పాతబస్తీ బండ్లగూడలో విషాదం.. | 8 Deceased When Wall Collapsed | Sakshi
Sakshi News home page

గోడ కూలి 11 మంది దుర్మరణం

Oct 14 2020 2:24 AM | Updated on Oct 14 2020 2:38 PM

8 Deceased When Wall Collapsed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడ మహ్మదియా నగర్‌లోని ఓ పహిల్వాన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ గ్రానైట్‌ గోడ కూలి పక్కనే ఉన్న రెండిళ్లపై పడింది. ఈ ఘటనలో 11మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని పోలీసులు మొగల్‌పురలోని అస్రా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ అసద్, ఎమ్మెల్యే అక్బర్‌ పరామర్శించారు. గ్రానైట్‌ రాయితో నిర్మించిన ఈ గోడ పాతది కావడం.. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కూలి ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరో ఘటనలో తల్లీకూతుళ్లు మృతి..
ఇబ్రహీంపట్నం(హైదరాబాద్‌): ఇంటిగోడ కూలిపోయి తల్లీ కూతుళ్లు మృతి చెందగా కుమారుడుకి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మల్‌శెట్టిగూడలో క్యామ సువర్ణ(37) కూతురు స్రవంతి (14), కుమారుడు సంపత్‌ (18)తో కలసి ఓ ఇంటిలో నివాసముంటోంది. సోమవారం నుంచి వర్షం కురుస్తుండటంతో ఇంటి గోడలు బాగా నానిపోయాయి. దీంతో రాత్రి 8 గంటల సమయంలో ఇంటి పైకప్పు గోడలు కూలి సువర్ణ, స్రవంతి, సంపత్‌లపై పడ్డాయి. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు సంపత్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే అతడిని ఇబ్ర హీంపట్నం ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement