పర్వత ప్రాంతం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం | China Opens World Longest Expressway Tianshan Tunnel | Sakshi
Sakshi News home page

పర్వత ప్రాంతం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం

Dec 27 2025 12:22 AM | Updated on Dec 27 2025 12:22 AM

China Opens World Longest Expressway Tianshan Tunnel

బీజింగ్: చైనా మరోసారి ప్రపంచ ఇంజనీరింగ్ రంగాన్ని ఆశ్చర్యపరిచే ప్రాజెక్టును పూర్తి చేసింది. షింజియాంగ్ ప్రావిన్స్‌లోని తియాన్‌షాన్ పర్వతాల ప్రాంతంలో నిర్మించిన 22.13 కిలోమీటర్ల పొడవైన ‘తియాన్‌షాన్ షెంగ్లీ టన్నెల్’ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌గా గుర్తింపు పొందింది.

ఈ టన్నెల్‌ ద్వారా గతంలో పర్వత మార్గం గుండా ప్రయాణించడానికి గంటల తరబడి పట్టిన ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతోంది. షింజియాంగ్ ఉత్తర భాగంలోని ఉరుమ్చీ నగరాన్ని, దక్షిణ భాగంలోని యులీ ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించిన G0711 ఉరుమ్చీ–యులీ ఎక్స్‌ప్రెస్‌వేలో ఇది కీలక భాగంగా నిలిచింది.

తీవ్ర చలిలో, మైనస్ 43 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో, 9,842 అడుగుల ఎత్తులో ఈ టన్నెల్‌ను నిర్మించడం ఒక ఇంజనీరింగ్ సవాలుగా నిలిచింది. కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా చైనా మరోసారి తన నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది.

తియాన్‌షాన్ పర్వతాలు షింజియాంగ్‌ను ఉత్తర–దక్షిణ భాగాలుగా విభజిస్తాయి. ఈ టన్నెల్‌ ప్రారంభం వల్ల రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక పరంగా కొత్త అవకాశాలను ఆహ్వానించినట్లు అవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement