సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురి అరెస్ట్‌ | Six Detained In Anantapur Inter Student Incident | Sakshi
Sakshi News home page

సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురి అరెస్ట్‌

Jun 10 2025 7:43 AM | Updated on Jun 10 2025 10:07 AM

Six Detained In Anantapur Inter Student Incident

మొత్తం 18 మందిపై కేసు నమోదు పరారీలో మిగిలిన నిందితులు

పుట్టపర్తి టౌన్‌: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ రత్న సోమవారం చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. దళిత బాలికపై కొన్ని నెలలుగా టీడీపీ కీచకులు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాలిక గర్భం దాలి్చంది. విషయం బయటకు రాకుండా నిందితులు జాగ్రత్త పడుతూ వచ్చారు. 

అత్యాచారం చేసిన వీడియోలు తీసి తల్లీకూతుర్లను బెదిరిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన 14 మందితో పాటు రాజీ కుదర్చడానికి ప్రయతి్నంచిన నలుగురు వ్యక్తులతో కలసి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. 

ధర్మవరం డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ నేతృత్వంలో అచ్చంపల్లి వర్దన్, తలారి మురళి, నందవర్దన్‌రాజు, నాగరాజు, బోయ సంజీవ, బడిద రాజన్నలను రాప్తాడు సమీపంలో అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలతో గాలిస్తున్నామని,  త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ తెలిపారు. మారుమూల ప్రాంతం కావడం, ఆరి్థక చేయూత, అవగాహన లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని, మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టేందుకు భవిష్యత్‌లో అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, ధర్మవరం టూటౌన్‌ సీఐ రెడ్డెప్ప ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement