దారుణం: ఫొటోలు స్టేటస్‌లో పెట్టాడని.. | Man Assassinated For Putting Another Persons Photo In Whatsapp Status | Sakshi
Sakshi News home page

దారుణం: ఫొటోలు స్టేటస్‌లో పెట్టాడని..

Jan 18 2021 7:18 AM | Updated on Jan 18 2021 2:20 PM

Man Assassinated For Putting Another Persons Photo In Whatsapp Status - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర: ఫొటోల వ్యవహారం దళిత యువకుడి హత్యకు దారితీసింది.  వాట్సాప్‌ స్టేటస్‌లో ఫొటోలు పెట్టాడన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటన కర్ణాటకలోని యశవంతపురలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...  ఆంధ్రహళ్లికి చెందిన అభి ప్రవీణ, మనోజ్‌ అనే యువకుల ఫొటోలను అదే ప్రాంతానికి చెందిన శీను అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు శీనా ఇంటికి వెళ్లి చాకుతో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా హతుడు దళిత సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజగోపాల్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement