తాలిబన్లతో చర్చిస్తున్నా: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ | Pakistan Started Negotiations With Taliban says PM Imran Khan | Sakshi
Sakshi News home page

తాలిబన్లతో చర్చిస్తున్నా: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌

Sep 19 2021 1:28 AM | Updated on Sep 19 2021 8:02 AM

Pakistan Started Negotiations With Taliban says PM Imran Khan - Sakshi

Pakistan initiated dialogue with Taliban after SCO summit అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ తెలిపారు.

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. ఇందుకోసం తాలిబన్లతో చర్చలు ప్రారంభించానని తెలిపారు. తజకీలు, హజారాలు, ఉజ్బెక్‌లకు ప్రభుత్వంలో వాటా ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. అయితే, చర్చల వివరాలను ఆయన బయటపెట్టలేదు. చదవండి: లాటరీ ద్వారానే హెచ్‌–1బీ వీసాలు

ప్రజల హక్కులను గౌరవం లభించేలా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తాలిబన్లకు ఇమ్రాన్‌ హితవు పలికారు. అఫ్గాన్‌ గడ్డ మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారొద్దని చెప్పారు. అఫ్గానిస్తాన్‌లోని కొత్త ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా పాకిస్తాన్‌ చొరవ చూపాలంటూ షాంఘై కో–అపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్సీఓ) సభ్య దేశాలు కోరిన మరుసటి రోజే ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. తాలిబన్ల ప్రభుత్వ మంత్రివర్గంలోని 33 మందిలో తజకీలు, మహిళలకు ప్రాతినిథ్యం దక్కకపోవటం గమనార్హం. చదవండి: అమెరికాపై ఫ్రాన్స్‌ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement