దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

India Got A record In covid Cases - Sakshi

వాక్సిన్‌తో బ్రిటన్‌ ముందడుగు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ భారత్‌లో కొనసాగుతోంది. ఇప్పటికీ గణనీయ సంఖ్యలో కోవిడ్‌-19 కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,551 మంది కోవిడ్‌ బారిన పడగా, 526 మరణాలు సంభవించినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 95,34,965 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య 4,22,943గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం బాధితులు 89,73,373 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top