
బంగుయ్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్లో గురువారం ( జూన్ 26)న ఘోర ప్రమాదం జరిగింది.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఆ దేశ విద్యా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నిలిచింది.
#Breaking
Une #bousculade suite à une explosion de transformateur fait une dizaine de morts cet après-midi au lycée Barthélémy #Boganda de #Bangui en #Centrafrique 🇨🇫. De nombreux blessés ont été transportés vers des hopitaux proches. pic.twitter.com/5loUFDnh5n— KOUAM JOEL HONORE (@honore123) June 25, 2025