మిట్టల్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం | Sunil Bharti Mittal first Indian to get Honorary Knighthood from King Charles III | Sakshi
Sakshi News home page

మిట్టల్‌కు నైట్‌హుడ్‌ పురస్కారం

Feb 29 2024 6:22 AM | Updated on Feb 29 2024 6:22 AM

Sunil Bharti Mittal first Indian to get Honorary Knighthood from King Charles III - Sakshi

లండన్‌/న్యూఢిల్లీ: భారతీయ టెలికం రంగ దిగ్గజ పారిశ్రామికవేత్త సునీల్‌ భారతీ మిట్టల్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నైట్‌హుడ్‌ కమాండర్‌ పురస్కారంతో సత్కరించింది. ఎలిజబెత్‌ రాణి మరణం తర్వాత బ్రిటన్‌ రాజసింహాసనాన్ని అధిరోహించిన చార్లెస్‌–3 నుంచి ఈ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్‌ మిట్టల్‌ రికార్డు సృష్టించారు.

బ్రిటన్, భారత్‌ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగాను యూకే ప్రభుత్వం నైట్‌హుడ్‌(కేబీఈ) అవార్డ్‌తో మిట్టల్‌ను గౌరవించింది. భారత్‌లో రెండో అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌కు 66 ఏళ్ల మిట్టల్‌ వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బ్రిటన్‌ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో నైట్‌ కమాండర్‌ కూడా ఒకటి. గౌరవార్థం విదేశీయులకూ దీనిని ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement