Sakshi News home page

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు: నలుగురికి పదేళ్ల జైలు

Published Fri, Jul 14 2023 7:54 AM

Dilsukhnagar Twin Blasts Case: 10 Years Imprisonment For Four Persons - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దిల్‌సుఖ్‌నగర్‌ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన నలుగురికి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.

వీరిలో డానిశ్‌ అన్సారీ, అఫ్తాబ్‌ ఆలం (బిహార్‌), ఇమ్రాన్‌ ఖాన్‌ (మహారాష్ట్ర), ఒబైదుర్‌ రెహా్మన్‌ (హైదరాబాద్‌) ఉన్నారు. వీరికి 2006 వారణాసి పేలుళ్లకు, 2007 ఫైజాబాద్, లక్నో పేలుళ్లు, 2008 జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌ వరుస పేలుళ్లు, 2010 బెంగళూరు స్టేడియం పేలుడు, 2013 హైదరాబాద్‌ జంట పేలుళ్లతో సంబంధాలున్నట్టు ఎన్‌ఐఏ పేర్కొంది.

పాకిస్తాన్‌కు చెందిన కుట్రదారులతో కలిసి పథక రచన చేసినట్టు వివరించింది. ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఇప్పటికే యాసిన్‌ భక్తల్‌ తదితరులపై అభియోగాలు మోపడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఢిల్లీ వీరిని 2013 జనవరి–మార్చి మధ్య అరెస్టు చేసింది.
చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా!

Advertisement

What’s your opinion

Advertisement