వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి..

Tamilnadu: Wife Assassinated Husband Over Extramarital Affair - Sakshi

తిరువొత్తియూరు(చెన్నై): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మద్యం, ఆహారంలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు..  సేలం జిల్లా కొళత్తూరు సమీపంలోని కారైకాడు వీరభద్ర న్‌ కొట్టాయంకి చెందిన శక్తివేల్‌ (37) కార్మికుడు. ఇతను మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని తమ్ముడు ముత్తుస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొళత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణలో శక్తివేలు భార్య పుగలరసి (37)కు అదే ప్రాంతానికి చెందిన ముత్తుకుమార్‌తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ సంగతి తెలుసుకున్న శక్తివేల్‌ భార్యను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవడానికి సోమవారం రాత్రి ఆహారంలో విషం కలిపి ఇచ్చి భర్తను పుగలరసి హత్య చేసినట్లు తెలిసింది. దీంతో పుగలరసి, ముత్తుకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్‌.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా'

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top