Anantapur: JC Supporters Attack On YSRCP Leaders In Juturu - Sakshi
Sakshi News home page

జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి

Oct 17 2022 10:14 AM | Updated on Oct 17 2022 11:37 AM

JC Supporters Attacked YSRCP Leaders In Juturu Ananthapuram District - Sakshi

జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి  తెగబడ్డారు.

సాక్షి, అనంతపురం జిల్లా:  జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి  తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement