Odisha Bomb Blast Today: News Journalist Died, Police Suspect Maoist Hand - Sakshi
Sakshi News home page

ఒడిశాలో బాంబు పేలుడు.. జర్నలిస్టు మృతి

Feb 6 2022 6:17 AM | Updated on Feb 6 2022 11:24 AM

Odisha Journalist Killed In Bomb Blast - Sakshi

భవానీపట్నం/భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్‌ రోహిత్‌కుమార్‌ బిశ్వాల్‌(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెలలో జరగబోయే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిస్తూ మావోయిస్టులు మదన్‌పూర్‌ రాంపూర్‌ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్‌ను రోహిత్‌కుమార్‌ తిలకిస్తుండగా అక్కడే బాంబు పేలిందని కలహండీ ఎస్పీ డాక్టర్‌ వివేక్‌ చెప్పారు. జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్‌ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement