తాడికొండ: ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఏపీ అసెంబ్లీ మొదటి అంతస్తులోని కాన్ఫరెనన్స్ హాలులో అడ్వాన్న్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐఎస్డబ్ల్యూ ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ సంయుక్తంగా నేతృత్వం వహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పటిష్ట భద్రతా చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.


