మళ్లీ వివాదం: అమితాబ్‌పై ఎఫ్‌ఐఆర్‌

FIR Registered Against Amitabh And KBC Show Makers For A Question - Sakshi

న్యూఢిల్లీ : కౌన్‌ బనేగా కరోడ్‌ పతీ’ సీజన్‌ 12 తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. షో హోస్ట్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గత శుక్రవారపు కరమ్‌ వీర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్న ఇందుకు కారణమైంది. సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీలను.. 6,40,000 ప్రశ్నను అడిగారు. ( రూ. కోటి ప్రశ్నకు సమాధానం తెలుసా?)

  • డిసెంబర్‌ 25, 1927న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు’’ 
    ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి

అయితే ప్రశ్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బిగ్‌బీతో పాటు షో నిర్వహకులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top