దుబాయ్‌ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్‌ ఢీ కొట్టి.. | Three died in road accident | Sakshi
Sakshi News home page

Road Accident: దుబాయ్‌ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్‌ ఢీ కొట్టి..

May 8 2024 8:55 AM | Updated on May 8 2024 9:52 AM

Three died in road accident

సెలవు పెట్టి మరీ దుబాయ్‌ నుంచి వచ్చి.. బంధువుల్ని కలవడానికని వెళ్తూ..

 తండ్రీ, ఇద్దరు కుమారుల మృత్యువాత  

యశవంతపుర: అంబులెన్స్‌– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్‌ (54), ఆయన కొడుకులు శరత్‌ (18), మనన్‌ (15) గుర్తించారు 

 శ్రీనాథ్‌ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. 

ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు.

 అంబులెన్స్‌ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్‌ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement