తెల్లారితే పెళ్లి.. అంతలోనే మరణం | Sakshi
Sakshi News home page

తెల్లారితే పెళ్లి.. అంతలోనే మరణం

Published Thu, Apr 4 2024 7:55 AM

New groom Died In Yadadri Bhuvanagiri district  - Sakshi

పెళ్లిపీటలెక్కే వేళ నవవరుడు మృత్యు ఒడిలోకి.. 
 

యాదాద్రి భువనగిరి జిల్లా: కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఇంట... నవ వరుడి ఆకస్మిక మరణంతో విషాదం చోటు చేసుకుంది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన యాదయ్య, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నవీన్‌ యాదవ్‌ (24) అలియాస్‌ గురుకి ఇటీవలే బంధువుల అమ్మాయితో వివాహం ఖాయం కాగా.. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది.

కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయం ఎప్పట్లాగే నవీన్‌ తమ వ్యవసాయబావి వద్ద కోళ్లఫారంలో కోళ్లకు దాణా పెట్టేందుకు వెళ్లాడు. పెండ్లి కొడుకును చేసే సమయం అవుతున్నా నవీన్‌యాదవ్‌ ఇంటికి రాకపోవడంతో అతడి సోదరుడు కోళ్లఫారం వద్దకు వెళ్లాడు. అక్కడ నవీన్‌యాదవ్‌ విగతజీవిగా పడి ఉన్నాడు. నవీన్‌ మృతికి కారణాలు తెలియరాలేదు. అతని అంత్యక్రియలు బుధవారం సాయంత్రం పూర్తి చేశారు. 

Advertisement
Advertisement