Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి | Tragedy in Bangui: 29 Students dies in School Stampede | Sakshi
Sakshi News home page

Bangui: మహా విషాదం, స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి

Jun 26 2025 5:55 PM | Updated on Jun 26 2025 6:32 PM

Tragedy in Bangui: 29 Students dies in School Stampede

బంగుయ్‌: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్‌లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్‌లో గురువారం ( జూన్ 26)న ఘోర ప్రమాదం జరిగింది.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఆ దేశ విద్యా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నిలిచింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement