Karnataka: వ్యభిచార గృహంపై దాడి.. పొరుగు రాష్ట్రాల అమ్మాయిలను పిలిపించి..

Prostitution Racket Busted, Three Held in Hubli Karnataka - Sakshi

హుబ్లీ (కర్ణాటక): హుబ్లీ తాలూకా వరూరు గ్రామంలోని ఎస్‌జీ టవర్స్, అమృత కంఫర్ట్‌ హోటల్‌లో వేశ్యావాటిక నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. యజమాని వెంకటేష్‌ నాయక్, మేనేజర్‌ వీరేష్‌ మురుడేశ్వర, కేఎం.ప్రదీప్‌గౌడ, మంజునాథ గౌడను అరెస్ట్‌ చేశారు. అక్కడ చిక్కుకుపోయిన యువతులను రక్షించారు. నిందితులు పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను పిలిపించి ఆన్‌లైన్‌ ద్వారా విటులను రప్పించే వారని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: (స్పాలో అక్రమాలంటూ.. ఓనర్‌ను బెదిరించి, ఆపై)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top