నైజీరియాలో బాంబు పేలుడు | Nigeria: Bombing in Nigeria Borno state kills 16 and injures dozens | Sakshi
Sakshi News home page

నైజీరియాలో బాంబు పేలుడు

Aug 2 2024 6:10 AM | Updated on Aug 2 2024 6:10 AM

Nigeria: Bombing in Nigeria Borno state kills 16 and injures dozens

16 మంది దుర్మరణం 

అబూజ: నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఒక దుకాణసముదాయంలో అమర్చిన బాంబు పేలిన ఘటనలో 16 మంది చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటలకు కవోరీ ప్రాంతంలోని ఒక టీ దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు. 

కానీ చాన్నాళ్లుగా పలు దాడులకు కారణమైన బోకో హరామ్‌ ఉగ్రసంస్థే ఈ దాడికి పాల్పడి ఉంటుందని స్థానిక అధికారులు అనుమానిస్తున్నారు. బోకో హరామ్, దాని చీలిక వర్గం ఇస్లామిక్‌ స్టేట్‌ వెస్ట్‌ ఆఫ్రికా ప్రావిన్స్‌ల దాడులు, అంతర్యుద్ధం కారణంగా నైజీరియా, కామెరూన్, నైజర్, చాద్‌ దేశాల్లో గత 15 సంవత్సరాల్లో 35,000 మందికిపైగా ప్రజలు చనిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement