కోడెల శివరామ్‌ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య | Kodela Sivaram And Nayak Are Seemingly Harassed Man Committed Suicide In Guntur - Sakshi
Sakshi News home page

కోడెల శివరామ్‌ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య

Dec 30 2023 5:29 AM | Updated on Dec 30 2023 10:26 AM

Kodela Sivaram and Nayak are seemingly harassed man sucide - Sakshi

పట్నంబజారు: కోడెల శివరామ్‌ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తు­న్నా­రు. మేడికొండూరు పోలీసు­లు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన  కొల్లోజు ఫణీంద్ర­సాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్‌సెంటర్‌ డీమా­ర్ట్‌లో గేట్‌ ఇన్‌చా­ర్జి­గా పనిలో చేరి సూప­ర్‌వైజర్‌గా ఎదిగాడు. కోడెల శివరామ్‌కు సంబంధించి వ్యక్తిగత పను­లు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూ­రు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్‌లకు చెంది­నవి కూడా చూస్తుంటాడు.

కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో డీమార్ట్‌ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షల­ను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజ­మాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది.

ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్‌ అనుచరుడైన నాయక్‌ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్‌ ఊరుకోరని వేధి­స్తున్నాడు. ఈ క్రమంలో  ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మ­హత్య చేసుకున్నాడు.

కోడెల శివరామ్, నాయక్‌లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకు­న్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్‌ వచ్చి, కోడెల శివరామ్‌ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement