఆయుధాలను ఇరాన్పై ప్రయోగిస్తామని పేర్కొన్నారు! అయితే అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది.ప్రాణాలొడ్డి పోరాడేందుకు తనతో పాటు ఏకంగా 1.4 కోట్ల మంది ఇరానీలు సిద్ధంగా ఉన్నట్టు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించారు. వారితో పాటు తాను కూడా యుద్ధరంగంలోకి దిగుతానని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా దుస్సాహసానికి దిగితే గల్ఫ్ అంతటా మారణహోమం సృష్టిస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం హెచ్చరించింది. అమెరికా, దాని మిత్ర దేశాలకు కొన్నేళ్లపాటు గల్ఫ్ నుంచి చమురు, గ్యాస్ అందకుండా చేస్తామని పేర్కొంది. విద్యుత్కేంద్రాలు, బ్రిడ్జిలను పేల్చేస్తానని ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో కీలక మౌలిక వనరులను దాడుల బారినుంచి కాపాడుకునేందుకు వాటి చుట్టూ మానవహారాలుగా ఏర్పడాల్సిందిగా ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.యువత, అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులతో సహా అందరూ ముందుకు రావాలని కోరుతూ ప్రభుత్వ ఉన్నతాధికారి అలీరెజా రహీమీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అంతేగాక బాలల చేతికి కూడా ఆయుధాలిచ్చి యుద్ధ రంగంలోకి పంపేందుకు కూడా ఇరాన్ సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి! చెక్పాయింట్ల వద్ద పహారాకు ప్రతి ఇంటి నుంచీ పిల్లల్ని పంపాల్సిందిగా ఐఆర్జీసీ పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇరానీలు భారీగా వలస బాట పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. యుద్ధం అత్యంత భీకర రూపు దాల్చవచ్చన్న సంకేతాల నడుమ, ఏం జరగనుందోనని ప్రపంచమంతా ఊపిరి బిగబట్టింది!నలిపేస్తున్నాం: నెతన్యాహుటెహ్రాన్, కరాజ్, తబ్రిజ్, కషన్, కోమ్ తదితర నగరాల్లో కనీసం 8కి పైగా బ్రిడ్జిలను తమ యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ‘‘ఐఆర్జీసీ వాటిని ఆయుధాల సరఫరాకు వాడుకుంటోంది. అందుకే వాటిని పేల్చేయాలని ఆదేశించా’’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ను అన్నవిధాలా నలిపేస్తున్నామని చెప్పుకొచ్చారు.భారీగా ఇరాన్ ప్రతి దాడులుఇజ్రాయెల్పై ఇరాన్ భారీగా ప్రతి దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపైనా విరుచుకుపడింది. ముఖ్యంగా సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక నగరం జుబెయిల్పై డ్రోన్ల వర్షం కురిపించింది. ఆ ప్రాంతమంతా భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోతున్న వీడియో వైరల్గా మారింది. దాడుల తీవ్ర దృష్ట్యా సౌదీని బహ్రెయిన్తో కలిపే కీలకమైన కింగ్ ఫహాద్ వంతెనను తాత్కాలికంగా మూసేశారు. పౌర సదుపాయాలపై దాడులా?ఇరాన్లో పౌర సదుపాయాలు, ఇంధన వ్యవస్థలపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు, యుద్ధ నియమాలకు విరుద్ధమని ఐరాసతో పాటు ఫ్రాన్స్ తదితర దేశాలు దుయ్యబట్టాయి.ఇరాన్లో 18 మంది మృతిఇరాన్పై మంగళవారం అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి దాడులకు దిగాయి. చమురు రవాణాకు ఆయువుపట్టైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. కనీసం 50కి సైనిక లక్ష్యాలను వైమానిక దాడుల్లో నేలమట్టం చేసినట్టు వెల్లడించింది. అయితే అక్కడి చమురు నిల్వలు, క్షేత్రాల జోలికి మాత్రం వెళ్లలేదని స్పష్టం చేసింది. రైళ్లు, రైల్వేస్టేషన్లకు దూరంగా ఉండాల్సిందిగా ఇరానీలను తొలుత ఇజ్రాయెల్ హెచ్చరించింది. తర్వాత కాసేపటికే దేశవ్యాప్తంగా బ్రిడ్జిలు, రైల్ నెట్వర్కులే లక్ష్యంగా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది.ఒక రైల్వే బ్రిడ్జి, హైవే బ్రిడ్జితో పాటు పలు రైల్వేస్టేషన్లకు భారీ నష్టం వాటిల్లినట్టు ఇరాన్ వెల్లడించింది. టెహ్రాన్లో ఎటు చూసినా పేలుళ్ల శబ్దాలే విన్పించాయి. నగరంలోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దాడుల ధాటికి అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. పశ్చిమ ఇరాన్లోని ఖొర్రమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా వైమానిక దాడులు జరిగాయి. అల్బోర్జ్ ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో 18 మంది మృత్యువాత పడ్డట్టు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. 24 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. షిరాజ్లోని పెట్రో కెమికల్ ప్లాంట్పై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇజ్రాయెల్ కాన్సులేట్పై దాడిఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని ఇజ్రాయెల్ కాన్సులేట్పై మంగళవారం ముగ్గురు సాయుధులు దాడికి దిగా రు. కాన్సులేట్ భవనం బయట కాల్పులకు పాల్ప డ్డారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఒకరు మరణించారు. గాయపడ్డ మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అణుదాడికి సంకేతమా?⇒ ట్రంప్, వాన్స్ హెచ్చరికలపై సర్వత్రా భయాందోళనలు ⇒ ఖండించిన వైట్హౌస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ను సమూలంగా భస్మీపటలం చేస్తామని ట్రంప్, పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటిదాకా వాడని ఆయుధాలను బయటికి తీస్తామని వాన్స్ పేర్కొనడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు బహుశా ఇరాన్పై అణుదాడికి సంకేతాలే కావచ్చంటున్నారు. గార్డియన్ వంటి వార్తా సంస్థలతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా భారీగా పోస్టులు పెడుతున్నారు. దాంతో ఈ అంశంపై వైట్హౌస్ స్పందించింది. అణు దాడి వార్తలను ఖండించింది. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారంతా ‘బఫూన్లు’ అంటూ మండిపడింది.విద్యుత్కేంద్రాలకు దూరంగా ఉండండిఇరాన్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అక్కడి భారతీ యులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ‘‘రెండు రోజుల పాటు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోండి. ముఖ్యంగా విద్యుత్కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్మెంట్ల పై అంతస్తులకు దూరంగా ఉండండి. హైవేలపై ప్రయాణించాల్సి వస్తే భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకోండి’’ అని సూచించింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది.హార్మూజ్పై తీర్మానం వీటో చేసిన రష్యా, చైనాఐక్యరాజ్యసమితి: హార్మూజ్ జలసంధిని ఇరాన్ వెంటనే తెరవాలంటూ మంగళవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేశాయి. బహ్రెయిన్ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా 11, వ్యతిరేకంగా 2 ఓట్లు రాగా రెండు దేశాలు గైర్హాజరయ్యాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. ‘‘నిత్యావసరాల ధరలు, ఇంధన వ్యయాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముడి పదార్థాలు, వస్తువుల సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిత్యావసర వస్తువులకు అధిక ధరలు చెల్లిస్తున్నారు. హార్మూజ్ను తెరిచేందుకు అంతర్జాతీయంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’’ అంటూ ఓటింగ్కు ముందు ఐరాసలోని యూఏఈ ప్రతినిధి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
‘ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం’.. ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుంది. అది జరగొద్దని అనుకుంటున్నా. కానీ జరుగుతోంది. ఆ నాగరికతను తిరిగి వెనక్కి తీసుకురావడం అసాధ్యం. ఇరాన్లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతుంది’అని వ్యాఖ్యానించారు. ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, అమెరికా భారీ దాడులు చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. అదే సమయంలో ఇరాన్లోని ఓ నాగరికత అంతం’ అని పేర్కొన్నారు. అదే సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికా ‘రెడ్ లైన్స్’ దాటితే ప్రాంతం బయట కూడా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. అమెరికా, దాని మిత్రదేశాలకు చాలా సంవత్సరాల పాటు చమురు,ఇతర సహజ వనరులు అందకుండా చేస్తామని తెలిపింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ, ట్రంప్ ఈ ఆందోళనలను పట్టించుకోకుండా పూర్తి విధ్వంసం జరగబోతుందని స్పష్టంచేశారు.ఇరాన్ ఇప్పటికే అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించడానికి సిద్ధమవుతుండగా..‘నాగరికత నశనం’అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియా యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ప్రపంచ చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
ట్రంప్పై మీమ్ల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సేనలు రణక్షేత్రంలో అమెరికా సైనికులతో తలపడుతుంటే ఇరాన్ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెటకారపు మాటలతో ట్రంప్ను చీల్చి చెండాడుతున్నాయి. వెక్కిరింతలతో, మీమ్స్తో ట్రంప్పై విరుచుకుపడుతున్నాయి. దీంతో నెటిజన్లకు నవ్వుకోవడానికి భారీ సరుకే దొరికింది. ‘ఎక్స్’ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఇప్పుడీ మీమ్స్ తెగ షేర్ అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాలు, సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కుప్పకూలినా ట్రంప్ ఇంకా తామే గెలిచామనడంపై పశ్చిమఆఫ్రికాలోని సియారాలియోన్ దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక వెటకారపు ట్వీట్ పెట్టింది. దాంట్లో బాంబుల ధాటికి సూటు చిరిగిపోయి, దెబ్బలు తగిలి, జుట్టు చెదిరిపోయినా ట్రంప్ ‘మేమే గెలిచాం’అని గట్టిగా అరుస్తున్నట్లు ఒక ఏఐ ఫొటోను పెట్టి ‘‘అవును సర్. అంతా తగలబడినా మీరే గెలిచారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి’’అనే క్యాప్షన్ను ఎంబసీ జతచేసింది. హార్మూజ్ను తెరవండి వెధవల్లారా అని ట్రంప్ తిట్టగా ‘అసలు అది మూసేయలేదుగా. మా నౌకలు హార్మూజ్ను ఇప్పుడే దాటేశాయిగా’’అని చైనా అన్నట్లు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్ పెట్టింది. జలసంధిని తెరవాలని ట్రంప్ ఆదేశించగా తాళం చెవులు ఎక్కడో మరచిపోయామని మరో ట్వీట్ పెట్టారు. సొంత మాధ్యమం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ కొద్దిసేపు పోస్ట్లుపెట్టకపోతే ‘‘సార్. ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి పోస్ట్ చేయండి. లేదంటే మాకు మహా బోర్ కొడుతోంది’’అని జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్తో నవ్వించింది. -
కాల్పుల విరమణకు ఇరాన్ నో!..హెచ్చరించిన ట్రంప్
దుబాయ్/జెరూసలేం/వాషింగ్టన్: నెలన్నర రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. కాల్పులకు 45 రోజుల పాటు విరామం ఇచ్చేలా అమెరికా, ఇరాన్లను ఒప్పించేందుకు ఈజిప్టు, టర్కీ, పాకిస్తాన్ సోమవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాల్పులకు విరామంతో పాటు హార్మూజ్ జలసంధిని తెరవడం తదితరాలతో కూడిన ప్రతిపాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్కు ఆయా దేశాల ప్రతినిధులు అందజేశారు. కానీ ఈ ప్రతిపాదనను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. ‘‘తాత్కాలిక కాల్పుల విరమణ కోసం హార్మూజ్ను తెరవడం ఇరాన్కు ఏ మాత్రమూ అంగీకారం కాదు. ఈ విషయాలన్నింటినీ పాక్ ద్వారా ఇప్పటికే అమెరికాకు తెలియజేశాం’’ అని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. యుద్ధానికి శాశ్వతంగా తెర దించడం మినహా మరేదీ తమకు అంగీకారయోగ్యం కాదని కైరోలోని ఇరాన్ దౌత్య బృందం సారథి మొజ్తబా ఫిర్దౌసీ పోర్ కుండబద్దలు కొట్టారు! అంతేగాక యుద్ధానికి తెర దించే విషయమై ఇరాన్ తాజాగా అమెరికాకు 10 షరతులు కూడా విధించింది! ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. హార్మూజ్ను తెరవడంపై కూడా అంతకుముందే ఇరాన్కు ఆయన మరిన్ని హెచ్చరికలు చేశారు. ‘‘మీకు మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5) గంటల వరకే గడువు. ఆలోపు దిగిరాకుంటే కనీవినీ ఎరగని దాడులతో సర్వనాశనం చేసేస్తాం’’ అంటూ హెచ్చరించారు. ఇరాన్పైకి అమెరికా ఇప్పటికే అత్యాధునిక లాంగ్ రేంజ్ జేఏఎస్ఎస్ఎం–ఈఆర్ క్షిపణులను భారీ సంఖ్యలో ఎక్కుపెట్టినట్టు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి! సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ దాడులుఇజ్రాయెల్, అమెరికా సోమవారం ఇరాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇరాన్కు అత్యంత కీలకమైన సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై కూడా ఇజ్రాయెల్ భారీగా దాడులకు దిగింది. దాంతో అక్కడి పెట్రో కెమికల్ ప్లాంటుకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. టెహ్రాన్పై యుద్ధ విమానాలు గంటల తరబడి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) నిఘా విభాగం అధిపతి మజీద్ ఖదేమీ మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేగాక ఐఆర్జీసీకి చెందిన ఖుద్స్ ఫోర్స్ కీలక నేత అస్ఘర్ బకేరీని కూడా అంతం చేసినట్టు పేర్కొంది. రాజకీయ, సైనిక ప్రముఖులందరినీ ఒక్కొక్కరుగా అంతం చేసి తీరతామని స్పష్టం చేసింది. మజీద్ మృతిని ఇరాన్ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులెవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఎస్లాంషార్ నగరంపై దాడుల్లో 15 మంది దాకా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కోమ్ నగరంలో పౌర ఆవాసాలపై దాడుల్లో ఐదుగురు, ఇతరచోట్ల మరో ఆరుగురి దాకా మృతి చెందారన్నారు. టెహ్రాన్లో ఓ ఇంటిపై జరిగిన దాడికి మరో ముగ్గురు బలయ్యారు. లెబనాన్లో కూడా దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. ఐన్ సాదే నగరంలో లెబనాన్ సైనికాధికారి ఒకరు దాడుల్లో మరణించారు.ఒక్క రాత్రిలోనే నాశనం చేసేస్తాంఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరికలు ఇరాన్ అంతటినీ ఒకే ఒక్క రాత్రిలో సర్వనాశనం చేసేయగల సత్తా అమెరికా సొంతమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘అది బహుశా మంగళవారం రాత్రే కావచ్చు’’ అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన హెచ్చరించారు. ఇరాన్ భూభాగం నుంచి ఎఫ్–15ఇ యుద్ధ విమానం తాలూకు ఎయిర్మ్యాన్ను కాపాడేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. అందుకోసం ఏకంగా 155 యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్టు చెప్పుకొచ్చారు! దీని గురించి తొలుత రిపోర్ట్ చేసిన అమెరికా జర్నలిస్టు ఓ అత్యంత పనికిమాలిన వ్యక్తి అంటూ అధ్యక్షుడు మండిపడ్డారు. ‘‘అతను చేసిన పని వల్ల రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇరాన్కు తెలిసిపోయింది. దాంతో అందులో పాల్గొన్న సైనికులందరి ప్రాణాలూ ముప్పులో పడ్డాయి’’ అంటూ దుయ్య బట్టారు. సదరు కథనానికి సోర్స్ ఏమిటో బయట పెట్టకుంటే ఆ జర్నలిస్టును జైల్లో పెడతామని హెచ్చరించారు. ఇరాన్ షరతులివే! → పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్ ఏకపక్షంగా మొదలుపెట్టిన యుద్ధానికి తక్షణం తెర దించాలి → ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరింకెప్పటికీ దండెత్తరాదు. ఈ మేరకు ఇరు దేశాలూ స్పష్టమైన హామీలివ్వాలి → ఇరాన్పై ఆర్థిక తదితర ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి → ఇరాన్ పునర్నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులివ్వాలి → హార్మూజ్ను పూర్తిస్థాయిలో తెరవాలంటే మేం రూపొందించే ప్రొటోకాల్స్కు కట్టుబడాలి -
ఇరాన్తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు
పశ్చిమాసియాలో యుద్ధ భయాల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్ వంటి ఇంధన అవసరాలు అధికంగా ఉన్న దేశాలు ఇరాన్తో జరిపిన చర్చలు సఫలం కావడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.రెండు రోజుల్లో 21 నౌకల ప్రయాణంగత వారాంతంలో ఈ జలమార్గం గుండా ఏకంగా 21 నౌకలు ప్రయాణించాయి. మార్చి మొదటి వారంలో ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ 21 నౌకలలో 13 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రంలోకి చేరుకున్నాయి. ఇరాన్ నౌకల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ మిత్రదేశం అనే కారణంతో ఇరాక్ ముడి చమురు ట్యాంకర్లకు టెహ్రాన్ ప్రత్యేక మినహాయింపునిచ్చింది. భారతదేశం ఇరాన్తో జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఎనిమిది ఎల్పీజీ ట్యాంకర్లు ఈ మార్గం ద్వారా సురక్షితంగా బయటపడ్డాయి.అగ్రరాజ్యం హెచ్చరికలుయుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని, ఆ దేశానికి నరకం చూపిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. నౌకల ప్రయాణంపై టోల్ వసూలు చేసే ప్రక్రియను చట్టబద్ధం చేస్తూ కొత్త నిబంధనలను తీసుకువస్తామని చెప్పింది. యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఈ రుసుములతోనే భర్తీ చేస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారత్, చైనా, గ్రీస్, టర్కీ, థాయ్లాండ్ దేశాలకు చెందిన నౌకలు ఇరాన్ సూచించిన తీర ప్రాంత మార్గాల గుండా ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. అయినప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య రంగాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
ముగియనున్న 48 గంటల డెడ్లైన్.. ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ట్రే యింగ్స్ట్కు ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో.. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి. లేదంటే అన్నింటిని పేల్చేస్తాం. ఇరాన్ చమురును స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అంతేకాదు.. హర్మూజ్ జలసంధించిన తెరిచేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ ప్రతినిధులకు పరిమిత క్షమాభిక్ష ప్రసాదించినట్లు తెలిపారు. అయితే, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. చర్చలు విఫలమైతే, కీలక ఆస్తులను ధ్వంసం చేయడం, ఇరాన్ చమురు వనరులను స్వాధీనం చేసుకోవడంతో సహా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాము ఇరాన్ నిరసనకారులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వారికి ఆయుధాలు పంపించాం. ఆ ఆయుధాలు నిజంగా నిరసనకారుల చేతికి చేరలేదని, మధ్యలో కుర్దిష్ మార్గాల ద్వారా వెళ్లి.. కుర్దిష్ సమూహాల దగ్గరే ఉండిపోయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ జారీ చేసిన అల్టిమేటం గడువు ముగియనున్న తరుణంలో ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ తోసిపుచ్చింది . ఇరాన్ కేంద్ర సైనిక కమాండ్ జనరల్ అలీయాబాది, ట్రంప్ బెదిరింపును నిస్సహాయమైన, ఆందోళనతో కూడిన, అస్థిరమైన, తెలివితక్కువ చర్య అని అన్నారు.ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. శత్రుత్వం పెరిగితే ఇరాన్లో మీకు నరకం కనబడుతోంది. ఇరాన్ను ఓడించాలన్న మీ భ్రమ ఊబిగా మారి మీరు అందులో కూరుకుపోతారు’అని రెచ్చగొట్టారు. మరి రేపటితో ముగియనున్న డెడ్ లైన్ అనంతరం, ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. కాగా, హోర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది.ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే, అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అందుకే అమెరికా దీనిని ప్రపంచ ఆర్థిక భద్రతకు ముప్పుగా చూస్తోంది. -
హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ
న్యూఢిల్లీ: భారత్ దిశగా ఎల్పీజీ నౌకల ప్రయాణపరంపర కొనసాగుతోంది. తాజాగా ఉద్రిక్తమయ హార్మూజ్ జలసంధిని ఎల్పీజీ రవాణా నౌక ‘గ్రీన్ శాన్వి’విజయవంతంగా దాటింది. మరోవైపు మరో ఎల్పీజీ నౌక ఇరాన్ నుంచి బయల్దేరి క్షేమంగా భారత్కు చేరుకుంది. ఇది మంగళూరుకు చేరుకుని ఎల్పీజీని దిగుమతిచేస్తోంది. తాజాగా హార్మూజ్ను దాటిన గ్రీన్ శాన్వీ నౌక 46,650 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. ఇదే నౌకలో 25 మంది నావికులు సైతం ఉన్నారు. భారతీయ జెండాతో బయల్దేరి విజయవంతంగా హార్మూజ్ను దాటిన ఎల్పీజీ నౌకల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. వీటిలో ఏడు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎం ఇప్పటికే భారత్కు చేరుకున్నాయి. గ్రీన్ శాన్వీ మార్గమధ్యంలో ఉంది. ఇరాన్ ప్రభుత్వం తరఫున ఎల్పీజీ నౌక ‘సీ బర్డ్’రాకతో గత ఏడేళ్లలో ఆ దేశం నుంచి భారత్కు చేరుకున్న తొలి నౌకగా ఇది గుర్తింపు పొందింది. ఈ నౌకలో 44,000 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇన్నాళ్లూ ఇరాన్ దేశ చమురు ఉత్పత్తులపై అమెరికా అంతర్జాతీయ నిషేధం విధించగా అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. చైనా దిశగా ఇరాన్ నౌకపై భారత్ స్పష్టీకరణ ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ దిశగా వస్తున్న ఇరాన్ చమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశ మార్చుకోవడంలో చెల్లింపుల అంశం అస్సలే లేదని, చెల్లింపుల ఆలస్యం కారణంగానే అది భారత్కు రావట్లేదనే వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం మంత్రిత్వ శాఖ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టింది. ‘‘అంతర్జాతీయంగా మార్గమధ్యంలో ఇంధన నౌకలు తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడం సాధారణం. గిట్టుబాటు, వాణిజ్య వెసులుబాట్లు, నిర్వహణ సౌకర్యాలకు అనుగుణంగా నౌకలు తమ దిశలను మార్చుకుంటాయి. తాజాగా భారత్కు ఏడేళ్ల తర్వాత గుజరాత్లోని వడినార్కు వస్తున్న ముడిచమురు నౌక ‘పింగ్ షున్’హఠాత్తుగా దిశమార్చుకోవడంలో చెల్లింపుల అంశం ఇమిడిలేదు. ఇరాన్తో భారత్కు ఎలాంటి చెల్లింపుల వివాదాలు లేవు. నౌకల సంబంధ నగదు చెల్లింపులు సవ్యంగా జరుగుతున్నాయి’’అని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
దిగిరాకుంటే నరకమే!
దుబాయ్: హార్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే కనీవినీ ఎరగని వినాశనానికి ఆ దేశం సిద్ధపడాల్సి ఉంటుందన్నారు. శనివారం ఈ మేరకు స్వీయ సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘హార్మూజ్ను తెరిచేందుకు మీకిచ్చిన గడువు ఏప్రిల్ 6తో ముగుస్తోంది. ఆలోపే ఒప్పందానికి రండి. లేదంటే భారీ దాడులతో మీకు అక్షరాలా నరకం చవిచూపిస్తాం’’అంటూ బెదిరింపులకు దిగారు. అయితే, ఇరాన్ శక్తిసామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించడం విశేషం. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా మేం సైనిక పోరాటం చేస్తున్నాం’అని ఆయన చెప్పుకొచ్చారు! టెహ్రాన్పై బాంబుల వర్షం ఇరాన్పై శనివారం కూడా ఇజ్రాయెల్, అమెరికా ముమ్మరంగా దాడులు కొనసాగించాయి. బుషెహర్లోని అణు విద్యుత్కేంద్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్లాంటుపై క్షిపణి దాడులు జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. ‘‘దాడిలో సెక్యూరిటీ గార్డు మరణించాడు. కాకపోతే రేడియేషన్ లీకేజీ వంటిదేమీ సంభవించకపోవడం కాస్త ఊరట’’అని తెలిపింది. ఇది ఇటీవలి కాలంలో ఇరాన్ అణుకేంద్రాలపై జరిగిన నాలుగో దాడి. టెహ్రాన్లో ఒక పెట్రో కెమికల్ ప్లాంట్పైనా భారీగా క్షిపణి దాడులు జరిగాయి. రాజధాని టెహ్రాన్ దాడులతో దద్దరిల్లింది. నగరంలోని పలు క్షిపణి నిల్వ కేంద్రాలను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై భారీగా ప్రతి దాడులకు దిగింది. దుబాయ్లోని ఒరాకిల్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో భవనానికి భారీ రంధ్రం పడ్డ ఫుటేజీ వైరల్గా మారింది. తమపైకి ఇరాన్ ప్రయోగించిన 23 బాలిస్టిక్ క్షిపణులు, 56 డ్రోన్లను కూల్చేసినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తమపై 8 డ్రోన్ దాడులు జరిగినట్టు బహ్రెయిన్ తెలిపింది.పైలట్ కోసం వేట! శుక్రవారం నాటి ఇరాన్ దాడుల్లో ఎఫ్–15ఇ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానంతో పాటు కె–10 వార్ థగ్ ఫైటర్ జెట్ను కూడా అమెరికా కోల్పోయిట్టు తెలుస్తోంది. అయితే, ‘‘కె–10 తాలూకు శకలాలు కువైట్ భూభాగంలో పడ్డాయి. దాంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు’’అని అమెరికాకు చెందిన పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఎఫ్–15ను ఇరాన్ తమ గగనతనంలోనే కూల్చేయడం తెలిసిందే. అందులోని పైలట్తో పాటు గన్నర్ సురక్షితంగా బయటపడ్డారు. వారు నైరుతి ఇరాన్లోని కొగిలుయె, బోయర్–అహ్మద్ కొంత ప్రాంతంలో కిందకు దూకారు. అమెరికా ప్రత్యేక సైనిక దళాలు వెంటనే రగంలోకి దిగి వారిలో ఒకరిని కాపాడి తీసుకెళ్లాయి. మరొకరి కోసం శనివారం కూడా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఇరాన్ కూడా అతన్ని ఎలాగైనా నిర్బంధించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. శుక్రవారం నాటి రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా రెండు అమెరికా హెచ్హెచ్–60డబ్లు్య జాలీ గ్రీన్–2 బ్లాక్హాక్ హెలికాప్టర్లు కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు సమాచారం. అవి కష్టమ్మీద ఇరాన్ భూభాగాన్ని దాటి సురక్షిత స్థానానికి చేరినా వాటి పైలట్లు గాయపడ్డట్టు తెలుస్తోంది. శుక్రవారమే మరో కె–10 యుద్ధ విమానం కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నట్టు అమెరికా సైనిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి వార్తా సంస్థలు పేర్కొనడం విశేషం. ‘‘ఒక ఇంజన్ విఫలమైంది. దాంతో అది సింగిల్ ఇంజన్తోనే అతి కష్టమ్మీద గల్ఫ్లోని వైమానిక స్థావరానికి చేరుకుంది’’అని వెల్లడించాయి! అయితే ఈ ఉదంతం చర్చల ప్రక్రియను ప్రభావితం చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంపై అమెరికా యుద్ధవిమానాలను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం విశేషం! అగ్ర రాజ్యం చివరిసారిగా 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో ఏ–10 థండర్బోల్ట్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది.మీ కుమారులకు ట్రంప్తోనే ముప్పు హాని తలపెట్టొద్దన్న పైలట్ తల్లి విజ్ఞప్తికి ఇరాన్ కౌంటర్ టెహ్రాన్: శత్రు దేశ పైలట్ అనే ప్రతీకారేచ్ఛతో తన కుమారుడికి హాని తలపెట్టొద్దని అమెరికా పైలట్ తల్లి చేసిన విజ్ఞప్తికి ఇరాన్ తనదైన రీతిలో బదులిచ్చింది. దాడి కోసం వచ్చి తమ గగనతలంపై చక్కర్లు కొడుతున్న అమెరికా యుద్ధవిమానాలను ఇరాన్ శుక్రవారం నేలకూల్చడం తెల్సిందే. దీంతో పైలట్లు బయటకు దూకేయగా ఒకరిని అమెరికా, ఇజ్రాయెల్ సేనలు రక్షించి వెంటతీసుకెళ్లాయి. మరో పైలట్జాడ తెలీడం లేదు. అతడిని ఇరాన్ బంధించిందని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒక పైలట్ తల్లి విజ్ఞప్తిచేశారు. ‘‘ఎఫ్–15 ఫైటర్జెట్ పైలట్లకు హాని తలపెట్టకండి. వారిలో ఒకతను నా కుమారుడు’’అని ఆమె వేడుకున్నారు. దీంతో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు దీటుగా స్పందించాయి. ‘‘ఇరాన్ కస్టడీకంటే మీ కుమారులకు డొనాల్డ్ జూనియర్ ట్రంప్తోనే ముప్పు ఉంది. అమెరికా రెస్క్యూ టీమ్లకు దొరక్కుండా మా కస్టడీలోనే వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకోండి. అమెరికాకు దొరికితే ఏమేం రహస్యాలు వెల్లడించారని చెప్పి చిత్రవధ చేస్తారు. ముస్లింలుగా, నాగరికత తెల్సిన ఇరానియన్లుగా మాకు మీ వాళ్లను ఎలా చూసుకోవాలో తెలుసు. మర్యాదతో, గౌరవప్రదంగా చూసుకుంటాం. అమానవీయ యూదనీతుల కంటే యుద్ధనీతులు మాకు బాగా తెలుసు. యుద్ధఖైదీలను పద్ధతిగా చూసుకుంటాం. మేం ఆలోచనల్లో అమెరికా మాదిరి రాతియుగంలో బతకట్లేము’’అని ఎంబసీలు బదులిచ్చాయి. బోర్ కొడుతోంది, ఏమన్నా మాట్లాడండి! ట్రంప్ బెదిరింపులపై ఇరాన్ ఎద్దేవా ట్రంప్ తాజా హెచ్చరికలను ఇరాన్ తేలిగ్గా తీసిపడేసింది. అమెరికాతో చర్చలకు తామే దిగొచ్చామన్న ట్రంప్ వ్యాఖ్యలను మరోసారి ఖండించింది. అధ్యక్షుని మాటలకు ఇప్పుడెవరూ పెద్దగా విలువ ఇవ్వడం లేదనే అర్థం వచ్చేలా జింబాబ్వేలోని ఇరాన్ దౌత్య కార్యాలయం శనివారం ఎక్స్లో పోస్టు పెట్టింది! ‘‘మాకు బాగా బోర్ కొడుతోంది. ఏదో ఒకటి మాట్లాడండి’’అంటూ ట్రంప్ మాటతీరును ఎద్దేవా చేసింది. చర్చలకు ఇరాన్ సుముఖత! అమెరికాతో కాల్పుల విరమణ చర్చలకు ఇప్పటిదాకా ససేమిరా అంటూ వచ్చిన ఇరాన్ ఎట్టకేలకు అందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. చర్చల నిమిత్తం పాక్ వెళ్లేందుకు తామెప్పుడూ తిరస్కరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం స్పష్టం చేశారు. -
హార్మూజ్పై బ్రిటన్ సమావేశం
లండన్: అంతర్జాతీయ నౌకాయాన రంగంలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఏకపక్షంగా గుత్తాధిపత్యం సాధించి నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బ్రిటన్ కన్నెర్రజేసింది. ఇరాన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా గళం విప్పేందుకు, దేశాల మధ్య ఐక్యత సాధించేందుకు బ్రిటన్ నడుంబిగించింది. ఇందులోభాగంగా గురువారం ఏకంగా 40కిపైగా దేశాలతో వర్చువల్ భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. భేటీలో బ్రిటన్ విదేశాంగ శాఖ మహిళా కార్యదర్శి యూవెట్టీ కూపర్ ఇరాన్పై నిప్పులు చెరిగారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొనసాగించే దురుద్దేశంతో ఇరాన్ హార్మూజ్ను గుప్పిటపట్టింది. దానిని ఎలాగైనా మనం తెరిపించాల్సిందే. గల్ఫ్ ప్రాంతం గుండా నౌకాయానానికి మార్గం సుగమం చేసేందుకు సమష్టిగా పోరాడేందుకు ఈ భేటీని ఒక వేదికగా మార్చుకుందాం. ఇరాన్పై దౌత్య, రాజకీయ మార్గాల్లో తీవ్రంగా ఒత్తిడి చేసి హార్మూజ్ను తెరిపిద్దాం. లేదంటే పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది’’అని కూపర్ ఆవేదన వ్యక్తంచేశారు. సైనికచర్య ద్వారా హార్మూజ్ను తెరవొచ్చని అమెరికా భావించడం అసంబద్దంగా ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యానించారు. ‘‘హార్మూజ్ ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్ మొదట్నుంచీ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హార్మూజ్ గుండా వాణిజ్యం మొదలుకావాలి’’అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ వ్యాఖ్యానించారు. బిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, కెనడా, జపాన్, యూఏఈ తదితర 40కిపైగా దేశాలు ఈ భేటీలో పాల్గొన్నాయి. -
త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే!
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్పై దాడులకు తెర దించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. రెండు మూడు వారాల్లో పోరుకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతానని మంగళవారం ఆయన ప్రకటించారు. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదనని నమ్మకం కలిగిన వెంటనే దాడులు నిలిపేస్తా. కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిపించే బాధ్యతను అక్కడి నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకే వదిలేస్తానని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. మరోవైపు గల్ఫ్లో అమెరికా సేనల మోహరింపు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 10 వేల మందికి పైగా సైనికులను తరలిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి! యూఎస్ఎస్ జార్జి డబ్ల్యూ బుష్ విమాన వాహక నౌక కూడా మూడు డిస్ట్రాయర్ నౌకలు, 6,000 మంది సెయిలర్లతో గల్ఫ్ బాట పట్టినట్టు పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇరాన్పై భూతల దాడుల నిమిత్తమేనన్న అనుమానాలకు ఊతమిచ్చేలా ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ సైట్లో పోస్టులు చేశారు. ‘‘హార్మూజ్ను తక్షణం తెరవాల్సిందే. లేదంటే బాంబులతో ఇరాన్ను సర్వనాశనం చేస్తాం. దాంతో ఆ దేశం రాతియుగాల కాలానికి వెళ్తుంది’’అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు! ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కాల్పుల విరమణ కోరుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాన్ని కొనసాగించి తీరతామని పునరుద్ఘాటించింది. స్వీయరక్షణ విషయంలో డెడ్లైన్లేవీ ఉండబోవని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘యుద్ధ విరమణ దిశగా పశ్చిమాసియాలో అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్ నుంచి పలు ప్రతిపాదనలు అందడం నిజమే. కానీ అమెరికాతో మా దేశం నేరుగా ఎలాంటి చర్చలూ జరపడం లేదు’’అని స్పష్టం చేశారు. -
యుద్ధంలోకి మమ్మల్ని లాగలేరు
లండన్: ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బుధవారం తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇరాన్కు చైనా ఝలక్?
బీజింగ్: తమ దేశానికి రావాల్సిన మూడు చమురు నౌకలు విజయవంతంగా హార్మూజ్ జలసంధిని దాటాయని చైనా మంగళవారం ప్రకటించింది. హార్మూజ్ను దాటడంలో ఎంతగానో సహకరించిన ఇరాన్ పేరును ప్రస్తావించకుండానే నౌకల సాఫీ ప్రయాణానికి చేయూతనందించిన వారికి ధన్యవాదాలు అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదలచేశారు. పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ గుండా తమ నౌకలు ప్రయాణిస్తున్నాయని చైనా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.మరోవైపు ఇరాన్లో పరిస్థితులపై పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాన్ దార్తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం మంతనాలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సన్నిహిత నేత అయిన వాంగ్ యీ ఇప్పటికే దేశ అధికార కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ బ్యూరోలోనూ సభ్యునిగా ఉన్నారు. క్యూబా చేరుకున్న రష్యా చమురు.. ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత రష్యా ముడిచమురు నౌక క్యూబాకు చేరుకుంది. కొంతకాలంగా రష్యా చమురును కొనుగోలుచేయొద్దంటూ క్యూబాపై అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో క్యూబా చమురుకష్టాలు మొదలయ్యాయి. తాజాగా రష్యా చమురును తాత్కాలికంగా అనుమతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే క్యూబాలోని మటాంజా నౌకాశ్రయానికి రష్యా చమురునౌక ‘అనటోలీ కొలోడ్కిన్’చేరుకుంది.మార్చి 8న రష్యా నుంచి బయల్దేరి ఇంగ్లిష్ ఛానల్ మీదుగా ఈ నౌక ఇటీవల అట్లాంటిక్ సముద్రజలాల్లోకి ప్రవేశించి అమెరికా అనుమతుల కోసం వేచిచూస్తున్న విషయం తెల్సిందే. ఇది ఏకంగా 7,30,000 బ్యారెళ్ల చమురును మోసుకొచ్చింది. నౌక రాకపై క్యూబా ఇంధన, గనుల మంత్రి విసెంటే లేవీ అమితానందం వ్యక్తంచేశారు. ఇన్నాళ్లూ క్యూబా తమ చమురుఅవసరాల కోసం అత్యధికంగా వెనెజువెలాపై ఆధారపడేది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అరెస్ట్చేశాక ఆ దేశం నుంచి చమురురాక దాదాపు ఆగిపోయింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోబోతే అమెరికా అడ్డుకోవడం తెలిసిందే. -
యుద్ధానికి త్వరలో తెర!
వాషింగ్టన్: ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది.‘‘యుద్ధాన్ని నాలుగు నుంచి ఆరు వారాలు మాత్రమే సాగించాలని ముందే నిర్ణయించుకున్నాం. హర్మూజ్ కోసం పట్టుబడితే పోరు మరిన్ని రోజులు కొనసాగేలా ఉంది. కనుక మన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నావికా దళాన్ని, దాని క్షిపణి నిల్వలను పూర్తిగా నేలమట్టం చేసి యుద్ధానికి త్వరగా తెర దించేస్తా’’ అని ట్రంప్ చెప్పుకొచి్చనట్టు పేర్కొంది. మరోవైపు సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు మాత్రం ఇరాన్ పూర్తిగా ఓడేదాకా యుద్ధాన్ని కొనసాగించాల్సిందిగా అమెరికాను కోరుతున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది! నాటో దేశాలపై గుర్రు ఇరాన్పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి. మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
భారత్కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
న్యూఢిల్లీ: ఇరాన్ అనుమతితో హార్మూజ్ జలసంధిని దాటిన రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’, ‘బీడబ్ల్యూ టీవైఆర్’వేగంగా భారత్ దిశగా కదులుతున్నాయి. భారతీయ జెండాతో వస్తున్న ఈ నౌకలు శనివారం హార్మూజ్ను దాటేసి ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’దిశగా ముందుకెళ్తున్నాయని నౌకల ట్రాకింగ్ సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. ‘బీడబ్ల్యూ టీవైఆర్’నౌక మార్చి 31వ తేదీకల్లా ముంబైకి చేరుకునే అవకాశముంది. ‘బీడబ్ల్యూ ఈఎల్ఎం’నౌక ఏప్రిల్ ఒకటో తేదీన న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకునే ఆస్కారముందని భారత ప్రభుత్వ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.ఈ రెండు నౌకలు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ నిల్వలు దేశ ఒక రోజు ఎల్పీజీ అవసరాలను తీరుస్తాయి. ఇప్పటికే నాలుగు భారత ఎల్పీజీ నౌకలు హార్మూజ్ను దాటి సురక్షితంగా ఇండియాకు చేరుకున్నాయి. మార్చి 16–17 తేదీల మధ్య ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు ఉమ్మడిగా 92,712 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. మార్చి 26–28 తేదీల మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు 92,612 టన్నుల ఎల్పీజీని మోసుకొచ్చాయి.భారత 60 శాతం వంటగ్యాస్ అవసరాలను గల్ఫ్ దేశాలు తీరుస్తున్నాయి. గత ఏడాది భారత్లో 3.315 కోట్ల టన్నుల ఎల్పీజీని ప్రజలు వినియోగించారు. హార్మూజ్ గుండా ఇప్పుడు సరకు రవాణా నౌకల రాకపోకలు దాదాపు తగ్గిపోవడంతో భారత అవసరాలను కొంతమేరకు అమెరికా, అర్జెంటీనాలు తీరుస్తున్నాయి. 485 మంది నావికులతో భారతీయ జెండాతో 18 నౌకలు ఇంకా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయని భారత అధికారులు వెల్లడించారు. -
అది ట్రంప్ జలసంధి
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి పేరు, ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు చర్చనీయాంశాలయ్యాయి. దీంతో ఆ జలసంధికి తన పేరు పెట్టుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్చేశారు. ఆదివారం ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీ నగరంలో జరిగిన ఒక పెట్టుబడుల సదస్సులో ట్రంప్ ప్రసంగిస్తూ హార్మూజ్ జలసంధి అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇరాన్ వెంటనే ట్రంప్ జలసంధిని, అంటే హార్మూజ్ను తెరవాలి.దాన్ని పొరపాటున ట్రంప్ జలసంధి అన్నానని మీడియాలో తప్పుడు కథనాలు వెలువడతాయేమో. అదేమీ లేదు. నేను పొరపాటు చేస్తే అది పెద్ద వార్తే అవుతుంది’’ అని అనగానే మీడియా ప్రతినిధులు ఘొల్లున నవ్వారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ‘‘అవును. అధ్యక్షుడు చెబుతున్న ఆ ‘ట్రంప్ జలసంధి’ సరిగ్గా ఎప్స్టీన్ దీవులకు పక్కనే ఉంది’’ అంటూ ఎద్దేవా చేసింది. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో ట్రంప్ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుండటం తెలిసిందే. -
పశ్చిమాసియాలో ఇక భీకర యుద్ధమే.. చర్చలపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రతిష్టంభన... హార్మూజ్పై పట్టు బిగించిన ఇరాన్
-
భారత్ సహా 5 దేశాలకు హార్మూజ్లో గ్రీన్సిగ్నల్
టెహ్రాన్/న్యూఢిల్లీ: వాణిజ్య నౌకాయానానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్ అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ‘మేం స్నేహపూర్వక దేశాలుగా భావించే కొన్ని దేశాలను హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించాం. చైనా, రష్యా, భారత్, ఇరాక్, పాకిస్తాన్లను అనుమతించాం’అని అరాగ్చీ తెలిపారు. ఇరాన్ శత్రు నౌకలను మాత్రం ఈ జలమార్గం గుండా ప్రయాణించడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘మనం యుద్ధంలో ఉన్నాం. ఈ ప్రాంతం కూడా ఒక యుద్ధ క్షేత్రం. మన శత్రువులు, వారి మిత్రుల నౌకలను దీని గుండా వెళ్ళడానికి అనుమతించాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకోసం ఇది తెరిచే ఉంటుంది’అని ఆయన పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన నౌకా మార్గం హార్మూజ్ జలసంధి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు)లో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దాదాపు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దేశ ఇంధన కొనుగోళ్లకు పశ్చిమ ఆసియా ఒక ప్రధాన వనరుగా ఉంది. ఈ నౌకాయాన మార్గంపై దిగ్బంధనం కొనసాగితే, దేశంతో సహా అనేక దేశాల ఇంధన, ఎరువుల భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని భావించింది. దీంతో జలసంధి గుండా ఇంధన ప్రవాహం నిరాటంకంగా సాగేలా చూడటంపై దృష్టి సారించిన భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. -
ఇక భీకర యుద్ధమే!
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరుపక్షాలు తమ వైఖరి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. హార్మూజ్పై ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. జలసంధి గుండా ప్రయాణించే విదేశీ నౌకల నుంచి దారి సుంకం(టోల్ ఫీజు) వసూలు చేస్తోంది. కనీసం రెండు నౌకలు చైనా కరెన్సీ యువాన్లలో ఇరాన్కు చెల్లింపులు చేసినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. పార్లమెంట్లో ఆమోదం పొంది టోల్ వసూలును అధికారం చేయబోతున్నట్లు సమాచారం. నౌకలు క్షేమంగా జలసంధిని దాటాలంటే రుసుము చెల్లించక తప్పదని ఇరాన్ అధికారులు అంటున్నారు. హార్మూజ్లో ఇరాన్ టోల్ బూత్ తెరిచినట్లు ఆరు గల్ఫ్ అరబ్ దేశాల కూటమి అయిన గల్ఫ్ సహకార మండలి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అల్–బుదైవీ నిర్ధారించారు. నౌకల నుంచి టోల్ వసూలు చేస్తే హార్మూజ్ నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గల్ఫ్లో క్షిపణుల మోత మరోవైపు యుద్ధం గురువారం 27వ రోజుకు చేరుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్సైతం ప్రతీకార దాడులు కొనసాగించింది. ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలే లక్ష్యంగా మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ సైనిక స్థావరాలకు కేంద్రమైన ఇస్పహాన్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) నేవీ చీఫ్ అలీ రెజా తంగ్సిరి అంతమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చిచెప్పారు. యుద్ధంలో ఉమ్మడి లక్ష్య సాధన విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సమన్వయానికి ఈ ఆపరేషన్ మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోనూ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. ఇజ్రాయెల్లోని నహరియా ఏరియాలో ఇరాన్ దాడుల్లో ఒకరు మరణించినట్లు తెలిసింది. మరో ఏడుగురు గాయపడినట్లు సమాచారం. ఇరాన్లోనూ మృతుల సంఖ్య పెరుగుతోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటిదాకా 1,900 మందికిపైగా మరణించినట్లు ఇరాన్ మంత్రి అలీ జఫారియన్ చెప్పారు. ఇజ్రాయెల్లో 18 మంది, లెబనాన్లో ముగ్గురు ఇజ్రాయెల్ జవాన్లు, 1,100 మంది సాధారణ ప్రజలు, గల్ఫ్ దేశాల్లో 13 మంది అమెరికా సైనికులు మృతిచెందారు. లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్లను ఖతం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని అక్కడికి తరలిస్తోంది. భారతీయుడు సహా ఇద్దరి బలి అబూదాబీపై ఇరాన్ భారీగా క్షిపణులు ప్రయోగించింది. యూఈఏ గగనతల వ్యవస్థ వాటిని గాల్లోనే నిర్వీర్యం చేసే క్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్షిపణుల శకలాలు నేలకూలి మంటలు చెలరేగడంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు మరణించారు. మరో భారతీయు డు సహా ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందిన రెండో వ్యక్తిని పాకిస్తాన్ జాతీయుడిగా గుర్తించారు. పశ్చిమాసియా యుద్ధంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. 169 మంది గాయపడ్డారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు అబూ దాబీ రక్షణ శాఖ ప్రకటించింది. ఇరాన్లో 10 వేల టార్గెట్లపై దాడులు ఇరాన్లో ఇప్పటిదాకా 10 వేలకుపైగా టార్గెట్లపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఇజ్రాయెల్తో కలిసి మరిన్ని లక్ష్యాలపై గురి పెడతామని అన్నారు. కచ్చితత్వంతో కూడిన దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థపై పైచేయి సాధిస్తున్నామని చెప్పారు. ఇరాన్ నావికాదళంలో 92 శాతం భారీ నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా తమ సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. యూఎస్ఎస్ ట్రిపోలి సహా పలు నౌకలు పశ్చిమాసియా సమీపానికి చేరుకుంటున్నాయి. వీటిలో 2,500 మంది జవాన్లు ఉన్నారు. అలాగే 1,000 మంది పారాట్రూపర్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. సంధానకర్తగా పని చేస్తున్నాం: పాక్ పశ్చిమాసియాలో సంక్షోభ పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ చెప్పారు. యుద్ధానికి తెరదించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ మధ్య తాము సంధానకర్తగా పని చేస్తున్నట్లు గురువారం తెలిపారు. ఒక దేశం సందేశాన్ని మరో దేశానికి చేరవేస్తున్నామని పేర్కొన్నారు. శాంతి సాధన విషయంలో తుర్కియే, ఈజిప్టు కూడా తమకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.అంచెలంచెలుగా ఉన్నతస్థాయికిఅలీ రెజా తంగ్సిరి మృతితో ఇరాన్కు భారీ నష్టం జెరూసలేం: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత శక్తివంతమైన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నావికాదళం చీఫ్ అలీ రెజా తంగ్సిరి మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్లోని తీరప్రాంత నగరమైన బందర్ అబ్బాస్లో వైమానిక దాడుల్లో తంగ్సిరితోపాటు ఐఆర్జీసీకి చెందిన ఇతర సీనియర్ నావల్ కమాండర్లు కూడా హతమైనట్లు తెలిపారు. అయితే, దీనిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. హార్మూజ్ జలసంధి మూసివేతను తంగ్సిరి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాంటి కీలక అధికారి మృతిచెందడం ఇరాన్కు భారీ నష్టంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తంగ్సిరి దక్షిణ ఇరాన్లోని బుషెహర్ ప్రావిన్స్లో 1962లో జన్మింంచారు. 1980వ దశకంలో ఇరాన్–ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇరాన్ సైన్యంలో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. 2010 నుంచి 2018 దాకా ఐఆర్జీసీ నేవీ డిప్యూటీ కమాండర్గా పనిచేశారు. అనంతరం ఈ దళం అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అక్కడ విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. ఇదంతా తంగ్సిరి నేతృత్వంలోనే జరిగింది. ఇజ్రాయెలీలు యూదులని, అమెరికన్లు క్రైస్తవులని, వారు తమకు మిత్రులు కాదని మత గ్రంథం ఖురాన్ బోధిస్తోందని ఒక సందర్భంలో తంగ్సిరి వ్యాఖ్యానించారు. యుద్ధంలో ఇరాన్ కీలక నేతలు, అధికారులు ఒక్కొక్కరుగా మరణిస్తుండడం ఆ దేశానికి నష్టదాయకంగా పరిణమించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఐఆర్జీసీ అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ తదితరులు మృతిచెందిన సంగతి తెలిసిందే. తంగ్సిరి చేతులకు చాలా రక్తం అంటింది: నెతన్యాహు అలీ రెజా తంగ్సిరి మృతిని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ధ్రువీకరించారు. ఈ మేరకు వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. బుధవారం రాత్రి ఐఆర్జీసీ నేవీ కమాండర్ తంగ్సిరిని అంతం చేసినట్లు తెలిపారు. అతడి చేతులకు చాలా రక్తం అంటిందని, హార్మూజ్ జలసంధిని మూసివేయడానికి నాయకత్వం వహించింది కూడా అతడేనని తేల్చిచెప్పారు. ఇరాన్ నేతలు, అధికారులే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇరాన్ ఉగ్రవాద పాలనపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒప్పందం కోసం ఇరాన్ బతిమాలుతోంది: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్ రెండో మాటకు తావులేకుండా తిరస్కరించింది. దీనిపై ట్రంప్ గురువారం స్పందించారు. ఒప్పందం కోసం ఇరాన్ తమను బతిమాలుతోందని అన్నారు. చర్చల కోసం తాను ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై జరిగే చర్చలను సీరియస్గా తీసుకోవాలని టెహ్రాన్కు సూచించారు. ఇరాన్ ఒక బహుమతి ఇచ్చిందని ట్రంప్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ బహుమతి ఏమిటన్నది ఇప్పుడు బయటపెట్టారు. 10 చమురు నౌకలు హార్మూజ్ గుండా వెళ్లడానికి ఇరాన్ అనుమతి ఇచ్చిందని చెప్పారు. చర్చల విషయంలో ఇదొక సానుకూల ముందడుగు అని అభివరి్ణంచారు. అనుమతి పొందిన నౌకలు పాకిస్తాన్కు చెందినవిగా ట్రంప్ సంకేతాలిచ్చారు. తదుపరి సుప్రీంలీడర్గా ఉండాలంటూ ఇరాన్ తనను వేడుకుందని, అందుకు తిరస్కరించానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ పదవి తనకు ఇష్టం లేదన్నారు. -
ఫుల్లుగా పెట్రోల్.. అయినా ఉరుకులాటెందుకు?
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు ఎగబడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిజానికి వాహనదారులు పెట్రోలు బంకుల వద్దకు అంత భారీగా వెళ్తూ ఫుల్ ట్యాంకు నింపించుకుంటున్నారు కాబట్టి కొన్ని బంకుల్లో పెట్రోల్ అయిపోతుంది. దీంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. లేని ప్రమాదాన్ని ఊహించుకుని ఆందోళన చెందుతున్నట్లు ఉంది వాహనదారుల తీరు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల భారత్లోని పలు నగరాల్లో ప్రజల్లో భయం, ఆందోళన పెరిగాయి. ఏ అనుకోని పరిస్థితి వస్తుందోనన్న భయంతో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.ప్రభుత్వ వివరణ ఇదే..ఇరాన్ యుద్ధం వేళ క్రూడాయిల్ సరఫరా కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ఆ లోటు పూర్తిగా భర్తీ అయింది. హార్మూజ్ జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితి ఉన్నా, భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 41కి పైగా సరఫరాదారుల నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటోంది. ఇంతకు ముందు హార్మూజ్ జలసంధి ద్వారా వచ్చిన దానికంటే ఎక్కువ క్రూడాయిల్ను భారత్ పొందుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో (ముఖ్యంగా పశ్చిమ గోళార్థంలోని దేశాల్లో) క్రూడాయిల్ పెద్ద మొత్తంలో ఉంది. ఇతర ప్రాంతాలనుంచి సరఫరా జరగకపోతే వేరే మార్కెట్ల నుంచి క్రూడాయిల్ను దిగుమతి చేసుకోవచ్చు. ప్రతి భారత రిఫైనరీ 100% కంటే ఎక్కువ వినియోగంతో నడుస్తోంది. భారత ఆయిల్ కంపెనీలు వచ్చే 60 రోజుల దేశ అవసరాలకు సరిపడే క్రూడాయిల్ సరఫరాల కోసం ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. కాబట్టి దేశంలో లోటు ఉండే ప్రమాదం లేదు. సరఫరాలో ఎలాంటి లోటు లేదు.ఈ రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇదే..పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు ఎంతగా చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు, పలు నగరాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు భయంతో వెళ్తున్నారు. ఇంధన లోటు ఉందేమోనన్న భయంతో ప్రజలు పొడవాటి క్యూల్లో నిలబడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. -
ఇరాన్ను కోలుకోలేని దెబ్బకొట్టిన ఇజ్రాయెల్!
టెహ్రాన్: ఇరాన్లోని బందర్ అబ్బాస్లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు గురువారం జెరూసలేం పోస్ట్ మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ దాడి జరిగింది.హార్మూజ్ జలసంధికి సమీపంలో బందర్ అబ్బాస్ ఉంది. ప్రపంచ వాణిజ్య చమురు, సహజ వాయువు సుమారు 20 శాతం హార్మూజ్ గుండా సాగుతుంది. ఈ జలసంధి మూసివేతకు బాధ్యుడిగా అలీరెజాను పేర్కొంటారు. అతడి మరణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో కీలక పరిణామం. ఎందుకంటే ఐఆర్జీసీ నౌకాదళానిదే ఇరాన్ సముద్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసేది కూడా ఐఆర్జీసీ నౌకాదళమే.హార్మూజ్పై పట్టును మరింత సాధిస్తున్న వేళ ప్రస్తుతం హార్మూజ్ జలసంధిపై పట్టును మరింత పెంచుకుంటోంది ఇరాన్. కాల్పుల విరమణ ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ “డీ ఫాక్టో టోల్ బూత్ విధానం” (అధికారిక ప్రకటన లేకుండా అమలులో ఉన్న ఫీజు వ్యవస్థ) అమలు చేస్తోందని నిపుణులు చెప్పారు. ఈ విధానంలో కొన్ని నౌకలు తమ సరుకు వివరాలు, సిబ్బంది సమాచారం, గమ్యస్థానం వివరాలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు అందించాలి. లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ (నౌకాయాన విశ్లేషణ సంస్థ) కూడా ఇదే విధానాన్ని ప్రస్తావిస్తూ, కనీసం రెండు నౌకలు జలసంధి గుండా వెళ్లేందుకు చైనా యువాన్లో ఫీజులు చెల్లించాయని తెలిపింది. ఈ ఫీజు వసూలు వ్యవస్థను అధికారికం చేయడానికి తమ పార్లమెంట్ ప్రయత్నిస్తోందని ఇరాన్ నేత ఒకరు అన్నారు. “మేమే భద్రత కల్పిస్తున్నాం, నౌకలు, చమురు ట్యాంకర్లు ఈ ఫీజులు చెల్లించడం సహజమే” అని చెప్పారు.ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ప్రపంచ ఇంధన మార్కెట్లలో భయాలను పెంచింది. బ్రెంట్ క్రూడ్ (అంతర్జాతీయ చమురు ధర సూచిక) ధర గురువారం 104 డాలర్ల వద్ద ఉంది, ఘర్షణ ప్రారంభం నుంచి 40 శాతం పైగా పెరిగింది. -
హోర్మూజ్ తరువాత : ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడుల మధ్య పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ఇరాన్ తాజాగా మరో సంచలన హెచ్చరిక జారీ చేసింది. తన ద్వీపాలపై దాడులు జరిగిగే మరో జలసంధిని కూడా తన ఆధీనంలోకి తీసుకుంటామని తాజాగా ప్రకటించింది. ఇరాన్ గనుక కాల్పుల విరమణ షరతులకు అంగీకరించకపోతే, సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ తాజా హెచ్చరిక జారీ చేసింది. శత్రువు పీచమణచాలంటే.. బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టుఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ దక్షిణ ద్వీపాలపై భూతల దాడులు జరిగితే, యెమెన్కు చెందిన సాయుధ రాజకీయ, మత సమూహమైన అన్సరుల్లా (హౌతీలు) బాబ్ అల్-మండబ్ (Bab al-Mandab)జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ హెచ్చరించింది.దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ ప్రతిఘటనా (Resistance) విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నమ్మకమైన హామీలు లేకుండా చర్చలకు లేదా కాల్పుల విరమణకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఇరాన్ భూభాగంలోకి చొరబడి దాడులు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) హెచ్చరించింది. ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్పై దాడితో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అన్సరుల్లా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, శత్రువును దారికి తీసుకురావడానికి ఈ కీలక సముద్ర మార్గాన్ని మూసివేయడానికి వారు సిద్ధంగా ఉన్నారని ఇరాన్ మీడియా సంస్థ 'తస్నిమ్' పేర్కొంది.శత్రువుకు మరింత గుణపాఠం నేర్పడానికి ఈ జలసంధిని నియంత్రించడం అవసరమని భావిస్తోంది. ఈ జలమార్గంలో "విశ్వసనీయమైన ముప్పు"ను సృష్టించే సామర్థ్యం ఇరాన్కు ఉండటమే కాకుండా, అన్సరుల్లా "వీరోచిత శక్తులు" కూడా "నైపుణ్యంతో కూడిన పాత్ర పోషించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి" అని తస్నిమ్ తెలిపింది.ఇదీ చదవండి: కోట్లాది మందికి గుడ్ న్యూస్ : భారీగా చమురు కొనుగోలుకాగా ఇప్పటికే ఇజ్రాయెల్కు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే నౌకలపై హుతీలు దాడులు చేస్తూ ఆర్థికంగా ఇజ్రాయెల్ను దెబ్బతీస్తున్నారు. దీనివల్ల నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. నౌకలపైనే కాకుండా, అమెరికా యుద్ధ నౌకల పైన మరియు ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాల పైన హుతీలు వైమానిక దాడులు చేస్తున్నారు.రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్య ఉన్న బాబ్ అల్-మండబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం.ఇదీ చదవండి: రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్ ట్రిప్స్, బెంజ్కారు! -
భారత్ కోసం హార్మూజ్ తెరుస్తాం: ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్ విషయంలో భారత్, మరో నాలుగు దేశాలకు ఇరాన్ భారీ ఊరటను ఇచ్చింది. ఈ ఐదు దేశాల కోసం హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్టు తాజాగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘి చెప్పుకొచ్చారు. దీంతో, ఆయా దేశాలకు చమురు ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. ఈ సందర్బంగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధిలో భారత్తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించారు. భారత్తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్లకు చెందిన నౌకలకు కూడా జలమార్గం గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇరాన్ మీడియాతో అబ్బాస్ మాట్లాడుతూ.. చాలా దేశాలు హార్మూజ్ విషయంలో మమ్మల్ని సంప్రదించి, జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వాలని అభ్యర్థించారు. మేము మిత్రదేశాలుగా భావించే కొన్ని దేశాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. వీరికి మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి. భవిష్యత్తులో కూడా, యుద్ధం తర్వాత కూడా ఆయా దేశాల నౌకల ప్రయాణాలు కొనసాగుతాయి’ అని ఆయన తెలిపారు. #Iran FM Abbas #Araghchi: We permitted passage through the Strait of #Hormuz for friendly nations including China, Russia, India, Iraq, and Pakistan. pic.twitter.com/RvLtiwYB4v— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 25, 2026ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సు లేట్ జనరల్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో, హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్ నౌకలు సరకులతో ఉండటం అవి స్వదేశం చేరేందుకు మార్గం సులువైంది. ఇప్పటికే ఐదు గ్యాస్ ట్యాంకర్లు హార్మూజ్ వద్ద అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. ఇరాన్ నిర్ణయంతో వీటి ప్రయాణంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్లోని గమ్యస్థానాలకు చేరవచ్చు. అయితే, ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పిన దేశాల నౌకలు మాత్రమే హార్మూజ్లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఇరాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
పాకిస్థాన్కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పాక్ కు ఇరాన్ షాక్.. హర్ముజ్ లో నౌక అడ్డగింత
-
ఇరాన్పై యుద్ధం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఒక ‘రహస్య బహుమతి’ అందిందని ఆయన ప్రకటించారు. వైట్ హౌస్లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘వారు మాకు ఒక బహుమతి ఇచ్చారు. అది చాలా పెద్దది. దాని విలువ అపారం. ఇది అణు సంబంధమైనది కాదు. చమురు, గ్యాస్కు సంబంధించినది. వారు చేసిన పని చాలా మంచిది’ అని పేర్కొన్నారు. అయితే, ఆ బహుమతి ఏమిటన్నది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై కొత్త చర్చలకు దారితీసాయి. చమురు సరఫరా, సముద్ర మార్గ భద్రత లేదా ఇతర వ్యూహాత్మక అంశాలకు సంబంధించినదా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.ట్రంప్ మరోసారి అమెరికాదే పైచేయి అని పునరుద్ఘాటించారు. అదే సమయంలో యుద్ధం త్వరగా ముగియడం పట్ల రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ నిరాశ చెందారని తెలిపారు. అమెరికా అధికారులు టెహ్రాన్లోని కీలక వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇరాన్ నాయకులు యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.హర్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇరాన్ తరచుగా ఈ మార్గాన్ని మూసివేస్తానని హెచ్చరించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.గత కొన్ని వారాలుగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా ఇప్పటికే హర్మూజ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించింది. మిత్రదేశాలను కూడా యుద్ధ నౌకలు పంపమని కోరింది. అయితే, చాలా దేశాలు దీనికి నిరాకరించాయి.ట్రంప్ చెప్పిన ‘రహస్య బహుమతి’ అసలు ఏమిటన్నది స్పష్టత లేకపోయినా, ఇది అమెరికా–ఇరాన్ సంబంధాల్లో తాత్కాలిక సర్దుబాటు సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు, భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
హార్మూజ్ జలసంధిని తెరవాల్సిందే
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు త్వరగా సమసిపోవాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. మోదీతో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రధానంగా హార్మూజ్ జలసంధి విషయంలో తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుగా హార్మూజ్ను తక్షణమే తెరవాలని మోదీ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.ట్రంప్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, పశ్చిమాసియా పరిస్థితులపై ఉపయోగకరమైన అభిప్రాయాలు పంచుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచి, అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం దిశగా చేపట్టే ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించాలని తాము నిర్ణయించామని స్పష్టంచేశారు. కీలకమైన షిప్పింగ్ మార్గాన్ని తెరిచి ఉంచాల్సిన ప్రాముఖ్యతపై నేతలు చర్చించారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. -
హర్మూజ్ ప్రయాణంపై భారత్ కీలక వ్యాఖ్యలు: భారత్
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అది అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని తెలిపారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే ఈ అంశాలపై భారత ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు.హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. భద్రత, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే షిప్పింగ్ కంపెనీలు, వాటి కాంట్రాక్టు సంస్థలు ఈ జలసంధి గుండా ప్రయాణం చేస్తాయని ఆయన తెలిపారు. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందాల పరిధిలోకి వస్తుంది. దీని గుండా నౌకాయానానికి స్వేచ్ఛ ఉంది. ఆ జలసంధి ఇరుకుగా ఉన్నందున, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మాత్రమే గుర్తించారు, వాటిని నౌకా రవాణా సంస్థలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా జలసంధి గుండా ప్రయాణించాలనే నిర్ణయం షిప్పింగ్ కంపెనీకి, ఓడను అద్దెకు తీసుకున్న కంపెనీకి మధ్య ఉంటుంది. ఎప్పుడు ప్రయాణించాలి, ఎప్పుడు ప్రయాణించకూడదు అనేది వారి నిర్ణయం అని తెలిపారు. అయితే ప్రస్తుతం యుద్ధం నడుస్తున్నందున వారు నిర్ణయం తీసుకునే ముందు భద్రత మొదలైన వాటికి సంబంధించి పరిస్థితిని అంచనా వేస్తారు. అంతేగాని హార్మూజ్ గుండా ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని ఆయన తెలిపారు. కాగా నిన్న (సోమవారం) మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని దాటాయి. ఇవి ఈ నెల 26 లేదా 27 తేదీలలో భారత్ను చేరుకుంటాయి. వీటివల్ల దేశానికి దాదాపు ఒక రోజు వంటగ్యాస్ సరఫరా చేయవచ్చు. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!
-
హార్ముజ్ దాటేందుకు యత్నించిన షిప్పును స్వాధీనం చేసుకున్న ఇరాన్
-
ట్రంప్ 48 గంటల డెడ్లైన్ : ఏం జరగబోతోంది?
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతిదారులు నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థిలా ఆందోళన కరంగా పరిణమిస్తోంది. సముద్ర మార్గ ఇంధన వాణిజ్యం కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవాలంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.14 గంటలకు ముగుస్తుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇరాన్ను కోరారు. అటు తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే ఆ జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీమరోవైపు ట్రంప్ 48 గంటల గడుపు, చమురు కేంద్రాలపై దాడులు హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ తమ తీరాలపై లేదా ద్వీపాలపై ఏ దాడి జరిగినా, తీరం నుండి తేలియాడే మందుపాతరలతో సహా అన్ని గల్ఫ్ ప్రవేశ మార్గాల్లో నావికా మందు పాతరలను మోహరిస్తామని ఉన్నత స్థాయి భద్రతా సంస్థ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ఈ దేశాల మధ్య శాంతి సంధి, కాల్పుల విరమణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రపంచ ఇంధన మార్కెట్కు ధరల పరంగా మరిన్ని షాక్లు తగిలే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా మరింత సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 110 డాలర్ల వద్ద ఉంది.ఇండియా పరిస్థితిఒకవేళ టెహ్రాన్, యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో 50 శాతంతోనైనా ట్యాంకర్లను హోర్ముజ్ గుండా అనుమతిస్తే, కోట్లాది భారతీయ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, కోట్లాది మంది పేదలకు ఊరట లభించినట్టే. ఇది ఇంధన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలలో జరగబోయే అత్యంత కీలకమైన ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి కూడా ఇది ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించినట్టవుతుంది. ట్రంప్ హెచ్చరికను ఇరాన్ లక్ష్య పెట్టకపోతే, వివిధ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేసి, వాటిని పూర్తిగా నాశనం చేస్తాను, మొదటగా అతిపెద్ద ప్లాంట్తో ప్రారంభిస్తాను అన్న ట్రంప్ అదే పాటిస్తే యుద్ధం మరింత ముదిరి హోర్ముజ్ గుండా రవాణా అయ్యే చమురు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచి పోవచ్చు. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ముఖ్యంగా ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు నాశనమవుతాయి.మరోవైపు శత్రువులు కాని దేశాలకు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇందుకోసం టెహ్రాన్తో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ రక్షణ మండలి ఆదేశించినట్లు బీబీసీ నివేదించింది. హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో 22 దేశాలు చేరాయినార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానాన్ని నిర్ధారించేందుకు కనీసం 22 దేశాలు అంగీకారానికి వచ్చాయి. నాటో సైనిక కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వెల్లడించిన ప్రకారం, నాటో సభ్య దేశాలతో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల వంటి భాగస్వామ్య దేశాలతో సహా 22 దేశాలు ఈ ఇరుకైన జలమార్గంలో నౌకాయాన స్వేచ్ఛనునిర్ధారించడానికి తమ చర్యలను సన్నిహితంగా సమన్వయం చేసుకోవడానికి అంగీకరించాయి. యుద్ధం ముగింపు గురించి మాట్లాడిన 24 గంటలలోపే ట్రంప్ ఈ బెదిరింపునకు పాల్పడటం, ఇరాన్ వైఖరితో ఈ యుద్ధం నుండి బయటపడే మార్గం లేదని భౌగోళిక రాజకీయ సైనిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ నిర్ణయంపై ప్రపంచమంతా గగ్గోలు
టెహ్రాన్/న్యూఢిల్లీ: ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ‘హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) ఇప్పుడు ఇరాన్ ‘దందా’కు అడ్డాగా మారింది. యుద్ధం కారణంగా మూతపడిన ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒక్కో సరుకు రవాణా నౌక నుంచి ఇరాన్ ఏకంగా 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18,76,57,000) వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు స్వయంగా వెల్లడించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. యుద్ధ ఖర్చుల కోసమే ఈ ‘ఫీజు’ఇజ్రాయెల్, అమెరికా కూటమితో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ తన అధికారాన్ని చాటుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘యుద్ధం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించాం’ అని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలద్దీన్ బ్రౌజెర్డి స్పష్టం చేశారు. ఇది ఇరాన్ శక్తికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బమార్చి మొదటి వారం నుండి హర్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే 20 శాతం చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఈ జలమార్గం గుండానే వెళ్లాలి. రవాణా నిలిచిపోవడంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నడుమ ఉన్న ఇరాన్కు ఇలా కోట్లలో నగదు చెల్లించడం షిప్పింగ్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది.ట్రంప్ అల్టిమేటం.. ఇరాన్ ప్రతిసవాల్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లోగా జలసంధిని పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తమపై దాడులు జరిగితే మధ్యప్రాచ్యంలోని కీలక ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని, జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది.భారత నౌకలకు ఊరటఅయితే ఇరాన్ తన శత్రు దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటామని చెబుతోంది. ఇప్పటికే భారత్కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. పాకిస్తాన్ ఆయిల్ ట్యాంకర్ కూడా సురక్షితంగా ప్రయాణించింది. కానీ, గడిచిన కొద్ది రోజుల్లో జరిగిన దాడుల్లో ఒక భారతీయ నావికుడు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!
