Young Woman Missing In Visakhapatnam, Details Inside - Sakshi
Sakshi News home page

Vizag: ఏం జరిగిందో..? ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా..

Nov 12 2022 7:31 PM | Updated on Nov 12 2022 7:59 PM

Young Woman Missing In Visakhapatnam - Sakshi

దోని జగదీశ్వరి(ఫైల్‌ఫొటో)  

తల్లిదండ్రులు చంద్రకళ, ఎల్లాజీరావులతో కలసి కనకలదిబ్బలో నివసిస్తోంది.

అల్లిపురం(విశాఖపట్నం): ఇంటి నుంచి బయటికివెళ్లిన తన కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో కనకలవీధికి చెందిన దోని చంద్రకళ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ జి.సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం దోని జగదీశ్వరి (24) తల్లిదండ్రులు చంద్రకళ, ఎల్లాజీరావులతో కలసి కనకలదిబ్బలో నివసిస్తోంది.
చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి..

ఈ నెల 10వ తేదీ ఉదయం 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిపారు. ఆమె కోసం నగరంలో పలు ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోను వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పిపోయిన జగదీశ్వరి ఎత్తు సుమారు 155 సెంటీమీటర్లు. చామనఛాయతో, గుండ్రని ముఖం కలిగి ఉందని, నీలం రంగు ఫ్యాంటు, బిస్కట్‌ కలర్‌ టీషర్టు వేసుకుని ఉందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 6440796010 ఫోన్‌ నంబర్లలో తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement