మంచిర్యాల జిల్లా: ప్రేమ విఫలమై యు వతి ఆత్మహత్యకు పాల్పడిన ఘ టన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చందారం గ్రామానికి చెందిన తు మ్మ అర్చన(21), సమీప గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు వారి ప్రేమను ఒప్పుకోలేదు.
మనస్తాపం చెందిన యువకుడు గత 20 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అర్చన మానసికంగా బాధపడుతుంది. ఈక్రమంలో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి భారతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.