టెహ్రాన్: హర్మూజ్ జలసంధిని తెరవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఇరాన్ కొన్ని నౌకల నుండి భారీ రవాణా రుసుములు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్,డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు నౌకలు జలసంధి గుండా ఉచితంగా ప్రయాణించే హక్కు ఉంది. కానీ తాజా పరిణామాల ప్రకారం, రానున్న రోజుల్లో ఈ స్వేచ్ఛా ప్రయాణం సాధ్యం కాకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇరాన్ ప్రభుత్వం హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.8 కోట్లు) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ భారీ సుంకం ఇప్పటికే అమలు చేయబడిందని, ఇది ఆ కీలక జలమార్గాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న కొత్త విధానానికి నిదర్శనమని పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్ది తెలిపారు.కొత్త సుప్రీం లీడర్ చర్యలుబరూజెర్ది ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇతర దేశాల జోక్యం లేకుండా పాలన సాగించేలా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.రవాణా రుసుము ఉద్దేశ్యం“జలసంధిని దాటే కొన్ని నౌకల నుండి రవాణా రుసుముగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఇరాన్ పట్టు సాధించే ప్రయత్నం కనబడుతోంది. యుద్ధానికి ఖర్చులు ఉంటాయి కాబట్టి సహజంగానే మనం హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుండి రవాణా రుసుములు వసూలు చేయాలి’అని బరూజెర్ది వ్యాఖ్యానించారు.ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20శాతం హర్మూజ్ జలసంధి గుండా జరుగుతుంది.ఇది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మధ్య ఉన్న సన్నని మార్గం. గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్) నుంచి చమురు నౌకలు ఈ మార్గం గుండా ప్రపంచ దేశాలకు చేరతాయి. ఇప్పుడీ మార్గం ద్వారా వెళ్లే కొన్ని నౌకల నుంచి రవాణ రుసుము వసూలు చేయడం వల్ల సంబంధిత దేశాల్లో పెట్రోల్,డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వాణిజ్య వ్యయం అధికమవుతుంది. ప్రపంచ మార్కెట్లలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. -
జపాన్ డేంజర్ బెల్: సముద్రంలో యుద్ధానికి సిద్ధం?
టోక్యో: ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో సముద్ర మార్గంలో నౌకా దళ మైన్లు (Naval Mines) జపాన్కు ఆటంకం కలిగిస్తున్నాయి. వాటిని తొలగించేందుకు ఆ దేశం సిద్ధమవుతోంది. తమ దేశ మనుగడకు అత్యవసరమైన చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్)ను రంగంలోకి దించే అంశాన్ని జపాన్ పరిశీలిస్తోంది.ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుజపాన్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, జపాన్ తన అత్యవసర నిల్వల నుంచి చమురును వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థకు జీవన్మరణ సమస్యగా మారింది.నిబంధనలు ఏం చెబుతున్నాయి?జపాన్ రాజ్యాంగం ప్రకారం విదేశాల్లో సైనిక బలగాలను మోహరించడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే, 2015లో తీసుకువచ్చిన భద్రతా చట్టాల ప్రకారం.. దేశ మనుగడకు ముప్పు వాటిల్లితే లేదా సన్నిహిత భాగస్వామ్య దేశాల భద్రత దెబ్బతింటే సైన్యాన్ని పంపే వెసులుబాటు ఉంది. ఫుజి టీవీ కార్యక్రమంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి.. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఒత్తిడి ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనే తకైచితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జలసంధిని పునరుద్ధరించేందుకు మిత్రదేశాల సహకారం అవసరమని ట్రంప్ కోరారు. మరోవైపు జపాన్ నౌకల రాకపోకల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం పూర్తిగా ముగిసి, పరిస్థితులు శాంతించిన తర్వాతే మైన్లను తొలగించే ఆపరేషన్పై జపాన్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: రైలు రంగుల్లో ‘ప్రాణ రక్షణ’.. ఇది తెలిస్తే జ్ఞానం రెండింతలు! -
ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం: ట్రంప్
-
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు గుడ్న్యూస్!
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాల్లో అధికంగా లభించే సహజ వనరులు అయిన ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్)తో పాటు ఇతర ఇంధన వనరుల నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లొచ్చని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటన చేస్తూ.. ‘ఇరాన్ 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలి. లేదంటే ఇరాన్ అణు కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తాం. పెద్ద దానితో మొదలు పెట్టి గట్టిగా ముగిస్తాం” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారితీశాయి.ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి స్పందించారు.‘ఇరాన్ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప మిగతా అన్ని నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. మేము సముద్ర భద్రతను మెరుగుపరచడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈ ప్రకటనతో ఇరాన్ ప్రత్యక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమైంది.ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్ ప్రాంతంలో అధికంగా లభించే ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్) వంటి ఇంధన వనరుల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది.ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధి తెరవబడటం వల్ల చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు కొంతవరకు తగ్గాయి. ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామం ఇతర దేశాలకు శుభపరిణామంగా భావించబడుతోంది, ఎందుకంటే ఇంధన సరఫరా కొనసాగడం వారి ఆర్థిక వ్యవస్థలకు ఊరటనిస్తుంది. -
అమెరికాకు బలం తోడైంది?..ఇరాన్పై దాడికి సిద్ధమైన మరో దేశం!
టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు బలం తోడైంది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుకు యూకే కదిలి వచ్చింది. ప్రమాదకరమైన ఆయుధ సంపత్తితో యూకే యుద్ధనౌక హర్మూజ్ జలసంధిలో వాలిపోయింది. ఈ క్రమంలో న్యూక్లియర్ పవర్డ్ బ్రిటిష్ సబ్మెరైన్ ‘హెచ్ఎంఎస్ ఆన్సన్’హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. ఇది ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పిడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇరాన్పై సైనిక చర్యలను తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తున్న తరుణంలో యూకే సబ్ మెరైన్ హర్మూజ్ జలసంధిలో మోహరించడం విశేషం. తాజా పరిణామంతో ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు మరింత బలం చేకూరినట్లువుతుంది. ఈ నౌక మార్చి 6న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి బయల్దేరిన యూకే సబ్మెరైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉత్తర అరేబియా సముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉండదనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అధునాతన ఆయుధాలతో కూడిన హెచ్ఎంఎస్ ఆన్సన్ నౌకలో 1,600 కిలోమీటర్ల పరిధి గల ‘టోమాహాక్ బ్లాక్ ఐవీ భూతల దాడి క్షిపణులు’, స్పియర్ఫిష్ హెవీవెయిట్ టార్పెడోలు’ అమర్చబడి ఉన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద పహారా కాస్తున్న ఇరాన్ యుద్ధనౌకలు దాడికి తెగబడితే.. వాటిని అరికట్టేందుకు ఇరాన్ మోహరించిన క్షిపణి స్థావరాలపై శక్తివంతమైన దాడులు చేసేందుకు వీలు కలగనున్నాయి. సీఎన్ఎన్ ప్రకారం.. హర్మూజ్ జలసంధిలోని నౌకలపై జరిగే దాడులతో సంబంధం ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ యూకే సబ్మెరైన్ ఉపయోగపడనుంది. ఇరాన్పై యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్కు మిత్రదేశాలు బలం చేకూరుస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీతో పాటు మరో ఆరు దేశాలు హర్మూజ్ జలసంధిలో భద్రత కోసం ముందుకు వచ్చాయి. -
యుద్ధం వేళ కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర సర్కారు
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు.. -
ఇరాన్కు ట్రంప్ 48 గంటల డెడ్లైన్.. లేకపోతే ?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరిచి వాణిజ్య రవాణాకు ఎటువంటి అవాంతరాయం కలగకుండా చూడాలన్నారు. లేకపోతే యుఎస్ఏ సంయుక్త రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడి చేస్తాయని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు కాదు కదా మరింత పెరుగుతున్నాయి. నిన్న( శనివారం) ఇరాన్ తన ప్రాంతానికి 4వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్సియా దీవిలోని అమెరికా స్థావరంపై దాడి చేసి అందరిని షాక్కు గురిచేసింది. దీంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. " 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే అమెరికా ఆ దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లపై దాడికి తెగబడుతుంది. వాటిలో అతిపెద్దదానిపై మెుదటగా దాడి చేస్తుంది". అని తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు.అయితే నిన్న ట్రంప్ యుద్ధంపై భిన్నంగా స్పందించారు. అమెరికా యుద్ధం విషయంలో ఇదివరకే తన లక్షాలను చేరుకుందని కనుక సైనిక చర్యను తగ్గించే విషయంలో ఆలోచిస్తున్నామన్నారు. కాగా ఈ రోజు మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. -
ఇరాన్తో యుద్ధం.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు.వైట్హౌస్ నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదు. ఆ మార్గం ద్వారా ప్రయోజనం పొందే దేశాలు కొంతైనా చొరవ చూపాలి. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలి. మాకు హార్ముజ్ జలసంధితో పనిలేదు లేదు. కానీ యూరప్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఇది చాలా అవసరం. చైనా తన ఇంధన అవసరాల్లో 90 శాతం, జపాన్ 95 శాతం ఈ మార్గం ద్వారానే లబ్ధి పొందుతున్నాయి. ఆ దేశాలే కొంచెం శ్రమించి, ఈ మార్గం రక్షణలో భాగం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.#WATCH | On the US-Israel vs Iran conflict, US President Donald Trump says, "We can have dialogue, but I don't want to do a ceasefire. You don't do a ceasefire when you're literally obliterating the other side... we're not looking to do that."(Source: US Network Pool Via… pic.twitter.com/4Y5AUK4jG0— ANI (@ANI) March 20, 2026యుద్ధం ఆగదు.. మరోవైపు.. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ విజయం వైపు దూసుకుపోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైనిక వ్యవస్థను అమెరికా ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇరాన్ వైమానిక వ్యవస్థలను ధ్వంసం చేశామని, సైనిక పరంగా ఆ దేశం పని అయిపోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే తమ అంతిమ ధ్యేయమని చెప్పారు. అలాగే, యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు. తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కాల్పుల విరమణ మాత్రం చేయబోం. శత్రువును పూర్తిగా తుడిచిపెడుతున్న సమయంలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలుఇరాన్ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు చేశారు. పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు రాకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫారమ్లో ఆయన నాటోను "పేపర్ టైగర్" అని విమర్శించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, ఇరాన్ వంటి దేశాల ముప్పును అడ్డుకోవడంలో వారు పిరికితనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు జలసంధి తెరిపించేందుకు నాటో దేశాలను ట్రంప్ సైనిక సహాయం కోరారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ను నాటో దేశాలు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇరాన్పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
ఇరాన్పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్కు తరలిస్తోంది. 31వ మరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్కు గుండెకాయ వంటి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ను ఇరాన్ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్ నుంచే జరుగుతాయి.ఖర్గ్ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్ దీవి ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు. -
అమెరికా భయానక దాడులు.. ఇరాన్ కు భారీ నష్టం?
-
హర్మూజ్ను తెరిచేందుకు అమెరికా సంచలన నిర్ణయం!
వాషింగ్టన్: అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై పట్టు తెచ్చుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ హర్మూజ్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా, ఇరాన్కు చెందిన ఆస్తులను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ప్రకటించారు.అమెరికా ఇప్పటికే ఏ-10 వార్హాగ్ దాడి విమానాలు, ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లు, యూఎస్ఎస్ బాక్సర్ ఎఫ్-35 జెట్లను రంగంలోకి దించింది. వీటితో పాటు నాలుగు వేల మంది సైనికులను హర్మూజ్ జలసంధిలో మోహరించింది.ఇరాన్ ఏర్పాటు చేసిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, సీమైన్స్, పడవలు, మందుపాతరలను ధ్వంసం చేయడానికి అమెరికా చర్యలు ప్రారంభించింది. తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తోంది. సీమైన్స్ తొలగించడానికి వారం రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.జనరల్ కెయిన్ ప్రకారం, హర్మూజ్ జలసంధి అణువణువును అమెరికా జల్లెడ పట్టనుంది. ఇరాన్కు చెందిన 120కి పైగా నౌకలు, 44 మందుపాతర నౌకలు, ఇతర ఆయుధ కేంద్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
ఇరాన్పై యుద్ధం.. ట్రంప్నకు భారీ ఊరట
లండన్: హార్మూజ్ జలసంధి నుంచి క్షేమంగా రాకపోకలు సాగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ప్రకటించాయి. ఈ విషయంలో సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు గురువారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.ఈ సందర్భంగా హార్మూజ్లో నౌకలపై ఇరాన్ సైన్యం చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్లో నౌకల రాకపోలపై ఆంక్షల నేపథ్యంలో ఇంధన మార్కెట్లు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టంచేశాయి. ఈ విషయంలో సమన్వయంతో పని చేస్తామని తెలిపాయి. హార్మూజ్లో చమురు, గ్యాస్ నౌకల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని తేల్చిచెప్పాయి. ఇందుకోసం తమ ప్రయత్నాలు తాము చేస్తామని వివరించాయి. ఇంధన ఉత్పత్తి దేశాలతో కలిసి పని చేస్తామని పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ఉత్పత్తి మరింత పెరగాలని, తద్వారా మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించాయి.ఇరాన్పై ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమయ్యాయి. అందుకు ప్రతీకారంగా హార్మూజ్లో చమురు, గ్యాస్ నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. చమురు, గ్యాస్ సరఫరా చేసే నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడం అత్యంత హేయమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ మండిపడ్డాయి. చమురు నౌకలతో ఇరాన్కు ముప్పు ఉంటుందా? అని ప్రశ్నించాయి. ఇకనైనా దాడులు ఆపాలని, హార్మూజ్ జలసంధిని ఇరాన్ను డిమాండ్ చేశాయి. ఇంధన సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుందని ఆందోళన వ్యక్తంచేశాయి. NEW: The UK alongside France, Germany, Italy, the Netherlands and Japan expresses readiness to contribute to appropriate efforts to ensure safe passage through the Strait of Hormuz 👇 https://t.co/KeCAbEbdWy pic.twitter.com/uqtRF394En— British Embassy Washington (@UKinUSA) March 19, 2026 -
చమురు భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం జంప్చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్ నైమెక్స్లోనూ లైట్ స్వీట్ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. హార్మూజ్ మూసివేతకుతోడు.. ఖతార్లోని గ్యాస్ సౌకర్యాలు, కువైట్లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్ చమురు బాస్కెట్ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి. -
హర్మాజ్ జలసంధి ఆక్రమణ కోసం ట్రంప్ భారీ వ్యహం
-
భారత్కు చేరిన జగ్ లడ్కీ
అహ్మదాబాద్/హాంకాంగ్: యుద్ధమయ హార్మూజ్ గుండా మరో ముడిచమురు రవాణా నౌక క్షేమంగా భారత నౌకాశ్రయానికి చేరుకుంది. భారతీయ జెండాతో ‘జగ్ లడ్కీ’నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా పోర్ట్లో 80,886 మెట్రిక్ టన్నుల ముడిచమురు నింపుకుని హార్మూజ్ గుండా ప్రయాణించి బుధవారం గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు చేరుకుందని ఆ పోర్ట్ నిర్వహణ సంస్థ ‘అదానీ పోర్ట్స్’ప్రకటించింది. ఇదే ఫుజైరా పోర్ట్పై ఇరాన్ ఇటీవల క్షిపణి దాడులు చేసింది. అయినాసరే పోర్ట్నుంచి సరకు ఎగుమతి నిరాటంకంగా కొనసాగుతోంది. సోమవారం హార్మూజ్ గుండా బయల్దేరి 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరకుతో ‘నందా దేవి’నౌక వచి్చన మరుసటి రోజే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా భారత్కు రావడం విశేషం. 274.19 మీటర్ల పొడవుండే జగ్ లడ్కీ నౌక గరిష్టంగా 1,64,716 టన్నుల సామర్థ్యతో ప్రయాణించగలదు. భారత చమురు దిగుమతులకు సంబంధించి హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. దీని గుండానే భారత్కు దాదాపు 40–50 శాతం చమురు వస్తోంది. హార్మూజ్ను దాటిన 89 నౌకలు హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్ నిషేధం విధించినా సరే సిగ్నళ్లను నిలిపేసి, లైట్లను ఆర్పేసి ‘డార్క్ మోడ్’లో ఎవరి కంటా పడకుండా కొన్ని నౌకలు ఇదే మార్గం గుండా ప్రమాదకరరీతిలో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. అయితే మిత్రదేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడట్లేదని తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలు సైతం సురక్షితంగానే ప్రయాణం పూర్తిచేస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి నెల 15వ తేదీదాకా 89 సరకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా విజయవంతంగా ప్రయాణించాయని సముద్రమార్గ ప్రయాణాల డేటా సంస్థ ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’బుధవారం ప్రకటించింది. ఈ 89 నౌకల్లో ఐదింట ఒకవంతు నౌకలకు ఇరాన్తో సంబంధం ఉందని, చైనా, గ్రీస్ జెండాలున్న నౌకలూ సులభంగానే హార్మూజ్ను దాటేశాయని ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’పేర్కొంది. చైనాకు బదులు భారత్కు బయల్దేరిన 7 నౌకలు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షల సడలింపు ప్రకటించిన నేపథ్యంలో మోదీ సర్కార్ మళ్లీ రష్యాచమురు కొనుగోళ్ల పర్వానికి తెరలేపింది. దీంతో రష్యా నుంచి చైనాకు బయల్దేరిన ఏడు ముడిచమురు రవాణా నౌకలు సముద్రమార్గం మధ్యలోనే దిశ మార్చుకుని భారత్కు ప్రయాణం మొదలెట్టడం విశేషం. జనవరి చివరివారంలో రష్యా నుంచి బయల్దేరి బాలి్టక్ సముద్రజలాల్లో ప్రయాణించిన మధ్యశ్రేణి ముడిచమురునౌక ‘ఆక్వా టైటాన్’వాస్తవానికి చైనాలోని రిజావో పోర్ట్కు వెళ్లాలి. కానీ అది ఇటీవల దిశ మార్చుకుని భారత్ దిశగా వెళ్తోందని, మార్చి 21వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్లో లంగరు వేస్తుందని నౌకల ట్రాకింగ్ సంస్థ ‘ఓర్టెక్సా లిమిటెడ్’పేర్కొంది. ‘సూయిజ్మ్యాక్స్ జోయూజోయూ ఎన్’నౌక సైతం దిశ మార్చుకుని భారత్కు వస్తోందని మార్చి 25వ తేదీకల్లా గుజరాత్లోని జామ్నగర్ సిక్కా పోర్ట్కు చేరుకుంటుందని తెలిపింది. -
మాట నిలబెట్టుకున్న ఇరాన్.. హార్ముజ్ నుంచి భారత్ చేరిన భారీ ఆయిల్ షిప్
-
హార్ముజ్ సమీపంలో ఎయిర్ స్ట్రైక్స్.. ఇరాన్ పై అమెరికా భారీ దాడి
-
హార్మూజ్ వద్ద అమెరికా భయానక దాడులు.. ఇరాన్కు భారీ నష్టం?
