Suspicious Death Of Software Employee Usha In Vijayawada - Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అత్తింటివారే చంపారని ఆరోపణలు

Aug 23 2021 11:29 AM | Updated on Aug 23 2021 3:28 PM

Software Employees Usha Suspicious Deceased In Vijayawada - Sakshi

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉష ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె ఉషను అత్తింటివారే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉష తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉష సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు విచారణ చేస్తామని చెప్పారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.  

చదవండి: అరకు మత్తులో.. యువత చిత్తు..!

Advertisement
 
Advertisement
Advertisement