Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల సామూహిక అత్యాచారం

Class 10 Girl molested by Five Students in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌ తట్టిఅన్నారంలో దారుణం జరిగింది. పదవ తరగతి విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. అత్యాచారం సమయంలో నిందితులు వీడియోను తీశారు. ఈ విషయంపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెందిరించారు.

పదిరోజుల తర్వాత మరోసారి ఐదుగురు నిందితులు అత్యాచారం చేశారు. అత్యాచారం వీడియోను నిందితులు తోటి విద్యార్థులకు పంపారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.

చదవండి: (షూటింగ్‌ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top