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా ఫుల్ ఫోకస్ పెట్టింది. జలసంధిని తిరిగి తెరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ కీలక జలమార్గం సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది.అమెరికా సైన్యం తాజాగా హార్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది. జలసంధి సమీపంలోని ఇరాన్ తీరప్రాంతంలో పటిష్టంగా ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై పలు 5,000-పౌండ్ల డీప్ పెనెట్రేటర్ బాంబులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా పరిణమించాయి అని చెప్పుకొచ్చింది.Hours ago, U.S. forces successfully employed multiple 5,000-pound deep penetrator munitions on hardened Iranian missile sites along Iran’s coastline near the Strait of Hormuz. The Iranian anti-ship cruise missiles in these sites posed a risk to international shipping in the… pic.twitter.com/hgCSFH0cqO— U.S. Central Command (@CENTCOM) March 17, 2026అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకారంగా, ప్రపంచ చమురులో ఐదో వంతు ప్రవహించే హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ దిగ్బంధనం సముద్ర రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, జలసంధిపై ఇరాన్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. యుద్ధంలో పాల్గొనని దేశాలకు చమురు సరఫరా చేసే నౌకలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.శక్తివంతమైన బాంబు..2022లో ఎయిర్ ఫోర్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, బంకర్ బస్టర్ అని పిలవబడే ఈ బాంబుల ఖరీదు సుమారు $288,000. అయినప్పటికీ, గత సంవత్సరం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వేసిన 30,000 పౌండ్ల (13,600 కిలోల) బాంబుల కంటే ఇవి తక్కువ శక్తివంతమైనవి. ఇవి సాధారణ బాంబులతో ధ్వంసం చేయలేని భూగర్భ బంకర్లు, కాంక్రీట్ కట్టడాలు వంటి గట్టి నిర్మాణాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.🇺🇸🇮🇷The U.S. unleashed the Massive Ordnance Penetrator, the 30,000-pound bomb.A.K.A. the bunker buster.This thing is engineered to slam through up to 200 feet of the toughest reinforced concrete before turning "buried and safe" into a myth…#iran #usa #dubai https://t.co/wtMI4obSkg pic.twitter.com/loQFtjDCIr— PROXY (@PROXY0b) March 14, 2026బాంబుల లక్షణాలుబరువు: సుమారు 2,267 కిలోలు (5,000 పౌండ్లు).రకం: బంకర్ బస్టర్, అంటే భూగర్భంలో ఉన్న గట్టి నిర్మాణాలను ఛేదించే బాంబు.ఉపయోగం: క్షిపణి సైలోలు, కమాండ్ సెంటర్లు, బలమైన రక్షణ గల స్థావరాలను ధ్వంసం చేయడం.వాహక విమానాలు: భారీ బాంబర్లు లేదా ప్రత్యేకంగా సిద్ధం చేసిన యుద్ధ విమానాలు.ట్రంప్ హెచ్చరిక..మరోవైపు..నాటో మద్దతు లేకపోయినా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే భద్రతలోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్తితుల్లో కూడా ఎక్కువ సమయం పట్టదు అని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని, ఒంటరిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హార్మూజ్ భద్రతపై అమెరికా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు తీవ్రతరం అయ్యాయని ట్రంప్ వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలు.. ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఈ సహకారం భద్రతా చర్యలకు కీలకమని తెలిపారు. అమెరికా సైన్యం రంగం ప్రవేశం చేస్తే వియత్నాం తరహా యుద్ధం జరుగుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి చేసిన హెచ్చరికలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. తనకు ఎలాంటి భయం లేదని, దేనికీ కూడా భయపడేది లేదని స్పష్టం చేశారు -
క్షేమంగా చేరుకున్న ‘నందాదేవి’
న్యూఢిల్లీ: ఇరాన్ దాడులతో ప్రమాదకరంగా పరిణమించిన హార్మూజ్ జలసంధి గుండా మరో ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా భారత్కు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రిదాటాక 2.30 గంటలకు ‘నందాదేవి’నౌక గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుందని కేంద్ర పోర్ట్లు, షిప్పింగ్, వాటర్వేస్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా చెప్పారు. సోమవారం తొలి నౌక శివాలిక్ గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు చేరుకున్న విషయం విదితమే. రెండు నౌకల ద్వారా మొత్తంగా 92,712 టన్నుల ఎల్పీజీ భారత్కు వచ్చింది.ఇంతటి ఎల్పీజీ నిల్వ మొత్తం భారతదేశ ఒకరోజు అవసరాలకు సరిపోతాయి. ‘‘రెండు నౌకల నుంచి ఎల్పీజీ దిగుమతి ప్రక్రియ ఆరంభమైంది. గత 24 గంటల్లో భారతీయ నావికులు ఉన్న ఎలాంటి నౌక ఎలాంటి దాడి ఘటనలకు గురికాలేదు. మన నావికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ రెండు నౌకలు మార్చి 13వ తేదీన ఎల్పీజీ నింపుకుని బయల్దేరి మార్చి 14వ తేదీన ప్రమాదకర హార్మూజ్ను దాటాయి.ఈ రెండింటితో కలిపి యుద్ధమయ పశ్చిమాసియా నుంచి భారత్కు క్షేమంగా చేరుకున్న నౌకల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఇంకా 22 భారతీయ జెండా ఉన్న నౌకలు పశ్చిమాసియాలో చిక్కుకుపోయాయి. వీటిల్లో మొత్తంగా 611 మంది భారతీయ నావికులు ఉన్నారు. నావికుల క్షేమ సమాచారం అందించేందుకు నౌకల యజమానులు, ఏజెన్సీలు, భారత హైకమిషన్లతో నిరంతరం సంప్రతింపులు జరుపుతున్నాం’’అని రాజేశ్ సిన్హా చెప్పారు. -
యూఏఈ అధ్యక్షుడికి మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేల భారత ప్రధాని నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత వాణిజ్య నౌకాయానంపై ఇద్దరు నాయకులు చర్చించారు.మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్న ప్రకారం.. నా సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో మాట్లాడాను. అతనికి ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరం చర్చించాం. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నావిగేషన్ అవసరమని మేము అంగీకరించాము. యూఏఈపై జరిగిన దాడులను భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం కలిసి పని చేస్తాము.కాగా, ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య ఫోన్ సంభాషణ జరగడం ఇది రెండోసారి. మార్చి 2న కూడా మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడి దాడులను ఖండించారు. మోదీ ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబాహ్ అల్-ఖాలెద్ అల్-సబాహ్, ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో కూడా మాట్లాడారు. -
దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు
-
భారత్ ప్రజలకు గుడ్ న్యూస్.. LPG నౌక వచ్చేసింది
-
ట్రంప్నకు భారీ షాక్.. యుద్ధంలో ఊహించని ఎదురుదెబ్బ?
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. క్షిపణులు, డ్రోన్ దాడులతో పశ్చిమాసియా 17 రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏడు మిత్రదేశాలు ట్రంప్కు షాకిచ్చాయి. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ ట్రంప్ చేసిన సూచనను పలు మిత్ర దేశాలు తిరస్కరించాయి. దీంతో, ఇరాన్తో యుద్ధంలో కీలక పరిణామం నెలకొంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలకు సందేశాలు పంపించారు. ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపాలంటూ సూచనలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ సందేశంపై మిత్రదేశాలు జపాన్, ఆస్ట్రేలియా షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి కేథరిన్ కింగ్ స్పందిస్తూ.. హర్మూజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో యుద్ధనౌకను పంపాలని కోరుతూ అమెరికా నుంచి తమకు అధికారిక విన్నపమేదీ అందలేదని మరో ట్విస్ట్ ఇచ్చారు. తమ వార్షిప్ను పశ్చిమాసియాకు పంపే ఆలోచనేదీ లేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంత ముఖ్యమైందో తమకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.జపాన్ ఝలక్..మరోవైపు.. ట్రంప్ సందేశంపై జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచి కూడా స్పందించారు. జపాన్ పార్లమెంటు వేదికగా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేదీ లేదని ఆమె వెల్లడించారు.బ్రిటన్ ఇలా.. అలాగే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రాయల్ నేవీ డిస్ట్రాయర్లను పంపేందుకు లండన్ సిద్ధంగా లేదని స్టార్మర్ స్పష్టం చేశారు. బదులుగా, మైన్-హంటింగ్ డ్రోన్లను పంపి సహకరించవచ్చని తెలిపారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం అత్యంత ముఖ్యం. కానీ సంక్షోభం మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. అంతేకాకుండా హర్మూజ్ జలసంధి విషయంలో కొన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు ముక్కుసూటిగానే నిరాకరిస్తున్నాయి. దీంతో, ఇరాన్పై యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్నకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.అమెరికా ఒత్తిడి..యుకే, జపాన్, ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడంతో అమెరికా ఒంటరిగా ఇరాన్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెంచుతోంది. ఈ నేపథ్యంలో మిత్రదేశాలు వెనక్కి తగ్గడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, చైనా ఎక్కువగా ఈ జలసంధి ద్వారా చమురు పొందుతున్న కారణంగా దాని రక్షణ బాధ్యతను కూడా వారు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. -
భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికా దళం వచ్చింది.షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. ఇవాళ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఈ నౌక సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఎల్పీజీ గ్యాస్ నౌక భారత్కు సురక్షితంగా రావడం శుభపరిణామ. దేశీయ వంట గ్యాస్ కొరతను తగ్గించడంలో సహాయపడుతోంది. రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌక దాదాపు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తోంది. ఈ రెండు నౌకలు కలిపి 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నాయి. #Fujairah #IranIsraelWar #GlobalEnergy #PMModi #IndianShips #NandaDevi #Shivalik #Delhi $BJP 54 हजार टन LPG लेकर जहाज ‘शिवालिक’ आज मुद्रा पोर्ट पहुंचेगा,नई दिल्ली. मोदी सरकार की कुशल रणनीति और ईरान–इजराइल तनाव के बीच भारत के लिए राहत की खबर है, करीब 54 हजार टन एलपीजी गैस लेकर… pic.twitter.com/YbqSa3dnBM— सिरोही की आवाज (@Sirohikiaawaz) March 16, 2026 -
భారత్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ ఇరాన్తో తాను జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం నేను ఇరాన్తో సంప్రదింపులు జరుపుతున్నాను. ఈ చర్చలు ఫలితాల్ని ఇస్తున్నాయి. ఇరాన్తో భారత్ నిరంతరం టచ్లోనే ఉంటుంది. చర్చల ద్వారా దౌత్యపరమైన విజయాలు లభిస్తుంటే వాటిని పరిశీలించడంలో తప్పులేదు. నేనుకూడా అదే చేస్తున్నాను’ అని ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో జైశంకర్ తెలిపారు. ‘ఖచ్చితంగా, ఆయా దేశాలతో సమస్యలుంటే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత్ దృక్కోణం నుండి ఇరాన్తో చర్చలు జరపడం,సమన్వయం చేసుకోవడం మంచిది. పరిష్కారం సైతం లభిస్తోందన్నారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంత కొనసాగుతోంది. క్రమంలో ప్రపంచ దేశాలపై ఆర్థిక పరమైన ఒత్తిడి తెచ్చేలా ఇరాన్ తన హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. తమని కాదని చమురు నౌకల రవాణాని కొనసాగిస్తే వాటిని పేల్చుతామని హెచ్చరించింది. అందుకు కొనసాగింపు ఇరాన్ హర్మూజ్ జలసంధిలో నేవల్ మైన్స్ను నింపేసింది. 700నౌకలను నిలిపివేసిందిఈ క్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఇరాన్తో చర్చలు జరిపారు. హర్మూజ్ జలసంధిలో భారత్ నౌకలపై ఆంక్షలు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు భారత్ గ్యాస్, చమురు నౌకలకు అనుమతి ఇచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. భారత్ జెండాలతో జలసంధి గుండా వెళ్లొచ్చని సూచించింది.ఆరోణల్ని ఖండించిన జైశంకర్భారత జెండాతో ఉన్న నౌకలకు సంబంధించి ఇరాన్తో ఎలాంటి ‘సమగ్ర ఒప్పందం’లేదని విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం ద్వారా ఇరాన్ ప్రతిఫలం పొందిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం. భారత్-ఇరాన్ల మధ్య చిరకాల సంబంధం ఉంది. దాని ఆధారంగా చర్చలు జరిపినట్లు పునరుద్ఘాటించారు. భారత్ నౌకలకు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. అయినప్పటికీ హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన నౌకలు చాలా ఉన్నాయి. వాటి విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. -
ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. మరో జలసంధి బంద్!
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ షిప్పింగ్కు వీలుగా తెరిచే ఉంచుతామని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను మాత్రమే దాని గుండా అనుమతించబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ‘ఈ మార్గాన్ని ఇతర దేశాల నౌకలకు తెరిచే ఉంచుతాం. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా పలు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లాయి. కొన్ని షిప్పింగ్ కంపెనీలు భద్రతా కారణాలతో వేరే మార్గాలు ఎంచుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు.మరో జలసంధి బంద్..!మరోవైపు.. ఇరాన్ అండదండలున్న యెమన్ హౌతీ మిలిటెంట్లు ఆ దేశానికి మద్దతుగా అతి త్వరలో రణరంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన మార్గమైన బాబ్ ఎల్–మాండెబ్ జలసంధి కూడా మూతపడేలా కనిపిస్తోంది. ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రాలను మధ్యదరా సముద్రంతో అనుసంధానించే మాండెబ్పై హౌతీలకు గట్టి పట్టుంది. ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచడానికి దాన్ని మూసేస్తామని హౌతీలు చెబుతున్నారు. ప్రపంచ చమురు రవాణాకు ఆయువుపట్టు వంటి హార్మూజ్ జలసంధి మూతపడటంతో ఇప్పటికే చమురు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. మాండెబ్ నుంచి కూడా రవాణా ఆగితే సరుకుల ధరలకు రెక్కలు రావడం ఖాయం. భారత్ వైపు చమురు నౌక.. భారత్కు చెందిన మరో నౌక ‘జగ్ లాడ్కీ’ భారీ చమురుతో యూఏఈలోని పుజైరా చమురు కేంద్రం నుంచి స్వదేశానికి బయల్దేరింది. పశ్చిమాసియా యుద్ధక్షేత్రం నుంచి క్షేమంగా బయటపడిన నాలుగో భారత నౌకగా నిలిచింది. పుజైరాపై భీకర దాడులు జరుగుతున్నా 80,800 టన్నుల ముడి చమురు నింపుకొని క్షేమంగా వస్తున్నట్లు కేంద్రం అదివారం వెల్లడించింది. -
సరదా కోసమైనా ఖార్గ్ దీవిపై దాడి చేస్తాం : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని చర్యలను ఇకపై చేపట్టబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఇంధన ఎగుమతిలో కీలకమైన ఖార్గ్ ఐలాండ్పై సరదా కోసమైనా దాడులు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు.అదే సమయంలో హర్మూజ్ జలసంధిని కాపాడేందుకు యుద్ధనౌకలను పంపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ప్రతిగా, ఇరాన్ దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. తాను విధించిన షరతులకు లోబడి ఇరాన్ నడుచుకోవాలని, లేదంటే యుద్ధం తీరుతెన్నులు, లక్ష్యాల్ని ఎప్పటికప్పుడూ మారుస్తుంటామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా పశ్చిమాసియా దేశాలు ట్రంప్తో సంప్రదింపులు జరిపాయి. ట్రంప్తో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ఆ దేశానికి ఆర్థిక ఆయువుపట్టైన ఖార్గ్ దీవిపై దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులు చేస్తామని ఆయన ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.వాస్తవానికి అమెరికా ఇప్పటి వరకు ఖార్గ్ దీవిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ చమురు కేంద్రాలపై దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇరాన్ తన డిమాండ్లకు తలొగ్గకపోవడంతో ఇప్పు ట్రంప్ ఖార్గ్ ఐలాండ్పై పడినట్లు సమాచారం.ఖార్గ్ ఐలాండ్పై దాడులు జరగడం వల్ల ఇరాన్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సమీపంలో ఖార్గ్ ద్వీపం ఉండటం.. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. గ్యాస్ కొరత ప్రజలను మరింతగా వేధించనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సాహసోపేతంగా... ముంబైకి చేరుకున్నషెన్లాంగ్ నౌక
ముంబై: సంకల్పంతో ముందుకెళితే మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు సరైన వ్యూహాలు అక్కరకొస్తాయంటారు. శత్రు నౌకలు, జలాంతర్గాముల సంచారాలను అడ్డుకునే సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’ను హార్మూజ్ జలసంధిలో అక్కడక్కడా ఇరాన్ ఏర్పాటుచేసినా సరే దృఢనిశ్చయంతో అదే మార్గంలో ప్రయాణించి ముడి చమురునౌక షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ సాహసోపేత యాత్రను పూర్తిచేసింది.పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక హార్మూజ్ జలసంధి గుండా ఎలాంటి దాడుల బారిన పడకుండా సురక్షితంగా ముంబై చేరుకున్న తొలి నౌకగా షెన్లాంగ్ సూయిజ్మ్యాక్స్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. బుధవారమే నౌక ముంబైకి చేరుకున్నప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మార్చినెల ఒకటో తేదీన సౌదీ అరేబీచియాలోని రాస్ తనూరా నౌకాశ్రయంలో ఏకంగా 1,35,335 మెట్రిక్ టన్నుల ముడిచమురును నింపుకుంది. మార్చి మూడో తేదీన అక్కడి నుంచి బయల్దేరి క్షేమంగా ముంబై పోర్ట్కు చేరుకుంది.ఏమాత్రం అనుమానం రాకుండా..అంతర్జాతీయ సముద్రజలాల గుండా వెళ్లే ముడి చమురు, సరకు రవాణా నౌకలు పొరపాటున ఎదురెదురుగా రాకుండా, ఢీకొనకుండా ఉండేందుకు వాటి స్థానాన్ని అత్యంత కచ్చితత్వంతో తెల్సుకునేందుకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తుంటారు. దీని సాయంతో నౌక ఎక్కడ, ఎంత వేగంతో, ఏ దిశలో వెళ్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. దీని సాయంతో నౌకల గుట్టుమట్లను ఇరాన్ తెల్సుకుని నౌకల మీదకు ఆత్మాహుతి డ్రోన్ లేదా క్షిపణులను ప్రయోగించే ప్రమాదముంది. వాటితోనూ పనిలేకుండా సీమైన్స్నూ అక్కడక్కడా అమర్చింది. ఈ ఆటంకాలను అధిగమించేందుకు షెన్లాంగ్ నౌక కెపె్టన్, భారతీయుడు సుఖ్శాంత్ సింగ్ సంధూ బృందం నౌకాయాన విధానమైన ‘డార్క్మోడ్’టెక్నిక్ను అవలంభించారు.నౌకకు సంబంధించిన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(ఏఎస్ఐ) వివరాలు ఎక్కడా ట్రాకింగ్ డేటాలో నమోదుకాకుండా ఉండేందుకు ఏఐఎస్ను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఫలానా చోట నౌక ఉంది అనే విషయం ఇరాన్కు తెలీకుండా పోయింది. హార్మూజ్ జలసంధిలోకి షెన్లాంగ్ నౌక ప్రవేశించగానే దాని సిగ్నళ్లు ఆర్పేశారు. దీనికి తోడు నౌకలోని అన్ని విద్యుత్దీపాలను ఆర్పేశారు. నౌక సిగ్నళ్లు చివరిసారిగా మార్చి 9వ తేదీన కన్పించాయి. తర్వాత నౌక పత్తాలేకుండా పోయింది. దాడులకు గురై మునిగిపోయిందేమోననే భయాందోళనల నడుమ అనూహ్యంగా నౌక హార్మూజ్ను దాటింది. తర్వాత ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను స్విచ్ఆన్ చేశారు. దీంతో నౌక క్షేమంగా గమ్యం దిశగా వస్తోందని అర్థమైంది.బుధవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు ఇది ముంబై పోర్ట్కు చేరుకుంది. తర్వాత జవహర్ ద్వీప్ వద్ద సాయంత్రం 6.06 గంటలకు లంగరువేసింది. గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరానికి చెందిన డైనాకామ్ ట్యాంకర్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థ ఈ నౌకను నిర్వహిస్తోంది. ఈ నౌకలో 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో భారత్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ దేశస్తులు ఉన్నారు. డార్క్మోడ్ విధానంలో మరో ఐదు నౌకలు తమ గమ్యస్థానాల దిశగా కదిలే ఆస్కారముందని నౌకల ప్రయాణాలను పర్యవేక్షించే ‘ట్యాంకర్ట్రాకర్స్.కామ్’సంస్థ పేర్కొంది. రెండు భారీ చమురు రవాణా నౌకలు, పనామా కాలువలో పట్టే మరో పనామామ్యాక్స్ ట్యాంకర్ నౌక, సూయిజ్కాలువలో పట్టే రెండు సూయిజ్మ్యాక్స్ ట్యాంకర్నౌకల జాడ సైతం గత 48 గంటలుగా కన్పించట్లేదని ఇవి కూడా డార్క్మోడ్లో సముద్రయానం చేస్తుండే అవకాశముందని సంస్థ అంచనావేస్తోంది. -
అమెరికాకు వణుకు పుట్టిస్తున్న ఇరాన్ మైన్లు!
ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు సముద్రపు మందుపాతరలు కీలకపాత్ర పోషించబోతున్నాయా? అమెరికా నౌకాదళం కోసం ఇరాన్ సముద్రంలో మైన్లు అమర్చిందా? హోర్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇరాన్ ఈ నయా బాంబులపైనే ఆధారపడిందా? అందుకే ట్రంప్ ఇప్పుడు సముద్రపు మందుపాతరల గురించి మాట్లాడుతున్నారా?అమెరికా కాంగ్రెస్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద 5,000 నుంచి 6,000 వరకు నౌకాదళ మైన్లు ఉన్నాయని ఈ రిపోర్ట్ బాంబు పేల్చింది. అవసరమైతే ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని అడ్డుకునే సామర్థ్యం ఇరాన్కు ఉందని ఆ నివేదిక చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవడానికి ఇరాన్ క్షిపణుల కంటే నౌకాదళ మైన్లపైనే ఎక్కువగా ఆధారపడిందని తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి చాలా తక్కువ లోతుతో ఉండటంతో పాటు, అక్కడి నౌకాయాన మార్గాల వెడల్పు 2 మైళ్లు మాత్రమే. దీంతో ఈ మార్గంలో మందుపాతరలు అమరిస్తే.. నౌకల రాకపోకలు సులభంగా నిలిచిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.మూడు రకాల సముద్రపు మందుపాతరలుఅమెరికన్ కాంగ్రెస్ నివేదిక ప్రకారం… ఇరాన్ వద్ద ప్రముఖంగా మూడు రకాల సముద్రపు మందుపాతరలు ఉన్నాయి. ఇందులో లింపెట్ మైన్లు ముఖ్యమైనవి. వీటిని నౌకల గోడలకు అతికిస్తారు. టైమర్ సెట్ చేస్తే ఇవి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఇక సముద్రంలో తేలియాడుతూ… నౌకలు తాకగానే పేలపోయే మూర్డ్ మైన్లు మరింతప్రమాదకరమైనవి. ఇవిఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి అంతకంటే చాలా చవకైనవి.ఇక నీటి అడుగు భాగంలో ఉండి… నౌక వీటిపైనుంచి వెళ్లగానే సెన్సార్ల సహాయంతో పేలిపోయేవి బాటమ్ మైన్లు. ఇవి శబ్దం, ఒత్తిడితో పాటు అయస్కాంతం తరంగాలను పసిగట్టి వెంటనే పేలిపోతుంది. వీటిని ఎలాంటి రాడార్లు పసిగట్టలేవు. వీటితో పాటు అత్యంత ప్రమాదకరమైన కొన్ని మైన్లు నౌక కింద నుంచి రాకెట్ వార్హెడ్ను పైకి కాల్చి నౌక బాడీని దెబ్బతీయగలవు అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ మూడు రకాల మైన్లతో హోర్ముజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఇరాన్ యోచిస్తోంది.హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్లుఈ మైన్లు చౌకగా తయారవుతాయి, గుర్తించడం చాలా కష్టం, తొలగించడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కీలక మార్గాల్లో కేవలం కొన్ని వందల మైన్లు వేస్తేనే ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా వెళ్లే చమురు రవాణాలో 20 నుంచి 30 శాతం వరకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా గూఢచారి వర్గాల సమాచారం ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కొంతమేర మైన్లు ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ చర్యలు పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ముడి చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. అందువల్ల హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గంగా భావిస్తున్నారు.చదవండి: భారత జెండాలతో ఉన్న నౌకలకు ఇరాన్ అనుమతిఇక ఈ పరిస్థితిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్లు వేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాల్సిందే అని హెచ్చరించారు. -
అవును.. హర్మూజ్ జలసంధిలో నౌక ‘సేఫ్సీ విష్ణు’ని పేల్చేశాం : ఇరాన్
టెహ్రాన్: హర్మూజ్ జలసంధి పరిధిని దాటి దాడులకు ఇరాన్ సిద్ధమైంది. సముద్రంలో నౌకలనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను నేవల్ మైన్స్తో (సముద్రపు మందుపాతరలు) పేల్చివేసింది. అమెరికాకు చెందిన ‘సేఫ్ సీ విష్ణు’ అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే.. ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే భారత్కు చెందిన ఓ నౌకపై హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే..! 🚨 Indian Embassy in Iraq has confirmed that an attack on the crude oil tanker Safesea Vishnu near Basra on March 11 resulted in the tragic death of an Indian sailor. 15 other Indian crew members were safely evacuated & are receiving all possible assistance from the embassy. pic.twitter.com/vj0X5CbKYU— Megh Updates 🚨™ (@MeghUpdates) March 12, 2026 -
పీపా 100 డాలర్ల పైకి..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ ముడిచమురు రేట్లు మరింతగా మండుతున్నాయి. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో 2022 తర్వాత తొలిసారిగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల పైకి ఎగసింది. నైమెక్స్ క్రూడ్ (డబ్ల్యూటీఐ) ఏప్రిల్ డెలివరీ ధర ఒక దశలో 31.44 శాతం పెరిగి 120 డాలర్లకు దాదాపు దగ్గరగా 119.48 డాలర్లను తాకింది. అటు బ్రెంట్ క్రూడ్ కూడా 28.82 శాతం పెరిగి 119.46 డాలర్లకు ఎగిసింది. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తగ్గిపోవడం, ప్రాంతీయంగా పలు దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని ఇండస్ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు.ఉద్రిక్తతల కారణంగా కీలక షిప్పింగ్ మార్గంలో నౌకలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటూ ఉండటంతో గ్లోబల్గా దాదాపు అయిదో వంతు ముడిచమురు, సహజ వాయువు సరఫరా నిలి్చపోయినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. ‘హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలిగించడం తొలి దశ. ప్రస్తుతం అదే జరుగుతోంది. రెండో దశలో మరింత తీవ్రమైన రిసు్కలు ఉండొచ్చు. ప్రాంతీయంగా ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలపై నేరుగా దాడులు చేయొచ్చు. మూడో దశలో కీలకమైన నీటి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ఎంసీఎక్స్లో భగ్గు.. అంతర్జాతీయ పరిణామాలతో దేశీ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో కూడా ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. మార్చి డెలివరీ కాంట్రాక్టు ఎకాయెకిన 26 శాతం ఎగిసి (రూ. 2,186) జీవితకాల గరిష్ట స్థాయి రూ. 10,549ని తాకింది. మార్చి కాంట్రాక్టు అప్పర్ సర్క్యూట్ తాకిందని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే సెషన్లలో రూ. 11,300కి కూడా పెరిగే అవకాశం ఉందని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ ఆమిర్ మక్డా చెప్పారు.బ్యారెల్ ధర ఒక డాలరు పెరిగేతే ఏటా భారత్పై 1.8 బిలియన్ డాలర్ల భారం యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయిల్ రేటు 50 డాలర్లు పెరిగి, ఏడాది పాటు కొనసాగితే 90 బిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతమని మిశ్రా పేర్కొన్నారు.సంక్షోభాలు.. యుద్ధాలతో ఆజ్యం..సుమారు దశాబ్దంన్నర కాలంగా వివిధ సంక్షోభాలు, యుద్ధాలతో ముడిచమురు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కమోడిటీల బూమ్ ఏర్పడింది. ఆయిల్ ధరలు ఆ ఏడాది జూలై 11న ఆల్టైం గరిష్టస్థాయి 147.50కి ఎగిశాయి. ఆ తర్వాత 2011లో పశి్చమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు తిరుగుబాట్లతో దద్దరిల్లినప్పుడు 127 డాలర్ల స్థాయిని చూశాయి.అమెరికన్ షేల్ ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ముంచెత్తడంతో 2015 తొలినాళ్లలో 50 డాలర్లకు పడిపోయాయి. ఆ తర్వాత 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంధనానికి డిమాండ్ పడిపోయి, చమురు ఉత్పత్తి దేశాలు నిల్వలను వదిలించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు బ్రెంట్ క్రూడ్ రికార్డు కనిష్టం 15.98 డాలర్లకు కూడా పతనమైంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మైనస్ 40.32 డాలర్లను తాకింది. మళ్లీ 2022 రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆయిల్ రేట్లకు రెక్కలొచ్చాయి. 2022 తొలినాళ్లలో 139 డాలర్లకు ఎగబాకాయి. -
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Strait of Hormuz: ఆ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ హక్కు మాదేనంటూ ఇరాన్ తేల్చి చెప్పింది.హర్మూజ్ జలసంధి విషయంలో కీలక ప్రకటన చేసిన ఇరాన్.. జలసంధిని నియంత్రించే అధికారం మాకుందని పేర్కొంది. మరోవైపు, అన్ని దేశాలకు చమురు నిలిపివేయడం లేదన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది. దీంతో ఇరాన్ ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లైంది.కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
యుద్ధం ఎఫెక్ట్.. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్పై దెబ్బ!
న్యూయార్క్: హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో ముడి చమురు మాత్రమే కాకుండా ఇతర వస్తూత్పత్తుల సరఫరా సైతం స్తంభించిపోయింది. సముద్రమార్గంలో నౌకలతోపాటు గగనతలంలో కార్గో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇతర వస్తువుల సరఫరా గొలుసులు తెగిపోయి పలు దేశాల్లో ఆయా వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది.భారత్లో తయారైన ఫార్మాసూటికల్స్, ఆసియా దేశాల్లో తయారైన సెమీకండక్టర్లు, బ్యాటరీలు, పశ్చిమాసియా దేశాల్లో తయారైన రసాయనాల వంటి చమురు ఉత్పత్తులు హర్మూజ్ జలసంధి గుండానే ఇతర దేశాలకు సరఫరా చేయాల్సి ఉంది. జలసంధి గుండా వెళ్లే నౌకలను తగలబెడతామని ఇరాన్ అల్టిమేటమ్ జారీచేయడంతో సరకు రవాణా గొలుసు తెగినట్లయింది. హార్మూజ్ దాకా రాలేక 3,200 నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే ఆగిపోయాయి. యూఏఈ, ఒమన్ వద్ద మ రో 500 నౌకలు వేచిచూస్తున్నాయి. ఇంకొన్ని సుదీర్ఘ మార్గమైన ఆఫ్రికా దక్షిణ కొన గుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి.‘ఆఫ్రికా చుట్టూ తిరిగిరావడం వల్ల ప్రయాణ ఖర్చులు ఎక్కువై చివరకు ఆయా దేశాల్లో సరకుల ధరలు ప్రియమవుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అదే జలసంధి గుండా నౌకలు వెళ్లాలంటే.. యుద్ధానికి తెరతీసిన అమెరికానే స్వయంగా తన యుద్ధ విమానాలను రక్షణగా పంపించి జాగ్రత్తగా నౌకలను ఆవలి వైపునకు దాటించాలి’ అని సియాకస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్యాట్రిక్ పెన్ఫీల్డ్ విశ్లేషించారు. ‘మొత్తం ప్రపంచ వాయుమార్గ రవాణాలో పశ్చిమాసియాలో రవాణా కేవలం ఒక శాతమే ఉంటుంది. కానీ విలువ పరంగా చూస్తే యావత్ ప్రపంచ వాణిజ్యంలో 35 శాతం ఉంటుంది. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల రవాణా ఎక్కువ’ అని ఆయన అన్నారు. -
వార్.. బేర్!
