మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో మరో​ ట్విస్ట్‌

Another Twist In Minister Srinivas Goud Assassination Conspiracy Case - Sakshi

సాక్షి, మేడ్చల్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్‌ చేసుకుంది. శ్రీనివాస్‌ గౌడ్‌, సైబరాబాద్‌ సీపీ సహా 18 మందికి మహబూబ్‌నగర్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్‌ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు.
చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?

తన ఇంట్లో సీసీటీవీ, హర్డ్‌ డిస్క్‌లను దొంగించారని రాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్‌ను కిడ్నాప్‌ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో​ గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌ బయటకొచ్చాక మహబూబ్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top