పెళ్లయిన తొమ్మిది నెలలకే.. కన్నవారింట్లోనే..

Married Woman Commits Suicide in Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం క్రైమ్‌: భర్త వేధింపులు తాళలేక, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక  పెళ్లయిన తొమ్మిది నెలలకే మహిళ కన్నవారింట్లోనే  ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక బుంగవీధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి టూ టౌన్‌ పోలీసులు  శనివారం అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని బుంగవీధికి చెందిన  బి.లక్ష్మి (22) అలియాస్‌ లావణ్యకి  పూసపాటిరేగ మండలం కోనాడకి చెందిన శ్రీనుతో తొమ్మిది నెలల క్రితం పెళ్లయింది. గత కొన్నాళ్లుగా భార్యను పలు రకాలుగా వేధించడం ప్రారంభించాడు.

చదవండి: (నా బాధ మీతోగాని, స్నేహితులతో గాని, టీచర్లతోగాని పంచుకోలేను..)

రోజులు గడుస్తున్నా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శుక్రవారం  విజయనగరం కన్నవారింటికి వచ్చేసింది.  ఇంట్లో అందరూ రాత్రి నిద్రలో ఉన్న సమయంలో  సీలింగ్‌ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  మృతురాలి తల్లిదండ్రులు నీలమ్మ, పైడయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్‌ సీఐ సిహెచ్‌.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top