శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్‌దే: ట్రంప్‌ హెచ్చరిక | Donald Trump Address to nation after Iran Incident | Sakshi
Sakshi News home page

శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్‌దే: ట్రంప్‌ హెచ్చరిక

Jun 22 2025 8:01 AM | Updated on Jun 22 2025 9:39 AM

Donald Trump Address to nation after Iran Incident

వాషింగ్టన్‌: ఇరాన్‌ అణు స్థావరాల ధ్వంసమే అమెరికా టార్గెట్‌ అని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. దాడులను అధికారికంగా ప్రకటించారు. ఇరాన్‌పై దాడులు అమెరికా మిలటరీ విజయమని ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్‌దే అంటూ వ్యాఖ్యలు చేశారు.  

ఇరాన్‌పై అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారిగా స్పందించారు. ట్రంప్‌ వైట్‌ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ఇరాన్‌పై మేము దాడులు చేశాం. కీలకమైన ఇరాన్‌ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే మా లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్‌, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణం. ఇది మా మిలటరీ విజయం. మేం చేసిన దాడులు చాలా కష్టతరం. ప్రపంచంలో ఏ దేశానికి ఇది సాధ్యం కాదు. మేము ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తాం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్‌దే. ఇరాన్‌ శాంతి మార్గం వెళ్లకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఎక్కువ దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చింది. ఇక, యుద్ధం కొనసాగకూడదు. గత 40 ఏళ్లుగా ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా అక్కడ ఉంటున్న అమెరికన్లు చనిపోయారు. ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఇరాన్‌ దాడులను ఆపాలి. ఇప్పటికి శాంపిల్‌ మాత్రమే చూపించారు. ఇరాన్‌ తన తీరు మార్చుకోకపోతే మరిన్ని దాడులు జరుగుతున్నాయి. మా టార్గెట్స్‌ మాకు ఉన్నాయి. మేము తలుచుకుంటే అన్నింటినీ నాశనం చేయగలం. మా లక్ష్యాలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement