ఖమ్మంలో విషాదం.. చిన్నారులను చిదిమేసిన రావి చెట్టు

Tree Fall Down Children Deceased Khammam District - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజారులో ప్రమాదవశాత్తు ఓ భారీ రావి వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది. సరదాగా ఆడుకుంటున్న చిన్న పిల్లలపై చెట్టు పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడినవారిలో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన పిల్లల్ని ఆయుష్ (12), దిగంత్(8)గా గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న కాంపౌండ్‌ వాల్‌పై అకస్మాత్తుగా రావి చెట్టు పడిపోయింది.

చదవండి: తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top