ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలే ఎక్కువ..! | Financial scams abound online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలే ఎక్కువ..!

Oct 21 2023 2:25 AM | Updated on Oct 21 2023 4:32 AM

Financial scams abound online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యాశ, అవగాహన లేమి కారణం ఏదైతే ఏంటి.. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలు గణనీయంగా పెరిగాయి. ఏసీ గదుల్లో కూర్చుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే సైబర్‌ నేరగాళ్లు పెరుగుతున్నారు.

జనవరి 2020 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు దేశవ్యాప్తంగా నమోదైన సైబర్‌ నేరాలపై ఫ్యూచర్‌ క్రైం రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్‌) ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సైబర్‌ నేరాల్లో ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలే 77.41 శాతం ఉన్నట్టుగా తేలింది. ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల్లో ప్రత్యేకించి యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) సంబంధిత మోసాలు 47.25 శాతం ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. నమోదైన సైబర్‌ నేరాలు కేటగిరీల వారీగా పరిశీలిస్తే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement