Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై | Britain: Theresa May to stand down as an MP | Sakshi
Sakshi News home page

Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్‌బై

Mar 9 2024 6:19 AM | Updated on Mar 9 2024 6:25 AM

Britain: Theresa May to stand down as an MP - Sakshi

లండన్‌: బ్రిటన్‌ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు.

అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్‌ థాచర్‌ తర్వాత బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్‌ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్‌లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్‌ ఒప్పందం పార్లమెంట్‌ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.

Advertisement
 
Advertisement
Advertisement