ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..

Hyderabad Shankarpalli Road Accident Students Dead - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులను ఓల్డ్ నిజాంపేట్‌కు చెందిన దివ్య, ఆమె స్నేహితులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.

చదవండి: కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top