అమెరికా చెంప చెళ్లుమనిపించాం | Irans Khamenei warns of repeat strikes in first reaction | Sakshi
Sakshi News home page

అమెరికా చెంప చెళ్లుమనిపించాం

Jun 26 2025 7:35 PM | Updated on Jun 27 2025 12:40 AM

 Irans Khamenei warns of repeat strikes in first reaction

మేమే గెలిచాం

మళ్లీ దాడికి యత్నిస్తే భారీమూల్యం తప్పదు

అమెరికాను హెచ్చరించిన ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీ

యుద్ధం ముగిశాక తొలిసారిగా వీడియో ప్రసంగం

దుబాయ్‌: ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్‌ తన సత్తాను చాటిందని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చెంప చెళ్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్‌పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఒనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవాచేశారు.

 మరోసారి ఇరాన్‌పై దాడికి సాహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం ముగిశాక తొలిసారి ఖమేనీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు హెచ్చరికలు చేస్తూ పది నిమిషాలకుపైగా ఖమేనీ మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్‌ ప్రభుత్వ అధికారిక టెలివిజన్‌ గురువారం ప్రసారం చేసింది.

 

 

 

అమెరికా రాకుంటే ఇజ్రాయెల్‌ ధ్వంసమయ్యేది
‘‘యుద్ధంలో ఇజ్రాయెల్‌ను రక్షించేందుకే అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యంచేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయెల్‌ దారుణంగా ధ్వంసమయ్యేది. అయినా సరే అమెరికా స్థావరాలపైనా క్షిపణుల్ని ప్రయోగించి మా సత్తా చాటాం. ఖతార్‌లోని దోహా నగర సమీపంలోని అల్‌–ఉదేయిద్‌ అమెరికా ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడులు చేశాం. ఇరాన్‌పై అమెరికా దాడులను ట్రంప్‌ అతిశయోక్తిగా చెప్తున్నారు. 

నిజానికి ఇరాన్‌పై దాడులతో అమెరికా సాధించింది శూన్యమే. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్‌ నాశనమవుతుందన్న అంచనాతోనే అమె రికా యుద్ధంలోకి అడుగుపెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ జయకే తనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాభవం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్దస్థాయిలో పరాభవం ఎదుర్కోక తప్పదు’’ అని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో ఖమేనీ కాస్తంత నీరసంగా కనిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement