వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం.. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్మకం

Drugs Using Btech Students Arrested In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లో డ్రగ్స్‌ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొకైన్‌తోపాటు 15 గ్రాముల చరాస్‌, 36 మత్తు టాబ్లెట్లు సీజ్‌ చేశారు. విద్యార్థుల నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి విద్యార్థులు ఇతరులకు అమ్ముతున్నారని తెలిపారు. డ్రగ్స్‌ సేవిస్తున్న మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు బీటెక్‌ విద్యార్థులు రోహన్‌, కాశీరావుగా పోలీసులు గుర్తించారు.

చదవండి: డ్రస్సింగ్‌ రూంలో మహిళల న్యూడ్‌ వీడియోలు చిత్రీకరణ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top