ముంబై: పశ్చిమాసియాలో ‘పోరు’ తారాస్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో నాలుగో రోజు ‘బేర్ జోరు’ కొనసాగింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవితకాల కనిష్టాలకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలూ దలాల్ స్ట్రీట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,123 పాయింట్లు పతనమై 79,116 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టం. నిఫ్టీ 385 పాయింట్లు కుప్పకూలి 6 నెలల కనిష్టం 24,481 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,780 పాయింట్లు కుప్పకూలి 78,443 వద్ద, నిఫ్టీ 560 పాయింట్లు తగ్గి 24,305 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. దిగువ స్థాయిలో నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు కొంతమేర నష్టాలు తగ్గాయి. బీఎస్ఈ రంగాల వారీగా ఇండెక్సుల్లో మెటల్ ఇండెక్స్ 4%, పీఎస్యూ బ్యాంక్ 3.50%, ఇండ్రస్టియల్స్ 3.29%, రియల్టీ 3.16%, కమోడిటిస్ 3.12%, క్యాపిటల్ గూడ్స్ 2.64%, ఇంధన 2.59%, సర్వీసెస్ 2.25%, పతనమమ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2.42%, 2.10 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్లో 30 షేర్లలో ఎయిర్టెల్ (1.78%), ఇన్ఫోసిస్ (1.5%), టెక్ మహీంద్రా (0.44%) మాత్రమే లాభపడ్డాయి. → పీఎన్జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిస్టింగ్ రోజు మెరిసింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.386)తో పోలిస్తే 3.62% డిస్కౌంటుతో రూ.372 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ అనిశ్చితుల్లో షేరు నష్టాల నుంచి పుంజుకుంది. చివరికి షేరు 7% లాభపడి రూ.412 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,312.16 కోట్లుగా నమోదైంది.ఆయిల్ మార్కెటింగ్, పెయింట్స్ షేర్లు డౌన్ గల్ఫ్ ఉద్రిక్తతలతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్, పెయింట్ తయారీ కంపెనీ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్పీసీఎల్ 5.41%, బీపీసీఎల్ 4.94%, ఐఓసీ 4.78% నష్టపోయాయి. షాలిమార్ పెయింట్స్ 2.6%, బర్జర్ పెయింట్స్ 2.22%, ఇండిగో పెయింట్స్ 1.49%, ఏషియన్ పెయింట్స్ 0.95 పడిపోయాయి. ఆసియా మార్కెట్లు అల్లకల్లోలం: దక్షిణ కొరియా ‘కాస్పీ’ ఇండెక్సు 14% కుప్పకూలింది. థాయ్లాండ్ ‘సెట్ కాంపోసిట్’ సూచీ 6%, ఇండోనేసియా ‘జకార్తా కాంపోసిట్’ 5% పతనమయ్యాయి. తైవాన్ 4.50%, జపాన్ 4%, సింగపూర్ 2.16%, హాంగ్కాంగ్ 2.05%, చైనా 1% నష్టపోయాయి. 3 రోజుల నష్టాల తర్వాత యూరప్, అమెరికా మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. జర్మనీ డాక్స్ 2%, ఫ్రాన్స్ సీఏసీ 1%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ అరశాతం లాభపడ్డాయి. నాస్డాక్ 1.27% లాభంతో 22,803 వద్ద, డోజోన్స్ 0.5 పెరిగి 48,776 వద్ద ట్రేడవుతున్నాయి. -
హార్మూజ్ హీట్.. ఎగుమతులకు షాక్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులతో భారత వాణిజ్యంపై అనిశ్చితులు నెలకొన్నాయి. దేశ వాణిజ్యం (ఎగుమతులు–దిగుమతులు)పై ఏ మేర కు ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు ఎగుమతిదారులు, లాజిస్టిక్స్ భాగస్వాములతో కేంద్ర వాణిజ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎగుమతిదారులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ (రాడ్టెప్) పథకం కింద.. ఎగుమతిదారుల రవాణా వ్యయాలపై ఇప్పటి వరకు అధిక శాతం రీయింబర్స్మెంట్ సదుపాయం ఉండేది.దీన్ని ఇటీవలే సగానికి తగ్గించడం గమనార్హం. అలా చేయకుండా ఇంతకుముందు మాదిరే అధిక రేట్లను అమలు చేయాలని ఎగుమతిదారులు డిమాండ్ చేశారు. యుద్ధం పేరుతో సరుకు రవాణాపై ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెంచకుండా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (ఈసీజీసీ)ను ఆదేశించాలని, మరిన్ని ఉత్పత్తులను బీమా కవరేజీలో చేర్చాలని కోరారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై ప్రభావం తగ్గించే చర్యలు అవసరమని సూచించారు.సరుకు రవాణాపై స్పష్టత ఉండాలని, అనవసర జాప్యాన్ని నివారించాలని, డాక్యుమెంటేషన్ ప్రక్రియ సాఫీగా, సజావుగా ఉండాలని ఎగుమతిదారులు కోరారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం, ప్రతిగా ఇరాన్ పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా ఎయిర్బేస్లపై దాడులు చేస్తుండడం తెలిసిందే. అంతేకాదు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 15 శాతం, గ్యాస్ సరఫరాలో 20 శాతం రవాణాకు ఈ మార్గమే ఆధారం. ముడి చమురు ఇప్పటికే బ్యారెల్ 85 డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం. పోటీతత్వానికి గండి హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల చమురు వాణిజ్యంపై ప్రభావం పడి ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఎగుమతిదారు లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు వ్యయాలు పెరిగిపోతాయని.. దీంతో భారత వస్తువుల పోటీతత్వం తగ్గిపోతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విమాన రాకపోకల అంతరాయం వల్ల ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయిన సరుకుపై అదనపు చార్జీలు రద్దు చేయాలని అప్పారెల్ ఎక్స్పోర్టర్స్ కౌన్సిల్ ఏఈపీసీ కోరింది.ఎగుమతులపై ప్రభావం.. దేశ ఎగుమతుల్లో సుమారు 15 శాతం విమానాల ద్వారానే జరుగుతుంటాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలు గగనతలాలను మూసివేయడం వల్ల పండ్లు, కూరగాయలు, ఆభరణాల రవాణా భారంగా మారనుంది.ఎంఎస్ఎంఈలకు భరోసా..పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వాణిజ్య శాఖ పేర్కొంది. భారత ఎగుమతులు, దిగుమతులు స్థిరంగా కొనసాగించేందుకు (సరఫరా వ్యవస్థ).. ఎగమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచి్చంది. కస్టమ్స్ అనుమతులు, చెల్లింపులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశ ఉత్పత్తికి అవసరమైన కీలక దిగుమతులపై ఎలాంటి తీవ్ర ప్రభావం లేదని స్పష్టం చేసింది. త్వరగా పాడయ్యే వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, అధిక విలువ కలిగిన తయారీ ఉత్పత్తుల ఎగుమతులు సాఫీగా సాగేందుకు ఉన్న మార్గాలపైనా చర్చించినట్టు తెలిపింది. -
సముద్రంలో బిక్కుబిక్కు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయి. భారతదేశ జెండాలతో కూడిన మొత్తం 37 నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆయా నౌకల్లో 1,109 మంది సిబ్బంది ఉన్నారు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం తర్వాత గల్ఫ్ సముద్ర తీరంలో విదేశీ జెండాలు ఉన్న నౌకలపై పలు దాడులు జరిగాయి.ఈ దాడుల్లో కనీసం ముగ్గురు భారతీయులు మరణించారు. ఈ పరిణామాలు భారత షిప్పింగ్ కంపెనీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత షిప్పింగ్ మంత్రి శర్బానంద సోనోవాల్ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. భారత నౌకలకు, సిబ్బందిని తగిన రక్షణ కల్పించడానికి భారత నావికాదళం, విదేశాంగ శాఖ, మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ) సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. -
హర్మూజ్ జలసంధి: చిక్కుకుపోయిన 700లకుపైగా నౌకలు
ఇరాన్ అధికారికంగా హర్ముజ్ జలసంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1 వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.కాగా, హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశి్చమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఓమాన్తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది.అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ కొంత మేర పైప్లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ, మొత్తం సరఫరాకు అవి సరిపోవు. 1980లలో ఇరాన్-ఇరాక్ ‘ట్యాంకర్ యుద్ధం’ తర్వాత పూర్తిస్థాయిలో హర్మూజ్ మూసివేత జరగలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6 శాతం పెరిగాయి.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. -
చిక్కుల్లో చమురు జీవనాడి
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హార్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా సిగ్నల్స్ జామ్ అవుతుండటంతో మూడు రోజులుగా నౌకలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దాంతో భారత్తో పాటు పలు దేశాలకు చమురు ఇక్కట్లు తలెత్తుతున్న పరిస్థితి! దీనికి తోడు ఇరాన్ దాడుల కారణంగా సౌదీ అరేబియా కూడా తాజాగా చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించడం మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది. ఈ పరిణామాలతో చమురు ధరలకు కూడా రెక్కలొస్తున్నాయి. ఇరుకైన మార్గం హార్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశి్చమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాంతో జలసంధిని దాటేదాకా అవి అత్యంత జాగరూకంగా ఉండాల్సిందే. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ దాడులను కాచుకునే క్రమంలో పరస్పరం జీపీఎస్ జామింగ్, సిగ్నల్ స్పూఫింగ్కు దిగుతున్నాయి. దాంతో ఈ ప్రాంతమంతా ఎల్రక్టానిక్ యుద్దక్షేత్రంగా మారిపోయింది. ఇది నౌకల సిగ్నలింగ్ వ్యవస్థలనూ ప్రభావితం చేస్తోంది. దాంతో అవి తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. తమ నావిగేషన్ వ్యవస్థలు తప్పుడు పొజిషన్లను చూపుతున్నట్టు నౌకల కెపె్టన్లు వాపోతున్నారు. ఈ డిజిటల్ బ్లాకౌట్ దెబ్బకు హార్మూజ్ వద్ద ఏకంగా 1,100కు పైగా చమురు నౌకలు ఇరుక్కుపోయినట్టు ఉపగ్రహ చిత్రాలను బట్టి వెల్లడవుతోంది. ఎలక్ట్రానిక్ బ్లాకౌట్ నౌకలు తమ ప్రయా ణానికి ప్రధానంగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం (ఏఐఎస్)లపై ఆధారపడతాయి. ఇతర నౌకల పొజిషన్ను కూడా ఆ వ్యవస్థల ద్వారానే తెలుసుకుంటాయి. హార్మూజ్, పరిసర ప్రాంతాల్లో ఈ సిగ్నళ్లు రెండువైపులా దాడికి లోనవుతున్నాయి. మొదటిది జామింగ్. దీనివల్ల ఉపగ్రహాల సిగ్నళ్లు బలహీనమో, నిర్వీర్యమో అయిపోతున్నాయి. రెండోది స్పూఫింగ్. దీనిద్వారా నౌకల నావిగేషన్ కంప్యూటర్లు తప్పుడు కో ఆర్డినేట్స్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైన్యం వాడుతున్న దేశీయ కోబ్రా వీ8, సయ్యద్–4 ఎల్రక్టానిక్ యుద్ధ వ్యవస్థలు 250 కి.మీ. పరిధిలోని ఉపగ్రహ సిగ్నల్స్ను పూర్తిగా గందరగోళపరుస్తున్నాయి. తద్వారా తమ యుద్ధనౌకలను అమెరికా, ఇరాన్ బారినుంచి కాపాడుకోవడం ఇరాన్ లక్ష్యం. అయితే ఎల్రక్టానిక్ బ్లాకౌట్ ప్రభావం చమురు నౌకలపైనా తీవ్రంగా పడుతోంది. బ్లాకౌట్ను అధిగమించి హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటడం వాటికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. గుడ్డిగా ముందుకెళ్తే నౌకలు పరస్పరం ఢీకొనే ప్రమాదం పొంచి ఉండటంతో ఆపరేటర్లు రిస్కు తీసుకోవడం లేదు. దాంతో జపాన్, దక్షిణ కొరియా, భారత్, చైనా వెళ్లాల్సిన చమురు నౌకలు పదుల సంఖ్యలో లంగరు వేసి నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పైగా ఆ మార్గాలను ఎంచుకునేందుకు నౌకా సంస్థలు కూడా సిద్ధంగా లేవు. దీనికి తోడు బీమా కంపెనీలు కూడా ఈ మార్గం గుండా సాగే నౌకల బీమా ప్రీమియాన్ని సగటున 50 శాతం దాకా పెంచేస్తున్నాయి! అంతేగాక యుద్ధం తాలూకు రిసు్కకు కవరేజీని నిరాకరిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతకు మించి అంటున్న ట్రంప్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోంది. తాజాగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. వెనెజువెలాపై జరిపిన దాడులకు మించి ఇరాన్పై చేసే అవకాశం ఉందంటూ ప్రకటించారు.ట్రంప్ తన సోషల్ ట్రూత్లో ఇలా రాసుకొచ్చారు. "ఇరాన్ వైపు వెళ్తున్న అమెరికా నౌకాదళం... ఇంతకు ముందు వెనిజులాకు పంపిన దానికంటే పెద్దది. ఏమవుతుందో చూద్దాం" అని పేర్కొన్నారు. తద్వారా ఇరాన్ వైపునకు మరిన్ని బలగాలు పంపడం ద్వారా.. ఆ దేశంపై అణు ఒప్పందం విషయంలో ఒత్తిడి చేయాలన్నదే ట్రంప్ ప్రయత్నంగా కనిపిస్తోంది. అంతకు ముందు..బుధవారం కూడా ట్రంప్ ఇదే తరహా హెచ్చరికలే జారీ చేశారు. సమయం మించి పోతుందని.. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగి రాకపోతే పరిస్థితి దారుణంగా ఉండొచ్చని హెచ్చరించారు. అయితే అందుకు ఇరాన్ కూడా అదే రీతిలో స్పందించింది. తమ వేలు కూడా ట్రిగ్గరైపైనే ఉందని.. అమెరికా దాడులకు దిగితే ప్రతిస్పందన కూడా మునుపెన్నడూ లేని రీతిలో ఉంటుందని అంటోంది.అమెరికా.. టైం తక్కువగా ఉంది, ఇరాన్ వెంటనే చర్చల టేబుల్ వద్దకు రావాలిఇరాన్.. పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా చర్చలకు సిద్ధం, కానీ ఒత్తిడి చేస్తే ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ప్రతిస్పందిస్తాంప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా భారీ నౌకాదళాన్ని మోహరించింది. ప్రధానంగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాప్ట్ క్యారియర్ రెడీగా ఉంది. దీంతో పాటు యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు, సబ్మెరైన్లు.. అలాగే పైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఇరాన్ కూడా ప్రతిస్పందనగా తన షాహిద్ బఘేరి(Shahid Bagheri) డ్రోన్ క్యారియర్ను హార్ముజ్ జలసంధి వద్ద మోహరించింది.హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు కీలకం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంక్షలు కూడా..ఇరాన్పై ఒత్తిడి చేసే క్రమంలో ట్రంప్ సర్కార్ కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెనీపై, అలాగే ఓ ఇరానీయన్ ప్రముఖ వ్యాపారవేత్తపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్లో ఇటీవల జరిగిన ప్రజా నిరసనలను మొమెనీ ఆధ్వర్యంలోని బలగాలు క్రూరంగా అణచివేశాయని.. వేలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని.. అందుకే ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. -
హార్ముజ్ మూసివేత గండం గడిచినట్లేనా?!
ఇరాన్పై ఇజ్రాయెల్ (israel) అమెరికాల(USA) యుద్ధం నేపథ్యంలో హార్ముజ్( Hormuz) జల సంధిని మూసివేస్తామని ఇరాన్ (Iran)ప్రకటించడం కలకలం రేపింది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? ఇది ఇరాన్కు ఉత్తర భాగంలో, ఒమన్, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జలసంధి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో 50 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. లోతు చాల ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానిస్తుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్ కాకుండా ఇంకా గల్ఫ్ దేశాలైన ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2023లో ఈ జలసంధి ద్వారా 2 కోట్ల బారెళ్ల క్రూడ్ ఆయిల్ని ఆ యా గల్ఫ్ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 బిలియన్ల డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్ సరఫరా విలువ.యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ సర్ అలెక్ యూన్గర్ అంచనా ప్రకారం ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్ రేట్లు అంచనాకు మించి పెరిగే అవకాశముంటుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావి తమవుతాయి. ఈ జలసంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతోంది. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచే సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్ను దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా 60%, జపాన్ ఉపయోగించే ఆయిల్లో మూడొంతులు ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలూ దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశంఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడటంతో అంతటా ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్ముజ్ మూసివేత నిర్ణయాన్ని విరమించినట్టు వస్తున్న వార్తలు నిజమైతే అదే పదివేలు! – డా.కొండి సుధాకర్ రెడ్డి లెక్చరర్ -
ఇరాన్ ఎఫెక్ట్.. భారత్కు గ్యాస్ సిలిండర్ టెన్షన్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్ టెన్షన్ మొదలైంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్ నుంచి భారత్కు 95 శాతం ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.మూడింట రెండు అటు నుంచే..దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎరువులపై ప్రభావం.. మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చమురు నిల్వలు ఓకే.. ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.రష్యా నుంచి..భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. -
ఇరుకున పడ్డ ఇరాన్!
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం. ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇరాక్లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది. ఇరాన్తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్కు తోడు నిలిచే అవకాశముంది.చైనా, రష్యాల పరోక్ష సాయంచైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్ అన్నంత పని చేసింది.. ప్రపంచ దేశాలపై ప్రభావం!
టెహ్రాన్: గత కొన్ని రోజులు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్.. అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్.. ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది.భారత్పై చమురు దిగుమతుల ప్రభావంహార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపులో ఉండదు. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు చమురు కోసం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ. -
ఇరాన్ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెలీ అవీవ్, ఇతర ప్రాంతాలను టార్గెట్గా ఇరాన్ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా బాంబు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ..మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని జెరూసలెంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు సమాచారం. ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. జూన్ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్ విమాన సర్వీసులను రద్దు చేసింది.There are close to 50 large oil tankers scrambling to leave the Strait of Hormuz right now. Looks like the oil industry is expecting the Strait to be blockaded in the coming days. pic.twitter.com/ymaJRcax3x— Spencer Hakimian (@SpencerHakimian) June 22, 2025'హార్ముజ్ జలసంధి' మూసివేత!ఇదిలా ఉండగా.. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది. 🚨⚡BREAKING AND UNUSUALBrigadier General Tangsiri, Commander of the IRGC Navy:The Strait of Hormuz will be closed within a few hours. pic.twitter.com/ca1cYFwvvf— RussiaNews 🇷🇺 (@mog_russEN) June 22, 2025 భారత్పై ఎఫెక్ట్.. ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది. -
అదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలే!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. యుద్ధం మొదలైన గత శుక్రవారం నాడు (జూన్ 13న) ఒకే రోజున ఏకంగా 11 శాతం ఎగిసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు ఎకాయెకిన 70.50 డాలర్ల నుంచి 78.50 డాలర్లకు పెరిగి, ఆరు నెలల గరిష్టానికి చేరింది. వారం రోజులుగా ఆ గరిష్ట స్థాయిలోనే తిరుగుతోంది.యుద్ధం ఇదే విధంగా కొనసాగి, చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ గానీ మూసివేస్తే ముడి చమురు రేట్లు 120–130 డాలర్ల వరకు కూడా ఎగిసే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ అదే జరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకూ రెక్కలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ఇరాన్ నుండి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినా, మధ్యప్రాచ్య స్థిరత్వం ప్రభావం భారతీయ మార్కెట్పై పడుతుంది.పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇది ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం. పర్షియన్ గల్ఫ్ నుండి ముడి చమురు ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ దీని ద్వారా వెళుతుంది. 2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ప్రవాహాన్ని చూసింది. ఇది ప్రపంచ పెట్రోలియం వినియోగంలో ఐదవ వంతు. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడం గానీ, ఏదైనా అంతరాయం జరిగితే చమురు కొరత తీవ్రమై ధరల పెరుగుదలకు దారితీస్తుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గం గుండా వెళ్ళే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అంతరాయాల వల్ల ఈ దేశాలు ఏదైనా ఎక్కువగా ప్రభావితమవుతాయి. -
హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్ఎన్జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా


