ప్రభుత్వం మాట తప్పింది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మాట తప్పింది

Aug 26 2026 12:18 AM | Updated on Aug 26 2026 12:18 AM

30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్‌ ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌కు అటెండ్‌ కాలేరనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఆఫ్‌లైన్‌లోనే అని చెప్పి, ఆన్‌లైన్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మాట తప్పింది. స్పెషల్‌ టెట్‌పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం.

– పోతంశెట్టి దొరబాబు,

ఎస్‌టీయూ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించాలి

ఇతర రాష్ట్రాల మాదిరిగానే స్పెషల్‌ టెట్‌ ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ఉద్యమబాట పడుతున్నాం.

– ఈవీవీఎస్‌ఎస్‌ ప్రసాద్‌,

యూటీఎఫ్‌ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు

అసెంబ్లీలో తీర్మానం చేయాలి

తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ లేకుండా అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. స్పెషల్‌ టెట్‌ పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసగించింది.

– చింతాడ ప్రదీప్‌ కుమార్‌, పీఆర్‌టీయూ కాకినాడ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement