ట్రాఫిక్‌ పోలీస్ చొక్కా పట్టుకుని..

Woman Attacks Traffic Police Over Heated Argument In Mumbai - Sakshi

ముంబై : అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసుపై దాడికి దిగిందో మహిళ. ఈ సంఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మసీద్‌ బండార్ ప్రాంతానికి చెందిన సంగ్రికా తివారీ, భేండీ బజార్‌కు చెందిన మెహ్‌సిన్‌ షేక్‌లు స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఓ పని మీద స్కూటీపై బయటకు వెళ్లారు. ఆ సమయంలో స్కూటీ నడుపుతున్న మొహ్‌సిన్‌కు హెల్మెట్‌ లేదు.  ద్విచక్ర వాహనం కాల్దాదేవీ ఏరియాలోని సూర్తీ హోటల్‌ వద్దకు రాగానే ట్రాఫిక్‌ పోలీస్‌ ఏక్తా పర్తే వారి వాహనాన్ని ఆపుచేశారు. హెల్మెల్‌ ధరించనందుకు ఫైన్‌ వేశారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు మహిళలకు, అధికారికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ( టీచర్‌కు బదులివ్వలేదని, కూతురిని )

దీంతో ఆగ్రహించిన సంగ్రికా.. అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటూ ట్రాఫిక్‌ పోలీసు చొక్కా పట్టుకుని దాడికి దిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ శాంతించని సంగ్రికా ఓ మహిళా పోలీసుపై కూడా చెయ్యి చేసుకోవటానికి ప్రయత్నించింది. దీంతో ఇద్దరినీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసినందుకు గానూ వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top