
సమస్యలకు సత్వర పరిష్కారం
పోలీసు పీజీఆర్ఎస్లో ఏఎస్పీ జీవీ రమణమూర్తి
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు–పరిష్కారాల వేదక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం చూపుతామని సూచించారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని పో లీస్ అధికారులను ఆదేశించారు. నగరంపాలెం పీఎస్ సీఐ నజీర్బేగ్, పట్టాభిపురం పీఎస్ సీఐ గంగా వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణయ్య కూడా అర్జీలు స్వీకరించారు.