పెళ్లైన ఆర్నెళ్లకే గొడవలు; విరక్తి చెంది భర్తపై.. | Wife Attacks Husband With Acid In Tamil Nadu | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఆర్నెళ్లకే గొడవలు; భర్తపై భార్య యాసిడ్‌ దాడి

Apr 15 2021 8:39 AM | Updated on Apr 15 2021 12:03 PM

Wife Attacks Husband With Acid In Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు/తమిళనాడు: తిరుపత్తూరులో కుటుంబ కలహాలతో ఏర్పడిన ఘర్షణలో భర్తపై భార్య యాసిడ్‌ దాడి చేసింది. తిరుపత్తూరు కోటవీధి చంద్‌ మియన్‌ వీధికి చెందిన నశ్రీన్‌ తాజ్‌ (25) అనే యువతికి బెంగుళూరు జేబీనగర్‌ ప్రాంతానికి చెందిన అప్సల్‌ సయ్యద్‌ (27)తో ఆరు నెలల ముందు వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. విరక్తి చెందిన నశ్రీన్‌ తాజ్‌ భర్త నుంచి విడిపోయి పుట్టింటిలో ఉంటోంది.

ఈ క్రమంలో గత 10వ తేదీ తిరుపత్తూరుకు వచ్చిన అప్సల్‌ సయ్యద్‌  పిన్ని కుమార్తె ఉవేశ్‌తో కలిసి నశ్రీన్‌ తాజ్‌ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెందిన నశ్రీన్‌తాజ్‌ అక్కడ వున్న టాయిలెట్‌కు ఉపయోగించే యాసిడ్‌ను భర్త, ఉవేశ్‌పైన పోశారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్సల్‌ సయ్యద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపత్తూరు టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: ఆలింగనం చేసుకుని చనిపోయిన బావామరదళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement