చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు ట్రాన్స్కో అర్బన్ డివిజన్ పరిధిలో గుర్తించిన సమస్యలను శుక్రవారం సిబ్బంది పరిష్కరించారు. క్షేత్రస్థాయి పరిధిలో డీఈ, ఏఈ, ఓఅండ్ఎం సిబ్బంది గుర్తించిన సమస్యలను బాగుచేశారు. డివిజన్ పరిధిలోని మిట్టూరు, సంతపేట, గిరింపేట, కొంగారెడ్డిపల్లె, చిత్తూరు రూరల్స్, పూతలపట్టు, కల్లూరు, రొంపిచెర్ల, యాదమరి, పైపల్లె పరిధిలో మొత్తం 11 కేవీ ఫీడర్ల పరంగా 4 సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ పరంగా 29, ఎల్టీ లైన్ 15, సర్వీసు లైన్ పరంగా 36 సమస్యలు పరిష్కారించామని ఈఈ మునిచంద్ర వివరించారు.


