ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రికెట్‌ పోటీలు

Aug 7 2026 1:26 AM | Updated on Aug 7 2026 1:26 AM

గుంటూరు లీగల్‌: గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయవాదుల క్రికెట్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. మొదట ఎస్‌వైకే జట్టు... హబీబుల్లా జట్టుపై విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సాయిరామ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నారు. రెండవ సెమీ ఫైనల్‌లో చందు–11 జట్టు, 11 బుల్లెట్స్‌ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న సాజిద్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి , జి. శాంతకుమార్‌, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధిర నాగేశ్వరావు క్రీడాకారులను అభినందించారు. శుక్రవారం ఫైనల్‌ మ్యాచ్‌లో ఎస్‌వైకే, చందు–11 జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. బార్‌ అసోసియేషన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement