గోనె సంచిలో మహిళ మృత దేహం.. కుక్కలు పీక్కుతింటుండగా

Uttar Pradesh: Woman Dead Body Found In Meerut - Sakshi

లక్నో: యూపీలో దారుణం చోటు చేసుకుంది. మీరట్​లోని పార్తాపూర్​లో సమీపంలో.. ఒక గోనె సంచిలో ఉన్న మహిళ మృత దేహం కుక్కి ఉండటం కలకలంగా మారింది. కాగా, కాశీ గ్రామంలోని చెరువుకు ఒడ్డున మహిళ  మృత దేహన్ని కుక్కలు పీక్కుతింటుండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అధికారులు వెంటనే మృత దేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్​మార్టంకు తరలించారు. చనిపోయిన మహిళ.. బురఖా వేసుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పాడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయడానికి  పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: రిపబ్లిక్ డే వేడుకలలో అపశృతి.. తలపై పడిన డ్రోన్​.. ఇద్దరికి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top