యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో.. | Missing Young Woman In Chittoor District | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం.. అర్ధరాత్రి మెలకువ రావడంతో..

Nov 25 2022 11:32 AM | Updated on Nov 25 2022 11:32 AM

Missing Young Woman In Chittoor District - Sakshi

పూజిత (ఫైల్‌)

తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిత్తూరు అర్బన్‌: నగరంలోని తేనబండకు చెందిన పూజిత (19) కనిపించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేనబండకు చెందిన బుజ్జి తన భార్య, కుమార్తె పూజితతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు.

అయితే అర్ధరాత్రి మెలకువ రావడంతో లేచి చూసిన బుజ్జికి తన కుమార్తె కనిపించలేదు. తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 8555810860కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
చదవండి: యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ     

Advertisement
 
Advertisement
Advertisement