ఖమ్మంలో శ్రీచైతన్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం..

Khammam Sri Chaitanya Student Jump From Building - Sakshi

సాక్షి, ఖమ్మం: హైదరాబాద్‌ నార్సింగి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య ఘటన మరువకముందే ఖమ్మం శ్రీచైతన్య స్కూల్‌లో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. సాయి శరణ్య అనే పదో తరగతి స్టూడెంట్‌.. పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించింది.

ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు.  ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థిని ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడినట్లు చెబుతున్నారు.
చదవండి: సడన్‌ హార్ట్‌ ఎటాక్‌.. కాలేజీలోనే కుప్పకూలిన ఇంజనీరింగ్‌ విద్యార్థి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top