సీబీఐకి కడప ఈపీఎఫ్‌ స్కామ్‌ కేసు

Kadapa EPF Scam Case To CBI - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా కడపలో 2016లో జరిగిన కార్మిక భవిష్యనిధి (ఈపీఎఫ్‌) నిధుల స్కామ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈపీఎఫ్‌ కడప ప్రాంతీయ కార్యాలయంలో రూ.1.64 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2016లో కడప వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో  క్రైమ్‌ నంబరు 137/2016లో ఐపీసీ 403, 406, 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

ఇదే విషయమై సీబీఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం 2017లో కేసు నమోదు చేసింది. ఒక నేరంపై రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేయకూడదు కాబట్టి ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–1946 సెక్షన్‌ 6 ప్రకారం ఈ కేసు దర్యాప్తును సీబీఐకే అప్పగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది.

చదవండి: ఏపీ: షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు 
వాటర్‌ ప్లాంట్లపై కొరడా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top