కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షా తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో సైబర్ మోసాల నిరోధానికి కేయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సావస్కర్ వీడియో (రీల్)కు ద్వితీయ బహుమతి దక్కించుకుంది. అనంతరం సర్టిఫికెట్, ప్రశంసపత్రాలు అందించారు. డీజీపీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ చేతుల మీదుగా సావస్కర్ ప్రశంసపత్రం అందుకున్నారు. వర్సిటీ ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన సాయికుందన్, సంజయ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ సంతోష్ తెలిపారు.


