రూ.50 లక్షలకు టీడీపీ నేత టోకరా | Cheating case against Mallikharjunayadav | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షలకు టీడీపీ నేత టోకరా

Jan 30 2024 6:31 AM | Updated on Jan 30 2024 6:31 AM

Cheating case against Mallikharjunayadav - Sakshi

చంద్రబాబుతో మల్లిఖార్జునయాదవ్‌ (ఫైల్‌)

బొమ్మలసత్రం (నంద్యాల): తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ పనులు చేద్దామని చెప్పి ఓ డీఎస్పీ కుమారుడ్ని నిండా ముంచేసిన ఘటన­లో మైదుకూరు టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి మల్లిఖార్జునయాదవ్‌పై చీటింగ్‌ కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ సన్నిహితుడు, కాంట్రాక్టర్‌ మల్లిఖార్జునయాదవ్‌ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, కొల్లాపూర్‌ మధ్య కేతిపల్లి గ్రామంలో వంతెన నిర్మాణ పనులకు కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడు.

ఈ నేపథ్యంలో నంద్యాలలో నివశిస్తున్న కర్నూలు, నంద్యాల జిల్లాల ఇంటెలిజెన్స్‌ విభాగం ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీ యుగంధర్‌ కుమారుడు చిరంజీవిని  భాగస్తుడిగా చేసుకుని కాంట్రాక్ట్‌ పనులు పూర్తి చేశారు. మల్లిఖార్జునయాదవ్‌ తప్పుడు లెక్కలు చూపిస్తున్నాడనే అనుమానంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో చిరంజీవికి రూ.80 లక్షలు చెల్లించేలా మల్లిఖార్జునయాదవ్‌ ఒప్పందం చేసుకున్నాడు. అయితే రూ.30 లక్షలు చెల్లించి.. మిగతా రూ.50 లక్షలు చెల్లించకుండా మొండికేశాడు.దీంతో చిరంజీవి నంద్యాల తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మల్లిఖార్జునయాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరిబాబు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement